భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
'''భర్తృహరి''' రెండు ప్రభావవంతమైన సంస్కృత గ్రంథాలు రచించిన సంస్కృత [[కవి]]. ఇతను 5వ శతాబ్దానికి చెందినవాడు. [[సుభాషిత త్రిశతి]] [[రచయిత]] భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి.
 
సుభాషిత త్రిశతి లేక సుభాషిత రత్నావళి యను నది కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినను. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయము లగు చారిత్రికాధారములు కానరావు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానా విధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్య దుశ్శీలముచే సంసారమునకు రోసి, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెననియు నొక ప్రతీతి కలదు. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. అది యటుండనిండు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి యతనికి జీవితమున నాశా భంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మ దృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంథస్థమైన విషయములలో గొన్నింటిని పేర్కొందము.
==అయన గూర్చి వివిధ గ్రంథములలో విషయములు==
* పూర్వ సంఘటనలను తెలియజేసిన ఒక గ్రంథములో భర్తృహరి భార్య పేరు [[అనంగసేన]] అని యున్నది.
* ఇంకొక గ్రంథమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు, ఇతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడు అను ముగ్గురు కుమారులును, మైనావతి యను కుమార్తె యును గా నలుగురు సంతాన మనియును దెలియవచ్చును.
* భర్తృహరి భార్య [[పద్మాక్షి]] అని యింకొక కథ కలదు.
* భర్తృహరి తల్లి సుశీల, ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమునకు అధికారియై దానిని తన సోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాధ.
* చంద్రగుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు, వారికి యధాక్రమమున వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.
పంక్తి 20:
 
భర్తృహరి శతకములను వ్యాఖ్యానించినవారు మహాబలుడు, ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు, ధనసారుడు, రామర్షి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తుడు అను వారలని సంస్కృత వాఙ్మయ చరిత్రకారులు శ్రీ యుత కావ్య వినోదుల కృష్ణమాచార్యుల వారు పేర్కొని యున్నారు. వారిలో ఒక్కరైనను కవికాల నిర్ణాయక విషయమై శ్రద్ధ పూనినట్లు కానరాదు. కాని వారిలో రామచంద్ర బుధేంద్రుడు రచించిన వ్యాఖ్య ఆంధ్ర దేశమున గాదు, యావద్భారతమున వ్యాప్తి నందు ఉన్నది. ఆయన పీఠికలో
{{వ్యాఖ్య|<big>విప్రేణా భూతపూర్వం ఫలమిధి తపసా ౽ లంబి సూర్యప్రసాదా</big><br /><big>ల్లబ్ధ్వా తస్మాత్ స్వయం తత్ప్ర చురతరజరా పఞ్చతా కుఞ్చనాఢ్యమ్</big><br /><big>హిత్వా మోహం స్వకాన్తా స్వతివిమల ధియీ తం నిషే వ్యాక్త భవ్యో</big><br /><big>యోగీన్ద్రో భర్తృహర్యాహ్వయ ఇహ కురుతే ౽ ద్యాపి విద్యా విలాసం.</big>|||రామచంద్ర బుధేంద్రుడు|}}
 
అను శ్లోకమున "ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి నొసగగా దానిని అతడు తన ప్రియభార్యకు ఇచ్చెను. ఆమె దానిని తాను భుజింపక, తన జారునకును, అతడు తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను." అన్న జన ప్రతీతిని ఇచట తడవి యున్నాడు గాని, దాని సత్యా సత్యముల విమర్శించినట్లు స్ఫురింపదు. సాధారణముగా ప్రసిద్ధ పురుషులను గూర్చి అవినీతులు తమ బుద్ధి బలము కొద్దీ గాథలను ఎన్నింటినో కల్పించుటయు, వాటిని అలాగే సత్యములని పామరజనము విశ్వసించుటయు మనకు నేటికిని అనుభవమే. ఇదియొక గ్రుడ్డి ఛాందస వృత్తము. వ్యాఖ్యాతలెల్లరు " రత్నము రత్నమే కదా! అది యేనాటిదన్న ప్రశ్న మనకేల?" అన్న నుడికి దాసానుదాసులై తలయొగ్గిరే గాని తమ కవి స్తుత్యాదికములలో అతని కాలమును నిర్ణయించుటకు తగినంత విశదముగా అతనిని ప్రశాసించిన వారును లేరు.
 
అట్లుండినను ప్రబలమైన అధారాంతరముచే దీనినికొంతవరకు నిశ్చయింపవచ్చును. పారసీక భాషలో "కలిల ఉ - దిమ్నా" అను గ్రంథము కలదు. ఇది క్రీ.శ 531-579 ప్రాంతముల పారసీక దేశమును పాలించిన యొకానొక పాదుషా ప్రోత్సాహమున రచియింపబడిన గ్రంథము. దీనికి మూలము మన సంస్కృత పంచతంత్ర మనుట సర్వాంగీకరింపబడిన విషయము. కనుక పంచతంత్రము అధమ పక్షము క్రీ.శ ఆరవ శతాబ్దారంభము నాటికే ప్రాచుర్యమందియుండెననుట కెలాంటి సంశయమును లేదు. పంచతంత్ర మా మూలాగ్రము స్వతంత్ర మైన రచన కాదు. నాటికి ప్రశస్తము లైయుండిన గ్రంథరాజము లనేకముల నుండి బహుళముగా నుదాహరణముల గైకొనియున్నది. దాని కాధారములగు గ్రంథములలో ఈ నీతి శతక మొకటి. ఇందుండి యొక శ్లోకము " గజభుజఙ్గ విహఙ్గమ బంధనం శశిదివాకరయోర్గ్రం హపీడనమ్; మతిమతాం చ విలోక్య దరిద్ర్క్వ తాం విధిరహో బలవాని తిమే మతిః" (చూడండి. 85 నీతి శతకం) అను శ్లోకమందు లోనికి గ్రహింపబడియున్నది.
 
ఈ యుదాహరణమే పారశీక గ్రంథమునందును గలదు. కనుక నీతి శతక కర్త క్రీ.శ 500 కు పూర్వమే యుండెననుట స్థిరము. అనగా కవికాలమును అయిదవ శతాబ్ది కీవలికి లాగుటకు వీలులేదు.
పంక్తి 33:
 
==భర్తృహరి చాటిన సిద్ధాంతములు==
వేదములందును వేదాంత సిద్ధాంతములందును ధర్మపరులకు విశ్వాస మత్యవసరము. పరబ్రహ్మమందు లయించుటయే యానందమునకు పరమావధి. తత్సిద్ధికై ఆశా త్యాగము, వైరాగ్యానుభవము, కర్మోస్మూలనమును సాధనములు. ఇవియు ముఖ్య వేదాంత సిద్ధాంతములు. కనుక భర్తృహరి వేదాంత మతామలంబకుడనుట విస్పష్టము. అచ్చటచ్చట యోగమును, దశావతారములను, గంగను, హిమాలయములను బ్రశంసించి యుండుట జూడ మానవులు తమ దైనందిన చర్యలలో నెట్టి దృష్టితో వ్యవహరింపవలెనని కవి యుద్దేశించెనో తెలియును.
 
పురుషుడీ లోకమున వాంఛింపదగిన వానిలో నతి ముఖ్యమైనది ఆత్మ గౌరవము. ఎన్నెన్ని సంకటములు పైకొన్నను ఆత్మ గౌరవమునకును స్వాతంత్ర్యమునకును లోటు పాటు కలుగనీయరాదని యెంతో మృదుల మగు భాషలో నెన్నో పట్టుల కవి వివరించెను. మానవ దృష్టి లక్షింప దగిన రెండవగుణము పట్టుదల. దృఢపవృత్తి, అభినివేశమును, వ్యవసాయమును కొరత పడిన నేకార్యమును సిద్ధింపదు. ధీరులు తాము పూనిన కార్యము సిద్ధినందు వరకు వదలరని రూఢిగా పలిగెను. కవి మనకు ఉద్బోధింపనెంచిన మూడవ నీతి ధర్మానుష్ఠానము. సాంఘిక సేవ, పరోపకాది మహిమలు వర్ణించు శ్లోకము అతి సుందరములు. భావగంభీరములై యున్నవి. భర్తృహరి రచనలు ధైర్యమునందు సచ్ఛీలమునందు వాస్తవాభినివేశమును పురికొల్పును. సద్గుణము లన్నింటిలో సచ్చీలము ఉత్తమోత్తమస్థానమధిష్టించు ననుట కవి మతము. తన్మూలమున సాధింపదగిన శ్రేయములను పలురీతుల వివరించియున్నాడు కవి.
పంక్తి 46:
===పాశ్చాత్య పండితుడు మేక్డోనెల్ వ్యాఖ్య===
{{వ్యాఖ్య|Scattered throughout the various departments of Sanskrit literature, are innumerable apophthegms in which wise and noble, striking and original thoughts often appear in a highly finished and poetical garb. Owing to universality of this mode of expression in Sanskrit literature, there area but few works consisting exclusively of poetical aphorisms. The most important are the two collections by the highly gifted '''Bharthihari''' entitled respectively, '''Nitisataka''' or century or conduct and '''Vairagya Sataka''' or century of renunciation.|}}
===మోనియర్ విలియమ్సు పండితుని వ్యాఖ్య===
{{వ్యాఖ్య| Numbers of wise sayings have from time immemorial, been constantly quoted in conversation. Many, thus orally current, were of such antiquity that to settle their authorship was impossible. But occasional attempts were made to give permanence to the floating wisdom of the day. by stringing, like beads on a necklace, representing a separate topic, and the authorship of a whole series being naturally ascribed to men of known wisdom like '''Bhartrihari''', Chanakya, much in the same way as the authorship of the puranas and the Mahabharata was referred to the sage Vyasa.|}}
==సుభాషిత త్రిశతి - వివిధ భాషలలో అనువాదాలు==
ఇటీవల సుభాషిత త్రిశతి ముద్రణములు ఆంగ్ల వ్యాఖ్యాభాషాంతరీకరణములతో నెన్నో వెలువడినవి. వానిలో ముఖ్యమైనవి గోపీనాథుడు, టానీ పండితుడు, బి.హెచ్. వార్తాం పండితుడు, పీటర్సన్ అనువారి రచనలు. వీరిలో కొందరు విదేశీయులు. అన్నియు నాంగ్ల భాషలోనివి. వీనియన్నింటికన్నా మిన్నయై కవి హృదయమును వ్యాఖ్యాతృ భావమును చక్కని పరిశీలన, విమర్శనములకు గురిచేసి రచించినట్టిది శ్రీ గోపాలాచార్ల ఆంగ్లానువాద వ్యాఖ్యలు. క్రీ.శ 1654 వ సం. నాటికే అబ్రహాము రోజరు దీనిని డచ్చి భాషలోనికి పరివర్తనము గావించెను. ఆంధ్రానువాదకులలో [[ఏలకూచి బాలసరస్వతి]], [[పుష్పగిరి తిమ్మన]], [[ఏనుగు లక్ష్మణ కవి]] యనువారు ముఖ్యులు.
 
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు