ఆంధ్ర నాటక కళా పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 9:
ప్రథమ పరిషత్తు మహాసభలకు దేశోద్ధారక, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మహామహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, చట్టి చిన పూర్ణయ్యపంతులు, మల్లాది విశ్వనాథకవిరాజు, వనారస గోవిందరావు, కొత్తపల్లి లక్ష్మయ్య వ్యవస్థాపక సభ్యులుగా ధనసహాయం అందించారు. మొదటి రోజున సాంఖ్యాయన శర్మ, రెండవ రోజున కాశీనాథుని నాగేశ్వరరావు ఈ సభలకు అధ్యక్షత వహించారు.
 
పరిషత్తు నాటక సమాజాలకు రైళ్ళలో ప్రయాణ రాయితీలు, టికెట్లపై వినోదపు పన్ను రద్దు, స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించడం, ఒకే పౌరాణిక నాటకాన్ని కొన్నిసమాజాలతో ప్రదర్శింపజేసి, వాటిలో ఉత్తమంగా ఎన్నికైన వాటికి బహుమతులను అందజేయడం, అంతకుముందున్న సంప్రదాయాలను అధిగమించి, స్త్రీ పాత్రధారుల ఫోటోలను కూడా కరపత్రాలలో ప్రచురించి స్త్రీలను కూడా ప్రోత్సహించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆనాడు పరిషత్తులో పాల్గొనడమే ప్రతిష్టాత్మకంగా ఉండేది. ఇక బహుమతి గెల్చుకుంటే ఆస్కార్ అవార్డు లభించినట్లు భావించేవారు. నాటకరంగానికి ఒక పత్రిక అవసరమని తలచిన కొత్తపల్లి లక్ష్మయ్య ‘నాట్యకళ’ అనే పత్రికను 1937 లో ప్రారంభించాడు.
 
మద్రాస్ వాల్టాక్ థియేటర్ లో 1941లో జరిగిన పరిషత్తులో సాంఘీక నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది పది నాటకాలు పోటీకి రాగా గాలి బాల సుందరరావు అపోహా నాటకంలో ప్రముఖ రంగస్థల నటి పూర్ణిమకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే ఆంధ్రశ్రీ చారిత్రక నాటకానికి ప్రథమ బహుమతి రాగా, ఆ నాటకంలో మాంచాల పాత్రధారిణి అంజలీదేవి ఉత్తమ బహుమతి గెలుచుకుంది.
 
పరిషత్తు కార్యవర్గం ఏర్పడిన తర్వాత పరిషత్తు కార్య్రకమాలు కొత్తపుంతలు తొక్కాయి. 1949లో ఏలూరు పరిషత్తులో ఆత్రేయ రాసిన ఎన్.జీ.వో. నాటకానికి ప్రథమ బహుమతి రావడం, 1946లో కాజ వెంకట్రామయ్య గుడివాడలో నిర్వహించిన పరిషత్తు మహాసభలు చరిత్రలో చిరస్మరణీయ సంఘటనలుగా నిలిచాయి.
1948 జనవరి 18న విజయవాడ దుర్గా కళామందిరంలో జరిగిన పద్నాల్గవ పరిషత్తు మహాసభలు జరిగాయి. పరిషత్తు సొంత భవనం కోసం విజయవాడ జింఖానా క్లబ్ ఎదుట రైవస్ కాల్వగట్టున శంకుస్థాపన చేశారు. కానీ రాఘవ కళామందిరం భవన నిర్మాణం ప్రణాళికగానే ఉండిపోయింది.
 
పంక్తి 21:
చలన చిత్ర రంగంలో ప్రముఖులైన ఎందరో కళాకారులు, రచయితలు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు పరిషత్తుతో సంబంధంబఉండి, పరిషత్తు ప్రోత్సాహంతో పైకి వచ్చినవారే. ఉత్తమ ప్రమాణాలను నాటకరంగంలో నెలకొల్పి, అర్థ శతాబ్దం పైగా అత్యుత్తమ సేతలు అందించిన ఈ సంస్థను యధావిధిగా తన కార్య్రకమాలు కొనసాగేలా కాపాడుకోవలసిన బాధ్యత కళాభిమానులందరిపైనా ఉంది.
 
ఇటీవలి కాలం లో సంస్థను పునరుద్ధరించి బొల్లినేని కృష్ణయ్య అధ్యక్షులుగా , అన్నమనేని ప్రసాద రావు కార్యదర్శి గా వ్యవహరిస్తూ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు , వరంగల్లు , విశాఖపట్టణం , తిరుపతి పట్టణాల్లో ప్రాంతాల వారీగా రచయితలు , కవులు ,కళాకారుల సదస్సును నిర్వహించి నాటక రంగ అభ్యున్నతికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. హైదరాబాద్ రవీంద్ర భారతి లో 2013 జూన్ 9న రాష్ట్ర స్థాయి నాటక పరిషత్తుల సదస్సు నిర్వహించి వారు పోటీల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి విస్తృతంగా చర్చించారు.
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]