నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = నర్తనశాల|
year =1963 |
image =Telugucinemaposter narthanasala 1963.JPG |
caption = అప్పటి సినిమా పోస్టరు [http://www.nandamurifans.com/ ]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[సావిత్రి]],<br>[[దండమూడి రాజగోపాలరావు]],<br>[[ఎస్.వి.రంగారావు]],<br>[[మిక్కిలినేని]],<br>[[రేలంగి]],<br >[[ముక్కామల]],<br>[[రాజనాల]],<br>[[ఎల్.విజయలక్ష్మి]],<br>[[సంధ్య]],<br>[[ధూళిపాళ]],<br>[[ప్రభాకర రెడ్డి]],<br>[[సూర్యకాంతం]],<br>[[కాంచనమాల]],<br>[[అల్లు రామలింగయ్య]],<br>[[కాంతారావు]],<br>[[కైకాల సత్యనారాయణ]],<br>[[శోభన్ బాబు]],<br>[[వంగర]],<br>[[బాలకృష్ణ]],<br>[[సి.లక్ష్మీరాజ్యం]],<br>[[సీతారాం]]|
story = మహాభారతంలోని కథ - [[సముద్రాల రాఘవాచార్య]]చే కూర్పు |
screenplay = |
director = [[ కమలాకర కామేశ్వరరావు ]]|
dialogues = [[సముద్రాల రాఘవాచార్య]]|
lyrics = [[సముద్రాల రాఘవాచార్య]] |
producer = [[సి.లక్ష్మీరాజ్యం]],<br /> [[కె.శ్రీధరరావు]]|
distributor = |
released = [[అక్టోబర్ 11]],[[1963]]|
runtime = |
language = తెలుగు |
music = [[సుసర్ల దక్షిణామూర్తి]]|
playback_singer = [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]],<br /> [[ఎస్.జానకి]],<br /> [[బెంగుళూరు లత]],<br /> [[ఘంటసాల వెంకటేశ్వరరావు]],<br /> [[మాధవపెద్ది సత్యం]],<br /> [[పి.సుశీల]]|
choreography = [[వెంపటి పెదసత్యం]]|
cinematography = [[ఎమ్.ఎ.రహమాన్]]|
editing = [[ఎస్.పి.ఎస్.వీరప్ప]]|
art = [[టి. వి. యస్. శర్మ]] |
production_company = [[రాజ్యం పిక్చర్స్ ]]|
awards = |
budget = |
imdb_id = 0263778 }}
'''నర్తనశాల''' (ఆంగ్లం: NarthanaSala) [[మహాభారతం]]లోని [[విరాట పర్వం]] కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములొ విడుదలైన [[తెలుగు సినిమా]]. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ [[సినిమా]] మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా [[తెలుగు సినిమా చరిత్ర|తెలుగు చలన చిత్ర చరిత్రలో ]] ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా [[రాష్ట్రపతి]] బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో [[ఇండొనీషియా]] రాజధాని, [[జకార్తా]]లో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఎస్.వి.రంగారావు ఉత్తమ నటుడు గా, ఉత్తమ కళాదర్శకునికి రెండు బహుమతులు గెలుచుకొంది.
 
పంక్తి 31:
[[మహాభారతం]]లోని '[[విరాట పర్వం]]'లో జరిగిన [[పంచపాండవులు|పాండవుల]] అజ్ఞాతవాస గాధ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది.
 
[[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. [[ధర్మరాజు]] ''కంకుభట్టు''గాను, [[భీముడు]] వంటలవాడు ''వలలుని''గాను చేరుతారు. 'పేడివి కమ్మ'ని ఊర్వశి ఇచ్చిన శాపం అజ్ఞాతవాసములొ వరంగా వినియోగించుకొని [[అర్జునుడు]] ''బృహన్నల''గా విరాటరాజు కుమార్తె ఉత్తరకు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు.[[నకులుడు]] ధామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడిగా [[సహదేవుడు]] తంత్రిపాలుడు అనే పేరుతో [[ఆవు|గో]]సంరక్షకుడిగా చేరుతారు. [[ద్రౌపది]] ''సైరంధ్రి''గా విరాటరాజు భార్య సుధేష్ణాదేవి పరిచారిక అవుతుంది.
 
పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని [[కౌరవులు]] చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు.[[పాండవులు]] ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన [[కీచకుడు|కీచకుని]] కన్ను ద్రౌపదిపై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి భీముడు, అతడిని హతం చేస్తాడు.
 
కీచకుని మరణంతో అక్కడ పాండవులుండవచ్చునని అనుమానించిన కౌరవులు, వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. ఇక కలుగులో ఎలుకలను లాగడానికి [[కౌరవులు]], భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు.
 
అంతఃపుర పరివారం తప్ప అంతా యుద్ధానికి వెళ్ళారే! అయినా ఫరవాలేదు. నేను కౌరవ సేనను వీరోచితంగా జయిస్తానని పలికి విరాటుని కొడుకు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారథి గా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తరునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు. శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. ఇదీ కథ.
పంక్తి 107:
* రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన 11 సినిమాలలో 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.
* రాజ్యం పిక్చర్స్ అధినేతలలో ఒకరైన లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో నందమూరి సరసన హీరోయిన్‌గా నటించింది. తరువాత ఆమె వివాహం కె.శ్రీధరరావుతో జరిగింది.
* బృహన్నలగా ఆడంగి వేషం వేయడానికి ఎన్.టి.ఆర్. మొదట నిరాకరించాడు. కాని లక్ష్మీరాజ్యం అతనికి నచ్చజెప్పి ఒప్పించింది. అయితే ఎన్.టి.ఆర్. నిరాకరణకు కారణం ఆ పాత్ర రూపం కాదు. ఉత్తర గా మంచి నర్తకి అయిన విజయలక్ష్మితో సమానంగా తాను నాట్యం చేయలేనని. నెలరోజులు ఎన్.టి.ఆర్. తెల్లవారుజామున వెళ్ళి వెంపటి పెదసత్యం వద్ద నృత్యం నేర్చుకొన్నాడు. తరువాతే అంగీకరించాడు.
* బృహన్నల పాత్ర మేకప్ విషయమై మేకప్ మన్ హరిబాబు, కళాదర్శకుడు టి.వి.ఎన్.శర్మ ఎంతో శ్రమించారు. ఎబ్బెట్టుగా కాకుండా ఠీవిగా కనిపించేలా చేయడానికి ఎన్నో స్కెచ్‌లు వేశారు.
*కళాదర్శకుడు టి.వి.ఎన్.శర్మకు చిన్నపుడు ప్రమాదంలో ఒక చేయి పోయింది. కాని పట్టుదలతో శ్రమించి ఒకచేతి నైపుణ్యంతో కళాదర్శకుడయ్యాడు. [[జకార్తా]] లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శింపబడగా శర్మకు ఉత్తమ కళాదర్శకుడు అవార్డు వచ్చింది. అప్పుడు అతనికి [[మద్రాసు]] లో జరిగిన సన్మాన సభలో "నేను ఈ స్థాయికి చేరుకోడానికి కారణం ఎందరో మహానుభావులు. వారికి ఈ సందర్భంలో రెండుచేతులూ ఎత్తి దణ్ణం పెట్టుకొనే అవకాశం ఇవ్వలేదు ఆ భగవంతుడు" అన్నాడు.
[[బొమ్మ:Svr in nartanasala.jpg|thumb|right|కీచకునిగా ఎస్వీ రంగారావు]]
* కీచకునిగా ఎస్.వీ.రంగారావు ఆ పాత్రకే వన్నె తెచ్చాడు. అయితే అదంతా సముద్రాల వ్రాసిన సంభాషణల బలమని చెప్పుకొన్నాడు ఆ వినయశీలి.
పంక్తి 115:
* అర్జునుడు ప్రయోగించిన [[సమ్మోహనాస్త్రం]] పనిచేసిన విధం అద్భుతంగా చూపించారు. అస్త్రం పైన ఒక స్త్రీ ప్రత్యక్షమై కూర్చుండి, మత్తుమందు (పిచికారీలాంటి సాధనంతో) సైన్యంపై చల్లుతుంది. అంతా వివశులైనాక విజయవంతంగా అందరివంకా కలయజూస్తుంది.
* ఈ సినిమాలో అర్జునుడు యుద్ధానికి వెళుతూ శంఖం పూరిస్తున్న చిత్రాన్ని [[తెలుగుదేశం పార్టీ]] పెట్టిన క్రొత్తలో ప్రచారానికి వాల్‌పోస్టరుగా వాడారు.
*వంట వాడైన భీముడు కీచకవధ చేశాడని భారతం లో ఉంది. ఆ కథని స్వీకరించి ఉత్తర నాట్యశాల లో కీచకవధ జరిగినట్లు, కొన్ని మార్పులతో విశ్వనాథ సత్యనారాయణ [[నర్తనశాల]] పేరుతో రాశారు. ఈ నర్తనశాల నాటకం పైన చెప్పిన నర్తనశాల సినిమాకు స్ఫూర్తి అంటారు.
 
==ఇతర సాంకేతిక నిపుణులు==
పంక్తి 241:
|}
 
* ఈ సినిమా చివర యుద్ధ సన్నివేశంలో వాడిన భారతంలోని [[తిక్కన]] పద్యాలు ఎంతో వన్నె తెచ్చిపెట్టాయి. ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం పాడిన పద్యాలు కొన్ని
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు