కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

95 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 13:
|population_total =
|population_density =
|area_magnitude=
|area_total =
|area_telephone =
|climate =
|precip =
|temp_annual =
|temp_winter =
|temp_summer =
|postal_code =
|vehicle_code_range =
|sex_ratio =
|unlocode =
|vehicle_code_range =
|website = kurukshetra.nic.in
|footnotes = [http://kurukshetra.nic.in/general/location.htm]
}}
[[File:Kurukshetram-Te.ogg]]
'''కురుక్షేత్రం''' ([[హిందీ]]: कुरुक्षेत्र) అనే ప్రదేశం ముందు పంజాబు రాష్ట్రంలో ఉంటూ వచ్చింది. ప్రస్థుతం [[హర్యానా]] రాష్ట్రంలో [[కురుక్షేత్రం|కురుక్షేత్ర జిల్లా]]లోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగా పిలువబడుతూ వచ్చింది. కౌరవసాంరాజ్య పూర్వపు చక్రవర్తి అయిన కురుమహారాజు యాగం చేసినభూమి కనుక ఇది కురిక్షేత్రం అయింది. ఇక్కడ 18 అక్షౌహినుల సైన్యం మరణించిన మహాభారత యుద్ధం జరిగిందని పురాణ కథనాలు వివరిద్తున్నాయి.శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత భోధించిన అర్జునుడిని అయోమయ స్థితి నుండి వెలుపలకు తీసుకువచ్చిన ప్రదేశం ఇదని భారతకథ వివరిస్తున్నది.
 
మహాభారతంలో [[కురుక్షేత్ర యుద్ధం]] జరిగినట్టుగా పేర్కొనబడిన ఈ ప్రదేశం హిందువులకు ఇది చాలా ప్రాముఖ్యమున్నది పవిత్రమైనది. ఎందుకనగా ఇక్కడే [[భగవద్గీత]] శ్రీకృష్ణునిచే బోధించబడినది. <ref>[http://kurukshetra.nic.in/history/history.htm History of Kurukhsetra]</ref>. ప్రాంతీయుల కథనం ప్రకారం కురుక్షేత్రం జరిగినది ప్రస్తుత పట్టణానికి దగ్గరలోని చిన్న గ్రామంలోనని చెబుతారు. ఇక్కడకు దగ్గరలోని [[అమిన్]] అనే గ్రామంలోని కోట శిథిలాలను [[అభిమన్యుడు|అభిమన్యుని]] కోటగా పేర్కొంటారు.
 
చారిత్రక ప్రసిద్ధి చెందిన ధానేశ్వర్ లేక స్థానేశ్వర్ ప్రస్థుత కురుక్షేత్రం అని పిలువబడుతున్న నగరానికి ఆనుకుని ఉన్నది. ఇక్కడ ఉన్న స్థానేశ్వర్ ఆలయం కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. స్థానేశ్వర్ ఆలయంలో మూలదైవం మహాశివుడు. ఈ ప్రాంతంలోని అతి పురాతన ఆలయం ఇదే. ఇక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిన్ గ్రామంలో ఉన్న శిధిలావస్థలో ఉన్న కోట అభిఅన్యుడిదని విశ్వసిస్తున్నారు. కొన్ని హిందూ పురాణకతనాలను అనుసరించి కురుక్షేత్రం దాదాపు ప్రస్థుత హర్యానా ప్రాంతమని భావిస్తున్నారు. తైత్తరీయ అరణ్యక కథాన్ని అనుసరించి కురుక్షేత్రం టుర్గన ( పంజాబుకు చెందిన సిర్హింద్ లోని శృఘ్న/సుఘ్) కు దక్షిణంగా , ఖాండవ (డిల్లీమరియు మేవత్ ప్రదేశం)కు ఉత్తరంగా, మరు (ఎడారి)కు తూర్పున, పారిన్ కు పడమర ఉందని వర్ణించబడింది. 2013 జూలై ఆరంభంలో హర్యానాపురాతత్వ పరిశోఫ్హనాశాఖ మరియు పురాతన వస్తు పరిశోధనాశాలలు తమ మొదటి పరిశోధనలలో కురుక్షేత్రంలో లభించిన బౌద్ధస్థూప అవశేషాలు ప్రజల సందర్శనకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.
