పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
| type = హిందూ
| Image = [[File:Parashurama with axe.jpg|220px]]
| Caption = రాజా రవివర్మ గీచిన గొడ్డలి తో ఉన్న పరశురాముని చిత్రము
| Name = పరశురాముడు
| Devanagari = परशुराम
| Sanskrit_Transliteration = Parashurama
| Tamil_Transliteration = பரசுராமன் / {{IAST|Parasuraman}}
| Affiliation = [[భీష్ముడు]] , [[ద్రోణుడు]],[[కర్ణుడు]] మరియు కల్కి లకు గురువు.
| God_of = శ్రీమహావిష్ణువు ఆరవ అవతారము
| Abode = మహేంద్రహిరి, ఒరిస్సా
| Weapon = గొడ్డలి (పరశు)
| Consort = ధరిణి
| Mount =
| Planet =
| Planet =
}}
[[బొమ్మ:parasurama.jpg|thumb|right|200px|పరశురామావతారము]]
[[శ్రీమహావిష్ణువు]] దశావతారములలో '''పరశురామావతారము''' (Parasurama Incarnation) ఆరవది<ref name="Shah">Shahjahanpur&nbsp;– Etihasik Evam Sanskritik Dharohar</ref>. [[చతుర్యుగములు|త్రేతాయుగము]] ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని '''భార్గవరాముడు''', '''జామదగ్ని''' అని కూడా అంటారు<ref name="Amar">{{cite book|last = Pai| first = Anant| authorlink = | coauthors = | title = Parashurama&nbsp;– Sixth Incarnation of Vishnu | publisher = Amar Chitra Katha&nbsp;– Volume 764 | date = November 29, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B004EEORZW/| doi = | id = }}</ref>.
==పరశురాముని జన్మవృత్తాంతం==
కుశ వంశానికి చెందిన మహారాజు [[గాధి]]. ఒకసారి భృగు వంశానికి చెందిన [[ఋచీకుడు]] అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు<ref name="Parsh"/>. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు<ref name="yam">{{cite web|url = http://www.yamdagni.com/Parashurama.htm|title = Parashurama|accessdate = November 22, 2012|date = November 22, 2012|publisher = Rai, Kayarra Kinhanna}}</ref>. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు<ref name="Parsh"/>. [[గాధి]] కొడుకే [[విశ్వామిత్రుడు]]. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర [[గొడ్డలి]]) పొంది, పరశురాముడైనాడు.
 
==కార్తవీర్యునితో వైరం==
[[File:Paraśurāma fighting King Kartavirya Arjuna..jpg|thumb|కార్త్యవీరునితో పోరాడుతున్న పరశురాముడు.]]
హైహయ వంశజుడైన [[కార్తవీర్యార్జునుడు]] శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు.<ref name="Parsh">{{cite book|last = Rai| first = Kayyara Kinhanna| authorlink = | coauthors = | title =BhargavaParashurama| publisher = Litent ePublishing | date = June 13, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B003RWS7O4/| doi = | id = }}</ref>. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు<ref name="Parsh"/>. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
 
కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
పంక్తి 32:
==రామాయణంలో పరశురాముడు==
[[దస్త్రం:Parsuram Ram Yudh.jpg|thumb|right|పరశురాముని ముందు రాముడు]]
[[సీత|సీతా]] స్వయంవరంలో [[శ్రీ రాముడు]] [[శివ ధనుస్సు]]ను విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు<ref>{{cite web|url=http://www.sacred-texts.com/hin/rama/ry076.htm|title=DEBARRED FROM HEAVEN}}</ref>. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది<ref name="Ramayana">{{cite book|last = [[Valmiki]]| first = | authorlink = | coauthors = Ralph, T. H.| title = The Ramayana |publisher = Amazon Digital Services | location = | pages = 1787 | url = http://www.amazon.com/Ramayana-English-ebook/dp/B004UITKYU/ | doi = | id = }}</ref><ref name="Ramayana"/>.
 
==మహాభారతంలో పరశురాముడు<ref name="Mahabharata">{{cite book|last =Vyasa | first =Krishna-Dwaipayana | authorlink = | coauthors = Ganguli, Kisari Mohan| title = The Mahabharata|publisher = Sacred Texts|date = 1883–1896| location = | pages = | url = http://sacred-texts.com/hin/maha/index.htm | doi = | id = }}</ref>==
* [[మహాభారతం]]లో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున [[భీష్ముడు]] అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది<ref name="prof">{{cite web|url = http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=12338|title = The Tragic Trio: Amba|accessdate = November 22, 2012|date = June 13, 2012|publisher = Roychowdhry, Debalina PhD}}</ref><ref name="Mahabharata"/>.
* [[కర్ణుడు]] తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు