కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{కాకతీయులు}}
ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు క్రీ.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు<ref>Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London </ref>. ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ఎదురు నిల్చి పోరాడి విశాల సాంరాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్ర జాతికి ఒక కర్తవ్యాన్నీ, విశిష్టతనూ చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
 
క్రీ.శ.1000 --1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడ ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.
==మహోన్నత వీరులు==
తరువాత దశలో క్రీ. శ. .1159- 1261. వరకు తెలంగాణాను పునాదిగా చేసుకుని ఆంధ్ర దేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధు లైన కాకతీయ గణపతి దేవుడు దీర్గ కాలం (1193 --- 1262) వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింప జేశాడు. ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రల నుండి కాకతీయ సాంరాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాప రుద్రుడు. రుద్రమ దేవి అనేక మంది సామంత రాజుల తిరుగు బాట్ల నోడించి సమర్థ వంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాప రుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంబించి నట్లు అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.
 
==కళాకారులకు ఘన సత్కారాలు==
దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహ దానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది. [[పానుగల్లు శాసనంలో ]] మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో ''జలబకరండ '' మనే అపూర్వ మైన వాద్య ప్రశంస వుంది. ఈ కరండ వాద్య కారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని వివర్తనాల బూమిని ఇచ్చి నట్లు వ్రాయ బడివుంది. [[చేబ్రోలు శాసనం]]లో కాకతి గణపతి దేవుడు నృత్తరర్నావళి రచయిత [[జాయప సేనాని]] పదహారు మంది ఆట కత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.
 
==మాన్యాలు, సమ్మానాలు==
[[గుంటూరుజిల్లా]], [[గుంటూరు]] తాలూకా, మంచారమనే (నేటి మందిడం) [[మల్కాపురం శాసనం]]లో 1183 లో కాకతీయ మహారాణీ [[రుద్రమదేవి]] విశ్వేశ్వర శివా చార్యుడు స్థాపించిన గోళకీ మత విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్తకులకూ, ఎనిమిది మంది మార్థంగికులలూ, కాశ్మీరు గాయకునికీ, పద్నాలుగురు గాయనీ మణులకూ, కరడా వాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోష కల్పించి నట్లుంది. శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాల మీద నాట్య సాంప్రదాయలను ప్రతిబింబించే అనేక మైన నాట్య శిల్పాలున్నాయి. అనేక దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండ యాత్రల్లో చిన్నా భిన్నమైనాయి.
 
==రామప్పగుడిలో రమణీయ నృత్యాలు==
శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి [[వరంగల్ జిల్లా]] [[ములుగు]] తాలూకాలో వుంది. ఇది [[వరంగల్లు]] కు నలబై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచ నలవి కానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన [[నృత్తరత్నావళి]]లో ఉదాహరించిన నాట్యశిల్ప మంతా రామప్ప గుడిలో తొణికిస లాడుతూ వుంది.
 
==ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు==
పాలంపేట లోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివర నున్న దేవాలయం లోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిద భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పా లున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాల మీద మార్థంగికు రాండ్ర శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వార బంధంపై రాతి పలక మీద మార్థంగికు రాండ్ర శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది. హనుమ కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి. కాకతీయ యుగంలో నాట్య బహుళ ప్రచారంలో వున్నట్లు ఆ నాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి వుంది. జాయన రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం (నృత్తరత్నావళి) (సంస్కృత గ్రంథం) ఆనాటిదే.
 
==జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని==
కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈ యన వీరుడే గాక, కళాకారుడు కూడాను. నృత్యాలంటే జాయనకు అత్యంత అభిమానం. స్వయంగా ''నృత్తరత్నావళిని రచించాడు.'' ఈ వృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్ట మొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] గారు తెలియ జేశారు ఒక వ్యాసంలో. దీనిని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈ అయ్యకుల సంజాతుడు. పిల్ల చోడన పుత్రుడు. తాతముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వెలనాటి మహీపతుల వద్ద ఈతని తండ్రీ, తాతా సేవలు చేశారు. జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుదు అనే పేర్లాతో పిలువ బడుతూ వుండేవాడు. గణపతి దేవ చక్రవర్తి జాయప యందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమ మైన నృత్తరత్నావళి రచనను పూనుకుని క్రీ.శ. 1253 -- 54 ప్రాంతంలో పూర్తి చేశాడు.
 
==నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన==
నృత్తరత్నావళిలో మార్గ, దేశి నృత్యాలు రెండూ కలిపి కట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆద్యాయా లున్నాయి. మొదటి ఆధ్యాయం నర్తన వివేకం, రెండవ ఆద్యాయం అంగనిరూపణ.,. మూడవ ఆద్యాయం, మండల లక్షణం, నాలుగవ ఆద్యాయం, కరణాంగ హార వివేచానికి సంబందించి నది. ఐదవ ఆద్యాయం దేశి, స్థానక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ వుంది. ఆరవ ఆధ్యాయం దేశ పాట, చారీలాస్యాంగగతి లక్షణమనే పేరు గలది. 6--7--8 ఆద్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేసి, నృత్తపద్దతులన్ని వివరించేవిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంత గానో చాటుతున్నాయి. జాయన నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలంగా చిత్రింఛాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు ఆద్యాలూ దేశి నృత్య సాంప్రదాయాలైన వేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాచకం, దండ రాచకం, శివప్రియం, చిందు, కందుకం, ఖాడిక్కం, ఘంటనరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేక ఆనపద నృత్యాలను వివరించాడు.
 
జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు. జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది.
జాయన 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదిక మణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన నృత్తరత్నావళిని 1253 -- 54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈ నాడు ఆంథ్రుల గర్వించ దగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.
 
==యివి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు