గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''గిడుగు వెంకట సీతాపతి'''
| residence =
| other_names =గిడుగు వెంకట సీతాపతి
| image =Gidugu venkata seethapathirao.jpg
| imagesize = 200px
| caption = గిడుగు వెంకట సీతాపతి
| birth_name = గిడుగు వెంకట సీతాపతి
| birth_date = [[జనవరి 28]], [[1885]]
| birth_place = [[విశాఖపట్నం]] జిల్లా [[భీమునిపట్నం]]
| native_place =
| death_date = [[ఏప్రిల్ 19]], [[1969]]
| death_place = [[హైదరాబాదు]]
| death_cause =
| known = సిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత.<br />
| occupation =[[పర్లాకిమిడి]]లో చరిత్రోపన్యాసకులు<br />చలనచిత్రాలలోను మరియు కొన్ని నాటకాలలోను నటించారు. <br />జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.
| title =
పంక్తి 41:
'''గిడుగు వెంకట సీతాపతి''' (జననం-[[1885]]. మరణం-[[1969]]) ప్రసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది '''చిలకమ్మపెళ్ళి'''.
 
వీరు [[జనవరి 28]], [[1885]] సంవత్సరంలో [[విశాఖపట్నం]] జిల్లా [[భీమునిపట్నం]]లో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన [[గిడుగు వెంకట రామమూర్తి]] దంపతులకు జన్మించారు.
 
[[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం [[పర్లాకిమిడి]]లో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, [[సవర]] భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. [[రైతుబిడ్డ]], [[స్వర్గసీమ]], [[పల్నాటి యుద్ధం]], [[భక్తిమాల]] వంటి కొన్ని చలనచిత్రాలలోను మరియు కొన్ని నాటకాలలోను నటించారు.
 
1945లో [[మాగంటి బాపినీడు]] సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో [[తెలుగు భాషా సమితి]] ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. [[సూర్యరాయాంధ్ర నిఘంటువు]]కు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
పంక్తి 49:
వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి: 'భారతీ శతకము', 'సరస్వతీ విలాసము', 'కొద్ది మొర్ర'. వీరు రాసిన 'బాలానందము' వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు [[బైబిల్]] లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధనపై [[తెలుగు సాహిత్య చరిత్ర]]ను ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు రచించిన 'తెలుగులో ఛందోరీతులు' అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
 
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను [[ఒరిస్సా]] రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు [[లండన్]] వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒరిస్సా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.
 
తండ్రి అనంతరం [[రాజమండ్రి]] చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.