 
== పేరువెనుక చరిత్ర ==
 
పూర్వము సంవరణుడను రాజు సూర్యుని కుమార్తె యైన తపతిని వరించాడు. సంవరణుడి గురువైన వసిష్టుడు సంవతణుని కోరిక గ్రహించి సూర్యుని ఒప్పించి వారిరువురకు పెండ్లి చేసాడు.వారికి కురువు అను కుమారుడు జన్మించి మాహామేదావియై పదునారేండ్లకే సర్వవిద్యా సంపన్నుడయ్యాడు. సంవరణుడతనికి రాజ్యాభిషేకము చేసాడు. అతనికి సామాన్య రాజులవలె రాజ్యపాలనముచేసి మృతి చెందుట ఇష్టము లేదు. శాశ్వతమైన కీర్తిని సంపాదించిన అమరత్వము పొందాలని కోరుకుని , ఎక్కడ తాను కృషి చేసిన తన కోరిక నేరవేరగలదో యని అన్ని ప్రదేశములను పరిశీలిస్తూ తిరుగి శ్యమంత పంచక మున్న ప్రదేశమును జూచి యిది తన కృషికి సరియైన ప్రదేశమని అనుకుని అచ్చట బంగారు నాగలికి ఒక వైపున రుద్రుని వ్రుషభమును, రెండవ వైపున యముని మహిశామును గట్టి స్వయముగా దున్న నారంభించెను. ఇంద్రుడు వచ్చి యేమి చేయుచున్నావని యడుగగా, కురువు, "నేను ఈ క్షేత్రమున శాశ్వత కీర్తినిగోరి, సత్యము, తపము, క్షమ, దయ, శౌచము (పవిత్రత), దానము, యోగము, బ్రహ్మచారిత్వము అను అష్టాంగములను పటించవలెనని దున్నుచున్నానని చెప్పెను. తరువాత శ్రీహరి వచ్చి, "రాజా! నీవు చెప్పిన అష్టాంగములకు బీజము లెక్కడ నున్నవి? నాయందే కదా! " అనెను. ఆ బీజముల నిమ్మని కురువు తన ఎడమ చేయి చాచెను. విష్ణువు దానిని నరికెను. పాదములతో యాచించగా వానిని గూడ నరికెను. అంతట ఆ రాజు "నా శిరము నరికినను ఇష్టమే కాని ఆ బీజములు మాత్రము ఇచ్చట చల్లి వెళ్ళు " అని ప్రార్ధించెను. అపుడాతని ధర్మ బుద్ధికి మెచ్చి శ్రీహరి, అతనికి దివ్య శరీరమును నను గ్రహించి, "రాజా! నీ పేరుతొ ఈ క్షేత్రము "కురుక్షేత్రమని" ప్రసిద్ధి కెక్కును. ఇది ధర్మక్షేత్రము. ఇక్కడ నున్న ఈశమంతపంచకములోను, వీని మధ్యనుండి ప్రవహించుచున్న " పృథూదక" మను ఈ నదిలో స్నానము చేసిన వారికి అనంత పుణ్యఫలములు కలుగును. ఇచ్చట దానములు చేసినచో ఇతర క్షేత్రములందు చేసినదానికన్నా కోటి గుణితమైన ఫలము కలుగును". అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానం అయ్యాడు.
=== మరొక కథనం ===
పూర్వం పరశురాముడు క్షత్రియ వధ చేసి, ఒకచోట ఐదు రక్త తటాకాలను నిర్మించాడు. ఆ తరువాత కురువు అనే రాజర్షి ఈ హింసా ప్రక్రియకు పరితాపపడి ఆ ప్రదేశాన్ని నాగళ్లతో దున్నించి ఆ స్థానంలోనే తపస్సు చేశాడు. దానికి ఫలితంగా దేవేంద్రుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశంలో యుద్ధాది కారణాలవల్ల మరణించినవారికి స్వర్గం లభిస్తుందని వరమిచ్చాడు. అందువ్ల ఆ ప్రదేశానికి అప్పటినుంచీ కురుక్షేత్రమనే పేరు వచ్చింది. కౌరవ పాండవ యుద్ధం వచ్చినప్పుడు తమ యుద్ధంలో ఏ పక్షము వారు మరణించినా వారికి స్వర్గ ప్రాప్తి కలగాలనే తలంపుతోనే వాళ్లు కురుక్షేత్రాన్ని తమ యుద్ధ క్షేత్రంగా నిర్ణయించుకున్నారు.
పంక్తి 44:
== చరిత్ర ==
ఈ వివిధ కాలాలలో ప్రాంతాన్ని బ్రహ్మవేది, ఉత్తరవేది, ధర్మక్షేత్ర మరియు కురుక్షేత్ర అని పిలువబడుతుంది. కురుమహారాజు ఇక్కడకు వచ్చే సమయంలో ఇది ఉత్తరవేది అని పిలువబడింది.
ఈ భూమిని పలురాజులు పరిపాలించారు. తరువాత భరతచక్రవర్తి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. తరువాత మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం ఆరంభించే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడు. చరవర్తి హర్షవర్ధనుడి కాలంలో ఈ ప్రాంతం ఉన్నత స్థితికి చేరుకున్నది. చైనా యాత్రీకుడు హ్యూయన్ త్సాంగ్ ఇక్కడ ఉన్న స్థానేశ్వరుని సందర్శినచాడని చారిత్రక ఆధారాలద్వారా తెలియవస్తుంది. అశోకచక్రవర్తి కాలంలో కురుక్షేత్రం ప్రఖ్యాత విద్యాకేంద్రంగా రూపుదిద్దుకున్నది.
== విష్ణుసహస్రనామ మందిరం ==
ప్రధాన మందిరంలో భీష్ముడు అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉన్నది. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, పక్కన శ్రీక్రిష్ణుడు, పంచపాండవులు, మునులు మొదలైన వారి పాలరాతి విగ్రహాలు మలచబడి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకవైపు పంచముఖాంజనేయుడు మరొకవైపు సరస్వతి ఉపాలయాలు ఉన్నాయి. మరొక ఉపాలయంలో గంగాదేవి, శ్రీరమచంద్రుని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులు కొందరు ఇక్కడ విష్ణుసహస్రనామం పఠిస్తారని చెప్తారు.
పంక్తి 50:
పవిత్రమైన బ్రహ్మసరోవరం జాలాలలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రతిసంవత్సరం సోమావతి అమావాస్య మరియు గ్రహణ సమయాలలో యాత్రికులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ సందర్భాలలో ఈ సరోవర స్నానం సకల పాపాలను హరించి మోక్షం ప్రసాదిస్తునదని విశ్వసిస్తున్నారు. బ్రహ్మసరోవరం వద్ద స్నానం ఆచరిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందని ప్రతీతి. బ్రహ్మసరోవరం వద్ద అనేక మంది యాగాలు నిర్వహించారు. ప్రచీన బ్రహ్మసరోవరం సువిశాలమైనది. ప్రస్థుతం కురుక్షేత్రం అభివృద్ధి బోర్డ్ అనేక వ్యయప్రయాసలకోర్చి పురాతన సరసులో మూడవ భాగం సరసును తిరిగి నిర్మించారు. దేశంలోని హిందూపుణ్య క్షేత్రాలలోని విశాలమైన సరసులలో ఇది ఒకటని భావించబడుతుంది. ఈ సరోవరం పొడవు 3,600 అడుగులు వెడల్పు 12,00 అలాగే లోతు 15 అడుగులు ఉంటుంది. చక్కని స్నానఘట్టాలు, యాత్రికుల భద్రత కొరకు రైలింగ్ అలాగే స్త్రీలకు ప్రత్యేక స్నానఘట్టాలు ఉన్నాయి. సరసు మధ్యలో సర్వేశ్వర్ శివమందిరం ఉంది. దీనిని 17వ శతాబ్ధంలో మహంత్ శ్రవణనాధ్ నిర్మించారని విశ్వసించ్బడుతుంది. ఈ సరసులో గ్రహణసమయాలలో షుమారుగా ఒకేసారి 5 లక్షలమంది స్నానం చేయడానికి వీలౌతుంది. ఈ కాలువకు అవసరమైన జలాలు భజ్రానంగల్ కాలువ నుండి సరఫరా చేయబడతాయి.గతదశాబ్ధకాలంగా నిర్మానుష్యంగా ఉన్న ఈ క్షేత్రానికి ఇప్పుడు భక్తులరాక అభివృద్ధి అయింది. మిగిలిన భాగం కూడా త్రవ్వి రైలింగ్ స్నానఘట్టాలు, మరియు ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేసే ప్రణాళికలు పూర్తి అయ్యాయంటే పూర్తిగా స్నానఘట్టాలు కలిగిన సరసులలో ప్రపంచంలోనే ఇది మొదటి స్థానంలో ఉంటుంది.
