ఆదర్శ వనితలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 18:
వేదకాలం లో ఋషులు మాత్రమే మంత్రాలు చెప్పలేదు. కొందరు మహిళలు కూడా మంత్రాలు చెప్పారు. అటువంటివారిని ద్రష్టలు అంటారు. వేదద్రష్టలు మంత్ర దర్శినులు అయిన మహిళలు ఇరవై నాలుగు మందికి పైగా ఉన్నారు. గోధ ఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, శశ్వతి, [[లోపాముద్ర]], వాక్, శ్రద్ధ, మేధ, సూర్య, మాంధాత్రి, సావిత్రి మొదలయినవి వారి పేర్లు.
 
[[గార్గి]] పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది. పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది.
 
[[మైత్రేయి]] యాజ్ఞవల్క్యుని భార్య. గార్గితో సమానమైన పండితురాలు. జనకుని ఆస్థానానికి వెళ్ళలేదు అయినా భర్త ద్వారా అన్నీ తెలుసుకుంది. కొన్ని సందర్భాలలో భర్తకు సలహాలనిచ్చేది. ఆదర్శ మహిళగా పేరు పొందింది. [[ఘోష]] ఎక్కువ మంత్రాలు చెప్పిన వనిత. ఈమె తాత దీర్ఘతముడు అనే మహర్షి. తండ్రి కాక్షీవతుడు ఇద్దరూ వైద్య నిపుణులు. చిన్నతనంలో ఈమెకు తెల్ల కుష్టురోగం వచ్చింది. బాధపడింది. అశ్వికుల దయవల్ల, ఆరోగ్యం పొందింది. ఇంకా ఖేలుని భార్య నిష్పల, ముద్గరుని భార్య - వారిద్దరూ యుద్ధ విద్యలలో ఆరితేరినవారు. ఇక రెండవ పులకేశి కోడలు విజ్ఞిక సంస్కృత భాషలో తొలి కవయిత్రి.
పంక్తి 24:
==అలనాటి తెలుగు వనితలు==
===[[ఆతుకూరి(ఆత్మకూరి) మొల్ల]]===
ఈమెనే కుమ్మరి మొల్ల అంటారు. ఈమె మొల్ల రామాయణం అనే గ్రంధం రచించింది. ఆనాటి కాలంలో ఏకైక రచయిత్రి, పదహారవ శతాబ్దం లో ఈమె జీవించింది. తండ్రి కేతన కుమ్మరి పని చేసేవాడు. ఏదైనా ఒక కళను నేర్చుకోవడానికి కులం మొదలైనవి అడ్డం రావని నిరూపించించిన మహిళ మొల్ల. ఈమెను కృష్ణదేవరాయలు సన్మానించాడు.
 
===[[గంగా దేవి]]===
"https://te.wikipedia.org/wiki/ఆదర్శ_వనితలు" నుండి వెలికితీశారు