తెలంగాణ గడీలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
<big>[[తెలంగాణ గడీలు]]</big>{{fact}}
 
రాజులు, రాచరికాలు, అరాచకంగా రాజ్యాలేలిన చరిత్ర ప్రపంచ వ్యాప్తమే....... అది గతించిన కాలం. మన దేశంలో రాచరిక వ్వవస్త రూపు మాసి పోయి శతాబ్దాల కాలమే అయినది. [[బ్రిటిష్]] వారి పాలనలో మెల్లి మెల్లిగా రాచరికపు వ్వవస్త రూపు మాసి పోయింది. దేశం మొత్తానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్రం వచ్చినా ఈ దేశంలోని మూడు సంస్థానాలలోని ప్రజలు స్వాతంత్రానికి నోచుకోలేదు. ఆయా సంస్థానాల రాజులు మొండి పట్టుదలతో స్వాతంత్ర భారత్ లో కలవ డానికి ఒప్పుకోలేదు. అవి [[హైదరాబాద్ సంస్థానం,]] [[కాష్మీర్ రాజ్యం]], [[జునాఘడ్ సంస్థానం]]. కాష్మీర్ రాజ్యంలో ప్రజలందరు ఎక్కువగా ముస్లింలు అయితే రాజు మాత్రం హిందువు. కాని హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరు ఎక్కువగా హిందువులైతె రాజు మాత్రం ముస్లిం. హైదరాబాద్ [[నైజాం]] తన రాజ్యాన్ని పరిపాలన సౌలబ్యంకొరకు చిన్న చిన్న విభాలుగా చేసి ఆ ప్రాంతాన్ని ఒక 'దొర' చేతిలో పెట్టాడు. ఆ దొర ఆ ప్రాంతానికి జమీందారు. పరిపాలన అంతా అతని కనుసన్నలలోనె జరిగేది. అతనొక నియంత, క్రూరుడు. ప్రజలను పీడించుకు తినె వాడు. ఆ 'దొర' సంవత్సరాని ఇంత అని నిజాంకు [[కప్పం]] కట్టే వాడు. స్థానికి పరిపాల అంతా తన ఇష్ట ప్రకారమే జరిపేవాడు. అప్పటికే ప్రజలు నిజాం పైన, స్థానిక పాలకుడైన దొరల పైన కోపంగా వున్నారు. ఇంతలో భారత ప్రభుత్వం ఈ సంస్థానాలను స్వతంత్ర భారత్ లో విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దానిని వ్వతిరేకించిన నిజాము , అతని సహచరులు స్థానిక దొరలు ప్రజలపై పడి విపరీతంగా బాధించి దోచుకోవడం ప్రారంబించారు. దీంతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు నిజాము పైన, స్థానిక దొరలపైన సాయుధ తిరుగుబాటు చేశారు. నిజాముకు మద్దతుగా కొన్ని దుష్ట శక్తులు, ప్రజలకు మద్దతుగా స్థానిక కమ్యూనిష్టులు, భారత ప్రభుత్వం నిలవగా ఏడాదికి పైగా ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్రం లభించింది.
 
నైజాం రాజ్యంలో స్థానిక పాలకులైన .దొర లు. నివాసాలకు, రాజరికపు అరాచకపు కార్యకలాపాలకు నెలవులైన కట్టడాలే గడీలు. అనగ చిన్న చిన్న కోటలే ఈ గడీలు. ప్రజల తిరుగుబాటు సమయంలో గడీల పాలకులైన దొర లు తమ భూములను, గడీలను వదిలి హైదరాబాద్ నగరానికి పారిపోయి నిజాం రక్షణలో ఆశ్రమం పొందారు.
ఆవిధంగా వెల్లిన దొరలు నగరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించ సాగారు. ఇప్పుడు భూములకు, స్థిరాస్తులకు విపరీతమైన విలువ పెరగడంతో ఆ మాజీ దొరలకు, లేదా వారి వారసులకు తమ గడీలు, తమ భూములు గుర్తుకొచ్చి తమ పల్లె బాట పట్టారు. తమ గడిలను, భూములను అమ్మకానికి పెట్టారు. కాని స్థానిక ప్రజలు ఆ గడిలు భూములు తమ శ్రమ దోపిడి పలితాలను కనుక అవి తమ ఉమ్మడి ఆస్తి అని దొరలకు అడ్డు తగులుతున్నారు. నిజాం లొంగు బాటు తో నిజాం పాలనా భవనాలు, ఇతర రాజరికపు కట్టడాలు ఎలా ప్రభుత్వం పరమైనాయే అదే విధంగ ఈ గడీలు
దొరలు గడీలను వదిలి పట్నం చేరగా ఆలనా పాలనా లేని ఆ గడీలు అనాదలా మిగిలి పోయాయి. రాజారం గడీలో గుడ్లగూబలు, తపాల్ పూర్ గడీలో గబ్బిలాలు, ముద్దనూర్ గడీలో గండు పిల్లులు, దోమ కొండ గడీలో పాముల పుట్టలు నేరెళ్ల గడీలో ......."ఓస్త్రీ..... రేపు రా...." అనే రాతలు దర్శనమిస్తాయి. కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991 లో గ్రామస్తులు లూటీ చేశారు. పోలీసులు నూట ఇరవై మంది అరెస్ట్ చేసి వారిపై కేసులు కూడ పెట్టారు. ఆవివాదం చాల ఏళ్లు నడిసింది. అయితె ఇటీవల కాలంలొ పల్లేల్లో సర్పంచులు, ''ఎంపిటీసీలు, జడ్పీటీసీలు'', మండలాద్యక్షులు వంటి రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. విద్వావంతులు పెరిగి పోయారు. ప్రజలలో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యమే గడీలను తమ ఉమ్మడి ఆస్తిగా బావించేలా చేస్తున్నది. దాని కొరకు ఎదురు తిరిగేలా చేస్తున్నది. తెలంగాణ కవి [[అన్నవరం దేవేందర్]] అన్నట్టు........"ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చ పడేది. ఇప్పుడు దాంట్లోనే పోస్తున్నం" గడీలన్ని ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగు బాటు [[చల్ చల్ గడీ]] తో ప్రారంబ మైనది.
 
దొరల భూములు తమ ఉమ్మడి ఆస్తులని ప్రజల వాదన. ఈ వాధనతో గత కాలపు గడీ ల చరిత్ర మరలా తెరపైకి వచ్చింది. ఆ గడీల చరిత్ర కొంతైనా తెలుసు కోవాలనుకునే తెలియని ప్రజలకొరకు వ్యాసం.
 
==చల్ గల్ గడీ==
కరీంనగర్ జగిత్యాల మండలంలో వున్న చల్ గల్ గడీ రాజుల కోటను తలపిస్తుంది. డంగు సున్నంతో నిర్మించిన ఆ గోడలు నేటికి చెక్కు చెదర లేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్థంభాలతో ఉండే ఆ గడి రెంటో అంతస్తు పైకెక్కి చూస్తే ఆ చుట్టూ అయిదారు కిలోమీటర్ల దూరం వరకు, పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణ భూపాల్ రావు అప్పట్లోనే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లి పోయాడు. చల్ గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలో వున్నందున అక్కడి భూములుకు విపరీతమైన విలువ వచ్చింది. దాంటో గడీ యజమాని గడీని అమ్మకానికి పెట్టాడు. కాని ప్రజలు వ్యతిరేకించారు. ఆ గడీని తమ గ్రామానికి విరాళంగా ఇమ్మని ప్రజలు కోరు తున్నారు.
 
==బండ లింగా పూర్ గడీ=={{fact}}
రంగా రెడ్డి జిల్ల ఇబ్రహిం పట్నం మండలంలో ఈ గడీ చుట్టుపక్కల వున్న జగ్గాసాగర్, అయిలాపఊర్, భీమారం తదితర ఎనబై గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్ రావ్ అధీనం లో ఉండేది. ఈ గడీలో అప్పట్లోనె అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసు కున్నారు. జర్మిని నుండి పాల రాతిని, ఇతర విలాస వంతమైన వస్తువులను తెప్పించి వాడారు. అప్పట్లోనే జనరేటర్ తో విద్యుత్ దీపాలను వెలిగించారు ఈ గడీలో. కిరోసిన్ దీపాలు కూడ లేని ఆ గ్రామ ప్రజలు గడీ లోని వింత వెలుగులను వింతగా చూసేవారట. గడీలో తాగునీటిని పైపుల ద్వారా తెప్పింఛే వారు. ఆ కాలంలో నిర్మించిన నీళ్ల టాంకును ఈ నాటికి ప్రజలు ఉపయోగించు కుంటున్నారు. నక్స లైట్ల భయం వల్ల గడీ వైపు కూడ చూడని ఈ మాజి దొరలు గాని, వారి వారసులు గాని నక్స్ లైట్ ల ప్రభావం కొంత తగ్గగానే గ్రామానికొచ్చి కొన్ని స్థిరాస్తులు అమ్ముకొని పాత గడీని అమ్మేసి, కొత్త గడీని కూల్చేసి అందులోని విలువైన వస్తువులను, ఫర్నిచర్ ను హైదరాబాద్ కు తీసుకెళ్లి పోయారు. బండ లింగా పూర్ సంస్థానంలో వాళ్లకు స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకొని వున్న స్థలాన్ని గ్రామాభివృద్ది కమిటీకి అప్పగించారు. కళ్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణు గోపాల స్వామి ఆల7యానికి "ఆండాళ్ దేవి"కి నాలుగు లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కళ్యాణానికి సంస్థాన వారసులు గ్రామనికి వస్తారు. వ్వతిరేతక రాకుండా చూసు కోవడానికే దొరలు దాన ధర్మాలు చేస్తున్నారని విమర్శింఛె వారు లేక పోలేదు.
==లింగన్న పేట గడీ=={{fact}}
మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు కసిసే చోట కరీంనగర్ జిల్లా గంభీర్రావు పేటస్ మండలంలో వున్నదీ లింగన్న పేట సంస్థానం. ఐదు ఎకరాల విస్తీర్ణం గల ఈ గడీ గోతంటాల వెంకట నర్సింగరావు దొరకు చెందింది. వీరి ముందు తరానికి చెందిన దొర భార్య గుర్రం మీద గ్రామాల్లోకి వెళ్లి "కప్పం" వసూలు చేసుకొచ్చేదట. ఆమె చాల నిరంకుశం గా పరిపాలించేదని ప్రజలు చెప్పుకుంటారు. ఈ సంస్థానం లో ఏడు తరాలనుండి మగ సంతానం లేదట...... ఆనంద రావు అనే దొర తప్ప. ఎక్కువగా మనుమలను దత్తత తీసుకోవడం జరిగింది. ఈ దొరలను "సర్ దేశాయ్" లు అని కూడ అంటారు. ఈ గడికి నాలుగు వైపుల బురుజులున్నాయి. వాటి పైకెక్కి చూస్తే వాళ్లకు చెందిన నాలుగు వందల ఎకరాల భూములు, గ్రామాలు కనిపించేవి. [[సిరిసిల్ల]] పాత తాలూక లోని ఎక్కువ గ్రామాలు వీరి ఆధీనంలో వుండేవి. మల్లారెడ్డి పేట, ల్ముస్తాబాద్, కోళ్ళమద్ది శిరియాల, నాగంపేట, దమ్మన్నపేట, మొల్ల పల్లి, సిరిసిల్ల మొదలైన గ్రామాఅలన్ని ఈ సంస్థానం కిందే వుండేవి. ఈ గడీలో ఎందరో దాసీలు, నలబై మంది జవాన్లు వుండేవారు.
 
ఈ గడీ ప్రత్యేకత ఏమంటే, ... గడీలోనె [[మాణిక్య ప్రభు పీఠానికి]] చెందిన రాజ [[రాజేశ్వరి దేవాలయం]] వున్నది. రెండు వందల సంవత్సరాల నుండి క్రమం తప్ప కుండా అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. అందుకు రామశర్మ అనే పూజారి కుటుంబం తొ ఇక్కడే వుంటారు. హైదరాబాద్ లో స్థిర పడిన గడీ యజమానులు పూజల నిర్వహణకు గాను పూజారికి ఏటా ఇరవైవేల రూపాయలను పంపిస్తున్నారు. దేవాలయ ఉత్సవాలు, బ్రంహోత్సవాలను గడీ వారసుల పేరున జరుగుతాయి. మొదట్నుంచి ఈ గడీలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవి. ఆయుద పూజ సమయంలో వెంకట నర్సింగ రావు దొర ముందు నడుస్తుంటే ఆయన వెనుక పల్లకిలో "రాజఖడ్గం " ఉరేగింపుగా తీసుకొచ్చేవారు. దసరా రోజు జరిగే ఆయుద పూజలో రాజ ఖడ్గం తప్పనిసరిగా వుండాల్సిందె కాబట్టి దాన్ని భద్రపరిచిన గది తాళం చెవి హైదరాబాద్ లో వున్న దొర వద్దనుండి పంపిస్తారు. చాల గడీలలో దసరా సందర్భంగా ఏటను "బలి" ఇస్తారు. కాని ఈ గడి లో రాజరాజేశ్వరీ దేవి ఆలయం వున్నందున జంతు బలి నిషేదించారు. ఈ గడీ ఆవరణం లోనె గ్రామ పంచాయితీ భవనం, పశు సంరక్షణ సమితి కార్యాలయం, పక్కన ఉన్నత పాఠశాల వున్నందున గడీ ఆవరణం అంతా జనంతో సందడిగా వుంటుంది. ఈ మధ్యన కొంత శిధిలమైన ఈ గడీని ఐదు లక్షల రూపాయలతో మాజీ దొర మరమత్తులు చేయించాడు.
 
==సంజీవ రావు పేట గడీ=={{fact}}
 
సంజీవ రాపు పేట గడీ మెదక్ జిల్లాలో నారాయణ ఖేడ్ మండలంలో వున్నది. ఇది బ్రాంహణ దొరలు పాలించిన సంస్థానం. ఈ గడీకి కొంత ప్రత్యేకత వుంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులలో వున్న ఈ గడీ నిజాం కాలంలో పరిపాలన కేంద్రంగా వుండేది. అప్పట్లో నిజాం పాలిత ప్రాంతమంతా మూడు పాయలుగా వుండేది. ప్రదాన పాయ గా సంజీవ రావు పేట కేంద్రంగా వుండేది. సంజీవ రావు దేశముఖ్ నాయకత్యంలో పరిపాలన సాగేది. పెద్ద పెద్ద పట్టణాలకు సైతం రహాదారులు లేని ఆ కాలంలో సంజీవరావు పేట....సంస్థానాధీశులు సంజీవరావు దేశ్ ముఖ్ .... [[నాందేండ్]].....[[హైదరాబాద్]] ప్రధాన రహదారి నుండి నిజాంపేట... [[నారాయణఖేడ్]] ల మీదుగా సంజీవరావు పేటకు రహదారిని నిర్మించారు. ప్రస్తుతం నారాయణ ఖేడ్ లోవున్న తహసిల్ భవనం పాత కోర్టు భవనం కూడ ఆయన హయాంలో నిర్మించినవే. 1910 ప్రాంతంలోనె సంజీవ రావు పేటను ప్రణాళిక బద్దంగా, విశాలమైన రహదారులతో, బజార్లతో, వాస్తు ప్రకారం నిర్మించారు. గ్రామంలో అన్ని కులాల వారు, వర్గాల వారు వుండడానికి వారికి అనుకూలమైన గృహాలను నిర్మించారు. గ్రామంలో లేని కులాల వారిని బయట నుండి తీసుక వచ్చి గ్రామంలో వారికి స్థిర నివాసాలు నిర్మించారు. సంజీవ రావు తాత తాను తీర్త యాత్రలకు వెళ్లి వచ్చినప్పుడు తెచ్చిన అందమైన అనంత శయన విగ్రహాన్ని గ్రామంలో అందమైన దేవాలయాన్ని నిర్మించి అందులొ ప్రతిష్టించారు. గ్రామాన్ని ఇంత అభివృద్ది పరిచినందున అప్పటివరకు "పందిముక్కుల గ్రామంగా పిలువ బడిన ఆ గ్రామం క్రమేపి సంజీవ రావు పేట స్థిర నామం ఏర్పరుచుకుంది. యాబై గ్రామాలకు పాలనా కేంద్రమైన సంస్థానానికి అనుకూలమైన భవనం వుండాలనే ఉద్దేశంతో గడీని సర్వాంగ సుందరంగా బలిష్టంగా నిర్మించారు. ఇక్కడి నుండే తహసిల్. పోలీస్ యంత్రాంగం పరిపాలన కొనసాగిస్తుండే వారు. నిజాం యొక్క ప్రధాన మంత్రి కిషన్ ప్రసాద్ అప్పుడప్పుడూ సంజీవరావు పేటకు వచ్చి వెళు తుండే వారు. ఈ సంస్థానానికి దొడ్డప్ప ప్రధానికా వ్వవహరించేవారు. సంస్థానంలో యాబై మందికి పైగా దాసీలు పని చేసేవాని తెలుస్తున్నది. సంజీవ రావు దేశ్ ముఖ్ 1946 వరకు సమర్థ వంతమైన పాలన నిర్వహించారు.1946 లో ఆయన మరణించాక వారి కుటుంబ సభ్యులు పరిపాలించారు. వారి పాలన నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయి నంత వరకు కొనసాగింది. ఆతర్వాత ఆప్పటి సంస్థాన ప్రదాన మంత్రి మొదటి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సంజీవ రావు దేశ ముఖ్ కు ముగ్గురు భార్యలున్నా ఇద్దరికి సంతానం లేదు. మూడో భార్యకు పద్మావతికి లక్ష్మణ్ రావ్ దేశముఖ్, గోవింద రావ్ దేశముఖ్ అనంత రావ్ దేశముఖ్ లతో పాటు కూతురు సుసుమబాయిలు జన్మించారు. ప్రస్తుతం గోవిందరావ్ దేశముఖ్ విదేశాలలో వుండగా మిగతా వారు హైదరాబాద్ లోవున్నారు. ప్రతి సంవత్సరం గ్రామంలో జరిగే దసరా. నవరాత్రి ఉత్సవాలకు, కార్తీక మాసంలో జరిగే [[అనంత శయన]] జాతర ఉత్సవాలకు వీరు హాజరై ఘనంగా ఉత్సవాలను జరిపిస్తున్నారు. ఇతా గడీల కన్నా భిన్నంగా ఈ సంస్థానంలో ప్రజా రంజకంగా పరి పాలన కొనసాగింది.
 
==కొడిమ్యాల......రామాజీపేట గడీలు.==
 
కొడిమ్యాల గడీ, రామాజీ పేట గడీ.. ఈ రెండు గడీలు కూడ -[[కరీంనగర్]] జిల్లాలోనే వున్నది. మరే గడీకి లేని ప్రత్యేకత ఈ రెండింటికి వున్నది. అదేమంటే...... వీటిల్లో కొన్ని బొమ్మలు, చిత్రాలు వున్నాయి. [[కొడిమ్యాల గడీ]] నాలుగెకరాల విస్థీర్ణం లో వున్నది. ఈ గడీ రామక్క దొరసాని అధీనంలో ఉండేది. సుమారు ఐదు వందల ఎకరాల భూమి ఈమె ఆదీనంలో వుండేది. గడీ కున్న ఎనిమిది బురుజులు చాల వరకు పాడైనవి. ప్రహరి గోడ మట్టిది వెడల్పైనది. దానిమీద ఏడ్ల బండి పోగలిగేటట్లున్నది. ఈ గడీ వారసులు మంచి కళా పోషకులు, విద్యా వంతులు. ఒక తరానికి చెందిన మంగా రావు దొర పెద్ద కూతురు ఆనందబాయి [[అష్టావదానం]] చేసేది. అలగే ఇంకొ దొర లక్ష్మణ రావు జాతీయ స్థాయిలో [[హాకీ ప్లేయర్]] గావుండి.,1946--47 లో [[ఉస్మానియా యూనివర్సిటీ]] తరుపున ఆడి అనేక పతకాలు సాదించారు. ప్రస్తుతం ఈ గడీ ఆవరణంలో ఒక బ్యాంకు వున్నది. "కడి మేడ" అనే పేరున్న ఈ వూరు "కడమలగా" ఆతర్వాత "కడిమ్యాల" గా రూపాంతరం చెందింది.
ఈ గడి ని బలిజ కులస్థులైన దొరలు పాలించారు. కాని వీరు నైజాముకు వ్వతిరేకులు. అందుచేత ఈ గడి ని నైజాము చేజిక్కించుకొని వేరొకరికి అప్పగించాడు. ఈ గడీలో సూర్యుని బొమ్మ, సింహం బొమ్మలున్నాయి. గడి దర్వాజ పై పులి, సింహం పోరాటానికి సిద్దంగా వున్నట్టున్నాయి. గడీ గోడలపై ఆంజనేయుడు, సీతమ్మ బొమ్మ, గుర్రాలపై తుపాకులతో జింకను వేటాడుతున్న ఒక బొమ్మ, ఏనుగును ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లుతున్నట్లున్న మరొ బొమ్మ, రాజ ముద్రలో నెమలి బొమ్మ, అప్పటి రైలు బండి బొమ్మ పైకప్పుకు అతి పెద్ద, సూర్యుడు, చంద్రుని బొమ్మలున్నాయి. వీటి అర్థం ఎవ్వరికి తెలియదు. బలిజల దొరల పుణ్యక్షేత్రమైన కొండగట్టు వరకు గడీ నుండి స్వరంగ మార్గముండేదని అదిప్పుడు కూరుకు పోయిందని చెప్తారు. గడి పైభాగంలో దొరలు కూర్చొని చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించడానికి ఒక రాతి సింహాసనం వున్నది. ఈ గడీ మీద ఒకసారి నక్జలైట్లు దాడి చేసి ఆయుదాలన్ని ఎత్తుక పోయారు. మంగారావు దొర పాలనలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవి. ఎనిమిది బురుజుల వద్ద, మదియు గడిలోతొమ్మిది ఏటలను బలి ఇచ్చేవారు. ఆమాంసాన్ని వూరంతా పంచేవారు.
[[రామాజీ పేట గడీ]] ఇది చిన్నదే అయినా చాల కళాత్మకంగా వున్నది. గడీ ప్రవేశ ద్వారంపై మూడు తుపాకుల బొమ్మలు, ఒక గడియారం బొమ్మలున్నాయి. దాని ప్రక్కనే ఒక చట్రంలో నాలుగు నక్షత్రాల బొమ్మలున్నాయి. గడీ తలుపులకు కూడ కళాత్మకమైన చిత్రాలున్నాయి.
 
[[ వర్గం:తెలంగాణ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గడీలు" నుండి వెలికితీశారు