కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 5:
| birth_place = [[పెనుగంచిప్రోలు]], [[కృష్ణా జిల్లా]]
| native_place = నాగపూరు, హైదరాబాదు, మద్రాసు
| death_date = [[జూలై 12]], [[1923]]
| death_place = [[మద్రాసు]]
| death_cause = అనారోగ్యం
పంక్తి 18:
 
}}
[[తెలుగు]] లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు ''విజ్ఞాన చంద్రికా మండలి'' స్థాపకుడు - '''కొమర్రాజు వెంకట లక్ష్మణరావు''' . తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.
 
==సమకాలీన సాహితీ విప్లవం==
{{Quote box
|quote =
:"తెలుగు పలుకుల చరితల తెలివి దేర్చి
:చదువు సర్వస్వమున వన్నె సంతరియ
పంక్తి 31:
}}
ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో నలుగురు మహానుభావులు తెలుగు భాషను, తెలుగు జాతిని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని తెలుగువారికి అందించిన నవయుగ వైతాళికులు వారు.
<ref>[http://www.archive.org/details/TeluguVaitalikuluUpanyasalaSamputamuVol1 తెలుగు వైతాళికులు - ఉపన్యాసాల సంపుటి (ఆర్కీవ్. ఆర్గ్ ప్రతి]- కొమర్రాజు లక్ష్మణరావు జీవితం - కె.రంగనాథాచార్యులు (పేజీలు 1-20)మరియు కొమర్రాజు లక్ష్మణరావు భాషా సేవ - విద్వాన్ విశ్వం.
(పేజీలు21-32)</ref>
<ref>Komarraju Venkata Lakshmana Rao: G.Krishna, Life and Mission in Life Series, International Telugu Institute, Hyderabad, 1984.</ref>
<ref>[http://www.worldcat.org/title/komarraju-venkata-laksmanaravu/oclc/29257146 Komarraju Venkata lakṣmaṇaravu by Akkiraju Ramapatiravu,Visalandhra Publishing house, Vijayawada 1978]</ref>
* [[కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919): సంఘ సంస్కర్త, మూఢాచారాలను వ్యతిరేకించిన మేధావి. తొలి తెలుగు నవల, తొలి తెలుగు కవుల చరిత్ర, తొలి తెలుగు నాటకం, తొలి తెలుగు ఆత్మకథ ఆయనే అందించాడు.
* [[గురజాడ అప్పారావు]] (1861-1915): చిన్నకథకు, వచన వ్యావహారిక నాటకానికి ప్రాణంపోసి, దేశమును ప్రేమించమని, మంచిని పెంచమని బోధించిన వెలుగుజాడ.
* [[గిడుగు రామమూర్తి]] పంతులు (1877-1923): తెలుగు వ్రాతలోనే విప్లవం తెచ్చి, వ్యావహారిక భాషకి సాహిత్యంలో పట్టం కట్టిన వాడు. ఈనాడు సర్వసాధారణంగా మనం వ్రాసే భాషకు ఆ హోదా కల్పించడానికి ఆయన పడ్డ శ్రమ అపూర్వం.
 
==జీవితం==
[[1877]] [[మే 18]] న [[కృష్ణా జిల్లా]] [[పెనుగంచిప్రోలు]] లో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి [[బండారు అచ్చమాంబ]] ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాధమిక విద్యను [[భువనగిరి]] లో పూర్తిచేశాడు.
 
లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు [[నాగపూరు]] (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరు లో ఉంటూ [[మరాఠీ భాష]] ను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ. లో ఉత్తీర్ణుడయ్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, [[ఇంగ్లీషు]] మాత్రమే కాక [[సంస్కృతము]], [[బెంగాలీ]], [[ఉర్దూ]], [[హిందీ]] భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.
 
మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా [[నాయని వెంకట రంగారావు]] సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు. తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్ధిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.
పంక్తి 53:
మహారాష్ట్రదేశంలో ''సమాచార్'', ''వివిధ విజ్ఞాన్ విస్తార్'' అనే పత్రికలకు సంపాదకత్వం వహించాడు. ''కేసరి'', ''మహారాష్ట్ర'' వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. ప్రాచీన మహారాష్ట్ర కవి [[మోరోపంత్]] రచించిన భారతాన్ని పరిశోధించి, సరిదిద్ది శుద్ధప్రతిని తయారుచేసి కర్ణపర్వాన్ని ప్రకటించాడు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇది.
 
అయినా ఆంధ్రభాషతో కాని, ఆంధ్రదేశ వ్యవహారాలతో గాని సంపర్కాన్ని కోల్పోలేదు. నాగపూరులో ఉంటూనే తెలుగు పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. అప్పట్లో [[విజయవాడ|బెజవాడ]] క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన రాయసం వేంకటశివుడు స్త్రీ విద్యా వ్యాప్తికోసం నడిపే "తెలుగు జనానా" పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావులు వ్యాసాలు వ్రాసేవారు. "శివాజీ చరిత్రము" ఆయన మొదటి తెలుగు గ్రంథం. "హిందూ మహా యుగము", "ముస్లిమ్ మహాయుగము" వంటి ఆయన వ్యాసాలు తరువాత "లక్ష్మణరావు వ్యాసావళి" పేరుతో ప్రచురితమైనాయి.
 
==శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం==
కొమర్రాజు లక్ష్మణరావు, [[రాజా నాయని వెంకటరంగారావు]], [[రావిచెట్టు రంగారావు]], ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారు కలసి [[హైదరాబాదు]] లోని అప్పటి రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు స్వగృహంలో [[1901]] [[సెప్టెంబర్ 1]] న [[శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయము]] ను స్థాపించినారు. [[తెలంగాణ]] ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్యోద్దేశ్యం. తెలుగునాట అధునాతన పద్ధతులలో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగినది. [[ఆదిరాజు వీరభద్రరావు]] వంటి మహనీయులు దీనికి కార్యదర్శులుగా పనిచేశారు.
 
==విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి==
పంక్తి 67:
మండలి ప్రచురించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని:
* లక్ష్మణరావు స్వయంగా రచించిన ''హిందూ మహాయుగం'', ''మహమ్మదీయ మహాయుగం''
* డాక్టర్ ఆచంట లక్ష్మీపతి - ''జీవశాస్త్రం'' (3,000 ప్రతులు అమ్ముడు పోయాయి), ''కలరా'', ''మలేరియా'' (ఇవి రెండూ అనతికాలంలోనే 8,000 ప్రతులు అమ్ముడు పోయాయి)
* మంత్రిప్రగడ సాంబశివరావు - ''పదార్థ విజ్ఞాన శాస్త్రం''
* వేమూరి విశ్వనాథ శర్మ - ''రసాయన శాస్త్రం''
పంక్తి 84:
 
==ఆంధ్ర పరిశోధక మండలి==
[[1922]] [[డిసెంబర్ 27]] న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు కలసి ''ఆంధ్ర పరిశోధక మండలి'' స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను ప్రకటించడం, అముద్రిత గ్రంథాలను ప్రకటించడం ఈ సంస్థ లక్ష్యాలు. తెలంగాణా శాసనాలు, షితాబుఖాను చరిత్ర మొదలైన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. తరువాత దీనిని ''లక్ష్మణరాయ పరిశోధక మండలి''గా మార్చారు. ఈ సంస్థ ప్రస్తుతం నామమాత్రంగా హైదరాబాదులోని ''ఆంధ్ర సారస్వత పరిషత్తు'' కార్యాలయంలో ఉంది.
 
==ఆంధ్ర సారస్వత పరిషత్తు==
1916 లో [[కొవ్వూరు]] లో ''ఆంధ్ర సారస్వత పరిషత్తు'' స్థాపించినవారిలో లక్ష్మణరావు ఒకడు. మొదటినుండి యావజ్జీవ సభ్యుడుగా ఉండడమే కాకుండా, కొంతకాలం దానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు.
 
==ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం==
పంక్తి 100:
అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట 'అ'కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో విజ్ఞానశాస్త్రము, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. ''అధర్వవేదం'', ''అద్వైతం'', ''అభిజ్ఞాన శాకుంతలం'', ''అలంకారాలు'', ''అష్టాదశ మహాపురాణాలు'', ''అట్ట బైండు'', ''అష్టాధ్యాయి'' వంటి ఎన్నో వైవిద్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు వ్రాశాడు.
 
ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు.
 
"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. [[మదనపల్లె]] లో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ [[మద్రాసు]] వచ్చాడు. ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే [[1923]] [[జూలై 12]] న లక్ష్మణరావు మరణించాడు.
 
అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. తర్వాత [[కాశీనాధుని నాగేశ్వరరావు]] మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలో ప్రచురించాడు. <ref>[http://www.new.dli.ernet.in/ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 2 పునర్ముద్రణ నకలు (DLIలో) ]</ref> తరువాత డాక్టర్ [[బెజవాడ గోపాలరెడ్డి]] అధ్యక్షతన ఏర్పడిన [[తెలుగు భాషా సమితి]] ఆ కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక, విషయానుక్రమంగా పద్నాలుగు సంపుటాలు ప్రచురించింది. ఈ సంస్థ 1986 లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] లో విలీనమైంది. ఆ తరువాత [[ఉర్లాం]] జమీందారు అయిదు సంపుటాలలో "[[ఆంధ్ర విజ్ఞానం]]" అని [[1938]]-[[1941]] కాలంలో ప్రచురించాడు.
 
సాంప్రదాయక పద్దతిలో విజ్ఞానసర్వస్వం కృషి కొనసాగిస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం తో పోల్చితే, ప్రపంచం నలుమూలలనుండి ఆధునిక అంతర్జాల సౌలభ్యంతో వందల మంది సాధారణ తెలుగు భాషాభిమానులు 2003 లో మొదలుకొని నిర్మిస్తున్న [[మొదటి పేజీ|తెలుగు వికిపీడియా]] విలక్షణమైనదని చెప్పవచ్చు.
 
==సంఘ సంస్కరణ, స్వాతంత్ర్యోద్యమం==
పంక్తి 114:
 
==దేశభాషలలో శాస్త్ర పఠనం==
లక్ష్మణరావు రచనలలో '''దేశభాషలలో శాస్త్ర పఠనం''' అనే వ్యాసాన్ని ప్రత్యేకంగా పేర్కోవాలి. ఈనాటి పరిస్థితులకు కూడా ఈ వ్యాసం నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది. శాస్త్రపఠనానికి కొన్ని భాషలు మాత్రమే అర్హమైనవన్న వాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ '''జ్ఞానమొక భాషయొక్క యబ్బ సొమ్ము కాదు''' అన్నాడు. "''ఆంగ్లభాషపై అభిమానమున్నయెడల ఆ భాషను క్షుణ్ణముగా అధ్యయనము చేయవచ్చును, కాని కమ్మరము, కుమ్మరమును అదేభాషలో చదువవలసిన అవుసరమేమున్నది?''" అన్నాడు. ఈ విషయములో జర్మనులు మనకు ఆదర్శము కావలెనన్నాడు.
 
 
పంక్తి 123:
 
==వ్యక్తి కాదు, సంస్థ==
లక్ష్మణరావు పంతులు ఒక వ్యక్తికాదు, ఒక సంస్థ అని [[కురుగంటి సీతారామయ్య]] తన వ్యాసంలో అన్నాడు. ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన చరిత్రకారులు, వివిధశాస్త్రవేత్తలు ఆయనద్వారా ఆకర్షితులై 'విజ్ఞానచంద్రికా గ్రంథమండలి' ద్వారా దేశానికి పరిచితులయ్యారు. ప్రధమాంధ్ర చరిత్ర నిర్మాత [[చిలుకూరి వీరభద్రరావు]], రసాయనశాస్త్రవేత్త [[మంత్రిప్రగడ నరసింహారావు]], జీవజంతు వైద్యాలలో నిష్ణాతుడై ఆయుర్వేదానికి అఖిలభారత ప్రచారం కలుగజేసినవారిలో ఒకరైన [[ఆచంట లక్ష్మీపతి]], లక్ష్మణరావు చేత ప్రోత్సాహితులైనవారే.
 