 
== ముఖ్యమైన మందిరాలు ==
* సన్నిహిత సరోవర తీరంలో పలు మందిరాలు ఉన్నాయి. వాటిలో శ్రీలక్ష్మీనారాయణ మందిరం ఒకటి. సరోవరానికి పశ్చిమాన ఉన్న ఈ మందిరంలో లక్ష్మీనారాయణుల సుందర ప్రతిమ ఉంటుంది. యాత్రీకులు విశ్రమించడానికి సౌకర్యాలు ఉన్నాయి. ఈ మందిరాన్ని సిద్ధ శివగిరిబాబా నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు.
* సన్నిహిత సరోవరానికి సమీపంలో బబాకాలీ కమలీ క్షేత్రం ఉంది. ఇక్కడ క్రిష్ణ, అర్జున, శివుని సుందరశిల్పాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రీకులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి.
* హరేక్రిష్ణ తత్వానికి చెందిన గౌడియా మందిరంలో ఇక్కడ రాధాక్రిష్ణుల సుందర విగ్రహాలు ఉన్నాయి. గోరంగ్ మాహాప్రభువని పిలువబడే చైతన్య మహాప్రభువు కొరకు నిర్మించబడిన ఈ మందిరం
గౌడియా మందిరమని పిలువబడుతూ ఉంది. బెంగాలులో జన్మించిన చైతన్య మహాప్రభువును విష్ణు అవతారంగా భావిస్తారు. ఈ మఠంలో బెంగాలీ సాధువులు నివసిస్తారు.
* కురుక్షేత్ర సరోవరం ఉత్తరంలో ఉన్న గీతాభవనానికి సమీపంలో 17వ బాబా శ్రవణ్ నాధ్ నిర్మించిన బాబా శ్రవణ్ నాధ్ హవేలీలో యాత్రికులకు వసతి సదుపాయాలు కలిగిస్తుంది. ఈ మందిరానికి
తూర్పున పంచపాండవులు, మధ్యభాగంలో శ్రీక్రిష్ణ, ఆంజనేయులు ఉంటారు. దక్షిణ భాగంలో దుర్గామాత, శ్రీలక్ష్మీనారయణ మరియు బాబా శ్రవణ్ నాధ్‌ల విగ్రహాలు ఉంటాయి.
* సర్వేశ్వర మహాదేవ మందిరం. కురుక్షేత్ర సరోవరం మధ్యభాగంలో ఉన్న సర్వేశ్వర మహాదేవ మందిరం చేరుకోవడానికి చిన్నపాటి వంతెన నిర్మితమై ఉన్నది. బాబా శ్రవణ్ నాధ్ నిర్మించిన ఈ మందిరంలో ఐదు శిఖరాలతో కూడిన ఐదు మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయంలో శివలింగం, శివ, పార్వతి, గణపతి, నంది విగ్రహాలు ఉంటాయి. మరొక భాగంలో నారాయణుడు, గరుత్మంతుడు ఉండగా ఇతర భాగాలలో హనుమాన్, మాహామాయ, రాఫ్హాక్రిష్ణుల విగ్రహాలు ఉంటాయి. కుంతీదేవి ఈ మందిరంలో శివుని స్వర్ణకమలాలతో పూజించిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
* గోరక్షనాధ్ మందిరం. బ్రహ్మసరోవరం ఎదుట గోరక్షనాధుని మందిరం ఉంది. నాధ సంప్రదాయం అనుసరించి మందొరంలో గురుగోరక్షనాధుడి విగ్రహం ఉంది. ఇక్కడ యాత్రికులు విశ్రమించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. గ్రహణ సమయాలలో స్నానం ఆచరించడానికి వచ్చే సాధువులు అనేకమంది ఇక్కడ విశ్రమిస్తుంటారు.
* జయరాం విద్యా మందిరం. ఇది బ్రహసరోవర తీరలో ఉన్న గీతాభవనం, గుడియా మఠం మద్యన ఉన్నది. సుందరమైన ఈ భవనాన్ని దేవేంద్రస్వరూప్ భ్రహ్మచారి నిర్మించాడు.
పంక్తి 63:
* చంద్రకూపం :- కురుక్షేత్ర సరోవర మధ్యభాగంలో ఉన్న పురుషోత్తమ పురంలో ఉన్న అతి ప్రాచీన ప్రదేశం చంద్రకూపం (బావి). ఈ కూపాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కూపానికి సమీపంలో ఉన్న మందిరంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు ఒక స్ర్హంభం పాతాడని అది కాలగర్భంలో కలీపోయింది కనుక ప్రస్థుతం లేదని కథనాలు వివరిస్తున్నాయి. యాత్రీకులు ఇక్కడ గుప్తదానాలు చేస్తూ ఉంటారు.
* గితా భవనం :- రాజభనం మాదిరిగా ఉన్న ఈ గీతభవనాన్ని రేవారాజు 1921లో నిర్మించాడని కథనాలు వివరిస్తున్నాయి.
* బిర్లా మందిరం :- కురుక్షేత్ర సమీపంలో పహావారోడ్డుకు సమీపంలో ఉన్న బిర్లామందిరాన్ని 1952లో శ్రీజుగల్ కిశోర్ బిర్లా నిర్మించాడు. భగవత్దీగీతా మందిరమని పిలువబడే ఈ మందిరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సుందరమైన వుగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మందిరం గోడలమీద భగవద్గీత శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. మందిరానికి ఉత్తరభాగాన నాలుగు గుర్రాలతో ఒక రాతిరథం నిర్మించబడి ఉంది. రథం మద్యలో కృషార్జనుల విగ్రహాలు ప్రతిష్తిచే పని మిగిలి ఉంది.. రథానికి నాలుగు వైపులా బగవద్గీతలోని ముఖ్యమైన నాలుగు శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి.
* స్థానేశ్వర మందిరం :- థానిసర్ పట్టణానికి షుమారు రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఈ మందిరానికి సమీపంలో ఉన్న సరోవరంలో మహిళల కొరకు ప్రత్యేక స్నానఘట్టం ఉంది. ఈ సరోవర స్నాం సకల కోరికలు తీర్చగలదని,, ఘోర పాపాలను హరింస్తుందని, స్థాణు లింగ దర్శనం స్పర్శ ముక్తిని ఇస్తుందని, తెలియక చేసిన పాపాలు స్థాణు లింగ దర్శనంతో పటాపంచలౌతాయని , వేన మహారాజు ఈ సరోవర జలస్పర్శతో సకలపాపాల నుండి విముక్తిడయ్యాడని, మహాభారత యుద్ధానికి ముండే శ్రీకృష్ణుడు స్థానేశ్వరుని దర్శించాడని కథనాలు వివరిస్తున్నాయి. స్థానేశ్వర దర్శనం చెయ్యకపోతే కురుక్షేత్ర యాత్ర నిష్ఫలమని కథనాలు వివరిస్తున్నాయి.
 
* కాళేశ్వర మందిరం : - స్థానేశ్వర మందిరానికి వెళ్ళే మార్గంలో ఉన్న పురాతన శివాలయమిది. ఇక్కడ ఉన్న తీర్థంలో మాఘమాసంలో స్నానం ఆచరిస్తే విశేషఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
స్థాణుతీర్ధానికి దక్షిణాన ఉన్న ఈ లింగం సర్వపాపహరమని, ఈ లింగ దర్శనం అగ్నిషోమ హోమఫలం ఇస్తుందని విశ్వసించబడుతుంది. ఇక్కడ రావణుడు రుద్రుని స్థాపించాడని చెప్తారు. ఇక్కడి లింగాన్ని కంకారూపి మహారుద్రుడు స్థాపించాడు.
