కుందకుందాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాయలసీమ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
 
==పరిచయం==
కుందకుందాచార్యుడు [[తెలుగు]] వాడు.
[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం]] జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది.
ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది...
సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు
జైనమతాన్ని తీసుకుని పద్మనంది (పద్మనంది భట్టారకుడు) అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది. .ఈయన [[జైనమతం|జైనమత]] సాంప్రదాయంలో కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..
 
కొనకొండ గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఈయనను కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు.
ప్రాచీన జైన సాంప్రదాయాల్లో కొండకుందాన్వయం ఒకటి.
 
ఈయనకు గల ఇతరపేర్లు : వక్రగ్రీవుడు(ఈయనకు మెడకొంచెం వంకరగా ఉండేదట), గ్రద్ద పింఛుడు (గద్ద ఈకలపింఛాన్ని చేతపట్టుకుని ఉండేవాడు), ఏలాచార్యుడు.
 
క్రీస్తుపూర్వం 40 ప్రాంతంలో పుట్టినాడని, క్రీ.శ. 44 లో కైవల్యం పొందినట్టుగా చెప్తారు. అంటే సుమారు 85 ఏండ్లు జీవించినట్టుగా తెలుస్తున్నది.
పంక్తి 16:
 
==రచనలు==
కుందకుందాచార్యుడు మహాపండితుడు. సమయాచారం, ప్రవచనసారం, పంచాస్తికాయసారం అనే సారత్రయ గ్రంథాలను, నయమసారమనే 8 గ్రంథాల సంకలనాన్ని, రయనసారం, అష్టసాహుడు, బరసానువాకం, దశభక్తి, మూలాచారం అనే గ్రంథాలను రచించాడు. వీటిలో మూలాచారం జైన సాంప్రదాయంలో అత్యంత ప్రాచీన ప్రామాణిక గ్రంథం.
 
==ప్రాముఖ్యత==
 
కుందకుందాచార్యుడిని జైనులకు గురుపీఠంగా చెప్తారు.ఆయన శిష్యపరంపర తమది కుందకుందాన్వయమని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.
ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు. అన్ని జైనసభలలోనూ ప్రారంభంలో చదివే మంగళా శాసనంలోఆయన పేరు కనపడుతుంది.
 
:''మంగళం భగవాన్ వీరో''
పంక్తి 37:
==మూలాలు, వనరులు==
* తెలుగు దినపత్రికలు
* తెలుగు అకాడమి ప్రచురణలు
 
[[వర్గం:జైనమతము]]
"https://te.wikipedia.org/wiki/కుందకుందాచార్యుడు" నుండి వెలికితీశారు