నిడమర్తి అశ్వనీ కుమారదత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''నిడమర్తి అశ్వనీ కుమారదత్తు''' (1916 - 1977) ప్రముఖ కార్మిక నాయకులు మరియు పత్రికా నిర్వాహకులు. సోవియట్ లో చిరకాలం తెలుగు ప్రచురణల విభాగం నిర్వహించిన [[నిడమర్తి ఉమా రాజేశ్వరరావు]] గారు వీరి సోదరులు.
 
వీరు పశ్చిమ గోదావరి జిల్లా [[నిడమర్రు]] గ్రామంలో 22 జూలై 1916 తేదీన లక్ష్మీనారాయణ మరియు వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉండి గ్రామంలో హైస్కూలు చదువి, గుంటూరు లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. 1934-36 మధ్యలో నిడమర్రు కేంద్రంగా యువజన, రైతు సంఘాలలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగానూ, గ్రంథాలయోద్యమం మరియు గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో కృషి చేశారు. తర్వాత ఉన్నత విద్యకోసం 1937లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో చేరారు. అదే ఏడాది [[ఎం.ఎన్.రాయ్]] దంపతులు విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన సభలో పాల్గొన్నారు. విద్యార్ధిగా ఉన్నప్పుడు ఆనాటి వైస్ చాన్స్‌లర్ [[సి.ఆర్. రెడ్డి]] గ్రంథాలయంలోని కమ్యూనిష్టు ఉద్యమ గ్రంథాలను తొలగించారు. అందుకు నిరసనగా వీరి నాయకత్వంలో సమ్మె జరిగింది. ఫలితంగా వీరు యూనివర్సిటీ నుండి బహిష్కరించబడ్డారు.
 
1937లో నిడమర్రు తిరిగివచ్చి ''స్వతంత్ర భారత్'' అనే రహస్య పత్రికను నడిపారు. ''క్లాన్యూ క్రాంజ్'' ను ''అన్నా'' అనే పేరుతో అనువదించారు. రాజగోపాలాచారి ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. వీరు తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బి.ఎస్సీ. చదివారు. అక్కడ కమ్యూనిష్టు ప్రముఖులు [[నీలం రాజశేఖరరెడ్డి]] గారిని కలిశారు. అక్కడే ''ఫాంటమారా'' ను అనువదించారు.