* భద్రకాళీ మందిరం :- 52 శక్తి పీఠాలలో ఇది ఒకటి ఒక ఆలయం. హిందూ మతం పురాణ కథ ప్రకారం, దక్షాయగ్నంలో తనపతి అయిన శివుని దూషణ విని సహించని సతీదేవి తనకుతాను దహించుకుని దేహత్యాగం చేసినతరువాత శివుడు సతీదేవి కొరకు దుఃఖిస్తూ ఆమె దేహం మొస్తూ తిరుగుతున్న సమయంలో శివుని నిజస్థితికి తీసుకు రావడానికి విష్ణుమూర్తి తన చక్రాయుధంతూ సతిదేవి దేహాన్ని ముక్కలు చేసాడు. సతీదేవి దేహభాగం పదిన ప్రదేశాలలో ఆలయాలు నిర్మించబడ్డాయి. సతీదేసి చీలమండలం పడిన ప్రదేశం కురుక్షేత్రం విశ్వసించబడుతుంది. కనుక ఇక్కడి గర్భగృహంలో విష్ణుమూర్తి సుదర్శచన చక్రంతో ముక్కలు చేయబడిన సతీదేవి పాదం పూజలు అందుకుంటున్నది. స్థానేశ్వర మందిరానికి సమీపంలో ఘంసా రోడ్డు పక్కన ఉన్న ఈ మహాకాళీ మందిరం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
* నాభికమల్ మందిరం:- విష్ణునాభి నుండి జన్మించిన కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడి ఆలయంలో సుందరమైన విషువిగ్రహం ఉంది. సృష్టి ఇక్కడే ఉత్పత్తి అయిందని విశ్వసించబడుతుంది. చైత్రమాశ కృష్ణ నాడు ఇక్కడి నుండి ఏడుక్రోశుల కురుక్షేత్ర యాత్ర ప్రారంభం ఔతుంది.
* బాణగంగా :- కురుక్షేత్రంలో బాణగంగ పేరుతో రెండు తీర్ధాలున్నాయి. నరకాతారి అంపశయ్య వద్ద ఉన్న బాణగంగ వద్ద అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దాహాన్ని తీర్చడానికి
అర్జునుడు బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. దయాల్ పూర్ వద్ద ఉన్న రెండవది యుద్ధభూమిలో ఆస్వాల దాహం తీర్చడానికి బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. వైశాఖమాసం, దసరా సమయాలలో ఇక్కడ మేళా ఏర్పాటు చేస్తారు.
* కర్ణుడి ఖేడా :- ఇది బ్రహ్మసరోవరానికి ఒక మైలు దూరంలో ఉంది. యుద్ధసమయంలో కర్ణుడు ఇక్కడ బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడని కథనాలు వివరిస్తున్నాయి.
* ఆప్గా తీర్థం :- కర్ణుడి ఖేడా సమీపంలో ఉన్న అతి పవిత్రమైన సరోవరమే ఆప్గాతీర్ధం సరోవరం. కురుక్షేత్రంలో ప్రవహించిన నదులలో ఒకటైన ఆప్గానది యొక్క వరద ప్రవాహం నుండి ఏర్పడిన సరసు కనుక ఈ సరసుకీ పేరు వచ్చింది. మానస నదికి క్రోశుదూరంలో ఉన్న ఆప్గా నదిని బ్రాహ్మణులు సేవించే వారని వామనపురాణంలో ఉన్నది. ఆప్గానదిలో తర్పణం విడిచిన వారి కోరికలు నెరవేరగలవని విశ్వసించేవారు. బాధ్రపదకృష్ణ చతుర్ధశి మద్యాహ్నం ఇక్కడ తర్పణం విడిచిన వారికి ముక్తి లభిస్తుందని విశ్వసించబడుతుంది.
* జ్యోతిసర్:- కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రధం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ మరియు విష్ణుసహస్రనామము ఆరంభమైన ఆలయం ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు జ్యోతిసర్ మహాదేవుడు ఉండేవాడని అందువలనే ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. ఇక్కడ ఒక ప్రాచీన సరోవరం ఉంది. సరోవరతీరంలో ఉన్న వృక్షం అతిప్రాచీనమైనదని భావించబడుతుంది. దీనిని అక్షయ వటవృక్షమని అంటారు. గితోపదేశం విన్న ఐదు వృక్షాలలో ఇది ఒకటి. థానేశ్వర్ విధ్వంశం జరిగినప్పుడు శిధిలమైన శివాలయం వద్ద అరో వట వృక్షం ఉంది. 1960లో ఇక్కడ శ్రీ కృష్ణ మందిరం నిర్మించబడింది.
* సర్వదమన్ :- ఇది జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం. ఇక్కడ పెన్నే సూర్యకుండ్ అనే తీర్ధం ఉంది.
 
పంక్తి 85:
* మార్కండేయ తీర్థం :- మార్కండేయుడు ఇక్కడ ఆశ్రమవాసం చేసాడని విశ్వసించబడుతుంది. యాత్రీకులు ఇక్కడ స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు.
