ఒకసారి [[పుణె]] నగరంలోనారాయణ్ తన పది పండ్రెండేళ్ళ వయసులో పాడగా విని, లోకమాన్య [[బాలగంగాధర తిలక్]] నారాయణ్కు ''బాల గంధర్వ'' అని బిరుదు నిచ్చాడు. బాల గంధర్వ ఎన్నో నాటకాలలో వేషాలు వేసి, మరాఠీ నాట్య గీతాలను పాడి, ప్రజలలో వాటికి ఎంతో ప్రాచుత్యాన్ని కలుగజేశాడు. అతడు ''భాస్కర్- బువా బఖ్లే'' శిష్యుడు. బాల గంధర్వ సమకాలికులు ''కేశవరావ్ భోస్లే'' మరియు [[దీనానాథ్ మంగేష్కర్]] లు. 1905 లో ''కిర్లోస్కర్ సంగీత మండలి'' లో బాల గంధర్వ తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించాడు. బాల గంధర్వ, ''గణ్పత్ రావ్'', ''గోవిందరావు టెంబే'' లు ఆ కంపనీని విడిచిపెట్టి, 1913లో ''గంధర్వ సంగీత మండలి'' ని స్థాపించారు. కాని అది అప్పుల్లో కూరుకు పోయింది. అంతలోనే [[గౌహర్ జాన్]] ఏప్రిల్, 1938 లో వాళ్ళ కంపనీలో చేరింది. నారాయణ్ రావ్ ఆమె 1951 లో వివాహమాడారు. గౌహర్ 1964లో మరణించింది. నారాయణ్ రావ్ 1967 లో మరణించాడు. [[పుణె]] లోని ''బాల గంధర్వ ఆడిటోరియం'' అతని గౌరవార్థంగా పిలువబడుతోంది.