మొదట రాజకీయోద్యమాలలోను, తరువాత గ్రంథాలయోద్యమంలోనూ జీవితాన్నర్పించిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ప్రముఖ ఆంధ్ర రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథ రచయిత [[అయ్యదేవర కాళేశ్వరరావు]], తెలంగాణా నాయకుడు ''ఆంధ్రపితామహ'' [[మాడపాటి హనుమంతరావు]], అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలకు సేవచేసిన రావిచెట్టు రంగారావు వంటివారు లక్ష్మణరావు సహచరులు.
పంక్తి 129:
లక్ష్మణరాయ పరిశోధనామండలి కార్యదర్శిగా తెలంగాణంలో చరిత్ర పరిశోధన సాగించిన ఆదిరాజు వీరభద్రరావు లక్ష్మణరావు దగ్గర శిక్షణ పొందినవాడు. ఆర్ధిక శాస్త్రవేత్తగా [[కట్టమంచి రామలింగారెడ్డి]] విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి ద్వారా తెలుగుదేశానికి పరిచయమయ్యాడు.
 
సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగు లోనికి వచ్చాడు. విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడు నిలచిన రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధమాచార్యులుగా పనిచేశాడు.
 
==ఇతర విశేషాలు==
* లక్ష్మణరావు, ఆయన (సవతి) అక్క [[బండారు అచ్చమాంబ]] ల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''అబలా సచ్చరిత్రమాల'' అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు. అచ్చమాంబ 18-1-1905 లో మరణించింది.
* ఇంతటి ఆధునికతను సంతరించుకొన్న లక్ష్మణరావు అభిప్రాయాలు వ్యావహారికభాష వాడకం విషయంలో మాత్రం సంప్రదాయంవైపు మొగ్గు చూపాయి. వైజ్ఞానిక దృక్పథాన్ని విస్తరించడానికి జీవితాన్ని ధారపోసిన ఆయన, విజ్ఞానాన్ని అందరికీ పంచడానికి వ్యావహారికభాష వాడాలని గుర్తించలేకపోయాడు. రచనలలో గ్రాంధిక భాషనే వాడాలని ఆయన అనేకమార్లు నొక్కి వక్కాణించాడు.
* లక్ష్మణరావు కుటుంబం కృష్ణా జిల్లాకు చెందినది. ప్రాధమిక విద్య తెలంగాణాలో జరిగింది. తరువాత మహారాష్ట్ర ప్రాంతంలో చదివాడు. తెలంగాణా పట్ల లక్ష్మణరావుకు ప్రత్యేక అభిమానం ఉండేదని అంటారు. ఆయన హైదరాబాదులో ప్రారంభించిన సంస్థలవలన ఆధునిక తెలుగు భాష వికాసానికి తెలంగాణా ప్రాంతంలో పునాదులు పడ్డాయి. [[పోతన]] నివాసస్థలం అయిన ''ఏకశిలానగరం'', [[కడప]] జిల్లాలోని [[ఒంటిమిట్ట]] కాదని, [[వరంగల్లు]] అని సహేతుకంగా నిరూపించాడు. త్రిలింగాలలో [[ద్రాక్షారామం]], [[శ్రీశైలం]] లతోబాటు మూడవది [[శ్రీకాళహస్తి]] కాదని, [[మంథని]] దగ్గర ఉన్న [[కాళేశ్వరం|కాళేశ్వరమ]] ని మొదటిసారి చెప్పినది ఈయనే. ఒక సందర్భంలో ఈయన ఇలా అన్నాడు - ''ఆంధ్ర దేశమును గురించియు, ఆంధ్ర రాజులను గురించియు, ఆంధ్ర వాఙ్మయమును గురించియును ఎక్కుడు పరిశోధనలను జేసి, క్రొత్తవింతలను కనుగొనదలచినవాఱికి హైదరాబాదు రాజ్యమందలి తెలుగు భాగమొక బంగారపు గని''
* మహారాష్ట్ర ఆచార వ్యవహారాలు లక్ష్మణరావుకు బాగా అలవాటయ్యాయి. ఆయన తలగుడ్డ, పొడుగుకోటు, ఉత్తరీయం వేసుకొనే విధానం అలాగే ఉండేవి. తన కుమారునకు వినాయకరావు అని పేరు పెట్టాడు. ఆయన మొదటి గ్రంథం ''శివాజీ మహారాజు చరిత్ర''. - ఒకసారి ఆయన - ''ఈ మరాఠీవారెప్పుడును ఇట్టి పట్టుదలయు, దేశాభిమానము గలవారు'' అని వ్రాసాడు.
* లక్ష్మణరావు ఎన్నో కొత్త పరిభాషా పదాలను తెలుగులో క్రొత్తగా వాడాడు. వీటిలో చాలావరకు మరాఠీ వాడకంనుండి గ్రహించినవి - ''విశ్వ విద్యాలయం'', ''సంపాదకుడు'', ''శిక్షణ'', ''రాష్ట్రీయ'' అటువంటి కొన్ని పదాలు.
* 46 ఏండ్ల వయసులో, ఆంధ్రసంపుటం వ్రాయడానికి శాసనాలను పరిశీలిస్తూనే, కందుకూరి వీరేశలింగం మరణించిన ఇంటిలో, అదే గదిలో, లక్ష్మణరావు మరణించాడు.
* భారత భాషలలో విజ్ఞాన సర్వస్వం ఆరంభమైంది [[తెలుగు]] లోనే. తర్వాత 1915 లో [[మరాఠీ]] లో విజ్ఞాన సర్వస్వం ఆరంభమై 21 సంపుటాలలో 1927నాటికి పూర్తి అయ్యింది. [[బెంగాలీ]] లో [[విశ్వకోశం]] అనే పేరిట విజ్ఞాన సర్వస్వం తర్వాత ప్రచురితమైంది. మిగతా అనేక భాషలలో ఆ ప్రయత్నం అలా కొనసాగడానికి మునుముందే తెలుగులో ఆ బృహత్కార్యాన్ని లక్ష్మణరావు ఆరంభించాడు.
* తెలుగు భాషకు ఆయన చేసిన సేవ మరువరానిది. ప్రత్యేకించి [[తెలుగు వికీపీడియా]] కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి ఆయన చేసిన సేవ స్మరణీయము.
*పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము#కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రము| విజ్ఞానసర్వస్వ కేంద్రమునకు]] లక్ష్మణరావు పేరు పెట్టారు.
*క.రామానుజరావు అనే కలంపేరు కథానికలు రాశారని తెలుగులో మారు పేరురచయితలు -కె.సి అశోక్ కుమార్, ప్రొఎ.ఎ.ఎన్ రాజు పుస్తకం ప్రవేశిక వ్యాసంలో కె.కె.రంగనాథాచార్యులు పేర్కొన్నాడు. <ref>[http://archives.andhrabhoomi.net/sahiti/kalam-perlu-045 తెలుగులో మారు పేరురచయితలు -కె.సి అశోక్ కుమార్, ప్రొఎ.ఎ.ఎన్ రాజు పుస్తకం ప్రవేశిక వ్యాసంలో కె.కె.రంగనాథాచార్యులు]</ref>
 
==మూలాలు==
పంక్తి 149:
==బయటి లింకులు==
*[http://www.prabhanews.com/lifestyle/article-242176 అక్కిరాజు రమాపతిరావు గారి వ్యాసం '''శ్రీ శివరావు గారి జీవిత చరిత్ర రాసే అదృష్టం కలిగింది''' ఆంధ్రప్రభలో పరిశీలనతేది:2013-12-04]
* [http://www.vepachedu.org/komarraju.html వేపచేదు జాలస్థలిలో Lakshmanarao Komarraju (1877-1923)- శ్రీనివాసరావు వేపచేదు ఆంగ్ల వ్యాసం]