* రత్నయక్ష తీర్థం:- 48 క్రోసుల కురుక్షేత్ర యాత్రను ఇక్కడి నుండి కూడా ఆరాంభిస్తారు. ఇది కురుక్షేత్ర స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరంలో పిపలీ మార్గంలో ఉంది. ఇక్కడ ఒక పవిత్ర సరసు, కార్తిక మందిరం, రత్నయక్ష మందిరం ఉన్నాయి.
* పిండారా :- ఇక్కడ ఉన్న సోమతీర్ధంలో చంద్రుడు శివుని గురించి తపసు చేసి వ్యాధి నుండి విముక్తిడయ్యాడు. చంద్రుడు ఆరాధించిన క్ ఆరణంగా ఇక్కడ శివుడు సోమేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ స్నానం ఆచరించి సోమేశ్వర దర్శనం చేసుకునే వారు రోగవిముక్తులు ఔతారని భక్తులు విశ్వసిస్తున్నారు.
* సఫీడోం :- సాలవనానికి 10 మైళ్ళదూరంలో ఉన్న ససదోం వద్ద ఉన్న నాగతీర్ధంలో స్నానం ఆచరించి నాగేశ్వరుడికి పెరుగు, నెయ్యి దానం చేస్తే సర్పభయం ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు.
* కైథల్:- పురాణాలలో కపిస్థలంగా వర్ణించబడిన ఈ ప్రదేశం మహావానరుడు హనుమంతుని భూమిగా విశ్వసిస్తున్నారు. యుధిష్ఠతుడు దాయాదులతో శాంతిని కోరుతూ అడిగిన ఐదూళ్ళలో కపిస్థలం ఒకటి. కపిస్థల్ కాలక్రమంలో కైథల్ అయింది. సరోవరం అనే ప్రాచీనమందిరం, ప్రాచీన దుర్గం ఉన్నాయి. ఇక్కడ శ్రావణ మాసంలో బ్రహ్మాండమైన మేళా నిర్వహించబడుతుంది.
పంక్తి 98:
* శాంతి సరోవర్: ఈ సరోవర్ ఏడు పవిత్ర సరస్వతులు కలిసే చోటుగా భావిస్తున్నారు. పవిత్రజలాలను కలిగిన ఈ సరోవరంలో అమావాస్య రోజులలో స్నానమాచరించిన అశ్వమేధయాగం చేసిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
* శ్రీకృష్ణ మ్యూజియం మహాభారతం యుద్ధం చిత్రీకరిస్తున్న కొన్ని చారిత్రక కళాఖండాల మరియు చిత్రాలు ఉన్నాయి.
*సమగ్ర కురుక్షేత్రం మరియు శాస్త్రీయ పరిశోధనా కేంద్రం : ప్రపంచ స్థాయి యుద్ధంగా పరిణమించిన మహాభారత యుద్ధనికి వెనుక ఉన్న శాస్త్రీయ వివరణ సందర్శకులకు ఉత్సుకత కలిగిస్తూ ఉంది.
* కల్పనా చావ్లా నక్షత్ర
* కాసెల్ మాల్: ఆహార, షాపింగ్ మరియు వినోదం కోసం ఒక దుకాణాల సమూహం సహితమైన పలు దుకాణాల సమూహం.
* కాంతి మరియు ధ్వని ప్రదర్శన: కాంతి మరియు శబ్ధం బాలే ద్వారా గీతా సార్ లోని కొన్ని అంశాలను కేంద్రీకరించి కొత్తగా నిర్మించిన పర్యాటక ఆకర్షణ.
*ధారోహర్ : హర్యానా సంస్కృతి మరియు సంప్రదాయాల గురించి సందర్శచి తెలుసుకొన వలసిన వస్తు ప్రదర్శన. ఇది కురుక్షేత్రం విశ్వవిద్యాలయంలో ఉన్నది.
* నరక్తారి వద్ద భీష్మ కుండ్: యుద్ధభూమిలో కూలిన భీష్మపితామహుని దాహం తీర్చడానికి అవసరమైన పవిత్ర జలాల కొరకు అర్జునుడు భూమి వైపుగా బాణం ప్రయోగించిన ప్రదేశం.
* సరస్వతి అభయారణ్యం : ఇది కురుక్షేత్ర జిల్లాలో గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలం ​​ఒక పెద్ద అభయారణ్య ప్రాతం.
* షేక్ చెహ్లీ కా మక్బరా (సమాధి): ఈ భారతదేశ స్మారక చిహ్నం పురాతత్వ సర్వే ద్వారా నిర్వహించబడుతుంది. ఇది సుఫీ సన్యాసి షేక్ చెహ్లీ ఙాపక చిహ్నంగా మొఘల్ కాలంలో నిర్మించబడిని., షేక్ చెహ్లీ మొఘల్ రాజకుమారుడు ధారా షిఖాహ్ ఆధ్యాత్మిక గురువు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇది పొరబాటని రాజకుమారుడు ధారా షిఖాహ్ నిజమైన ముర్షిద్ లేక షేక్ (ఆధ్యాత్మిక గురువు ) షేక్ మియా లాహోరుకు చెందిన మీర్ సాహిబ్ అని భావిస్తున్నారు. అయినప్పటికీ సన్యాసి షేక్ చెహ్లీ రాజకుమారుడు ధారా షిఖాహ్ కు అదనంగా చిన్న ఆధ్యాత్మిక గురువుగా భావిస్తున్నారు. హజ్రత్ మియా మీర్ సాహిబ్ తన పర్యటన సమయంలో మక్బరా (సమాధి) వద్ద ప్రాధనలు నిర్వహించాడని చరిత్రకాఫ్హారాలు తెలియజేస్తున్నాయి. తరువాత సంరక్షకుడు హజారత్ శిష్యుడి దేహం ఇక్కడ ఖననం చేయబడడం వలన పవిత్రమైనదని విశ్వసిస్తున్నారు.
* వాల్మీకి ఆశ్రమం
* భారత ఉపఖండం యొక్క పురాతన నగరాలలో ఒక పటంలో కురుక్షేత్ర
* గురుద్వారా రాజ్ ఘాట్
* గురుద్వారా తీసరీ పత్షాహీ
* గురుద్వారా చెవిన్ పత్షాహీ
* గురుద్వారా సిద్ధ్ బాతీ పత్షాహీ పహిలి
పంక్తి 129:
* టెక్నాలజీ, కురుక్షేత్ర నేషనల్ ఇన్స్టిట్యూట్
* నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్ర.
* కురుక్షేత్ర విశ్వవిద్యాలయం.1956 లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉన్న ముఖ్య విశ్వవిద్యాలయాలలో ఒకటి.
* యూనివర్శిటీ ఇంస్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్రా య్జూనివర్సిటీ.
== వైద్యశాలలు ==
* లోక్ నాయక్ జై ప్రకాష్ సివిల్ ఆస్పత్రి, కురుక్షేత్ర.
* స్వామి అనంత్ ఛారిటబుల్ కంటి ఆస్పత్రి
* సాహ్ని నర్సింగ్ హోమ్: ఔషధ మరియు మద్యం బానిసలు కోసం డి-వ్యసనం సెంటర్ /. ఇది ప్రధాన రహదారి (Pipli రహదారి) కురుక్షేత్ర ఉంది.
* కులువాంతి కంటి ఆసుపత్రి
* ఆశీర్వాద్ నర్సింగ్ హోమ్
* సత్య నర్సింగ్ హోమ్
* కురుక్షేత్ర నర్సింగ్ హోమ్
పంక్తి 148:
* భారతీయ రైల్వే మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్లు ధోడాఖేరి, ధిర్పుర్,ధోలా మజ్ర షహ్బాద్ మర్కండ & మొహ్రి.
== ప్రజలు ==
కురుక్షేత్రంలో అత్యధికులు సైనీ, రాజపుత్ర, రార్ మార్తా, ఖత్రి ప్రజలు. కురుక్షేత్రం లోని ప్రాంతీయ ప్రజలు హర్యంవి, స్వచ్చమైన హిందీ, పంజాబీ భాషలను మాట్లాడుతుంటారు.
== ప్రత్యేకతలు ==
* వాతావరణం:- కురుక్షేత్రంలో వేసవి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది(47°సెనాటిగ్రేడుకు చేరుకుంటుంది) చలికాలంలో అత్యధిక చలిగా ఉంటుంది (1° సెంటీ గ్రేడుకు చేరుకుంటుంది).జూలై మరియు ఆగస్ట్ మాసాలలో వర్షపాతం ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1173350" నుండి వెలికితీశారు