భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
ఓం నమో భగవతే వాసుదేవాయ
 
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ [[అవతారముల]]ను గురించి వివరించినారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడినది. [[వేదాలు]] విభజించి,[[ మహాభారతం]] రచించి, ౧౭ (17) [[పురాణాలు]] రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయినది. అప్పుడు వారి ఆద్యాత్మిక గురువు గారు అయిన [[నారద]] మహర్షి విచ్చేసి[[ భాగవతము]] రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.
 
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడినది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము,[[ భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]] లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము,[[ దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము,[[ పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము,[[ పరిక్షిత్తు ]]మరియు [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషుడుని ]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]] కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము,[[ పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రధమ స్కంధములో గలవు.
పంక్తి 9:
==అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట==
 
కురుక్షేత్రం అయిపోయిన రోజు రాత్రి పాండవ సిబిరంలో అందరూ నిద్రిస్తుండగా, అశ్వత్థామ వీరావేశంతో వచ్చినిద్రిస్తున్న ఊప పాండవులను హాతమార్చెను. ఉప పాందవులు చంపబడ్డారన్న వార్త తెలుసుకున్న అర్జునుడు వీరావేశంతో వీరిని చంపిన వాడిని తీసుకువచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపది తో శపథం చేసి, కురుక్షేత్రం కి వచ్చి అక్కడ ఉన్న భటుల ద్వారా చంపినవాడు అశ్వత్థామ అని తెలుసుకొని, వాడితో యుద్ధము చేసి చేసి, సవ్యసాచి ప్రతిభ ముందు తాడలేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించగా, ఆ అస్త్రం లోకాలన్నిటిని క్రమ్మేస్తుండగా అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించమనగా, అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించి పిమ్మట రెండు బ్రహ్మశిరోనామాస్త్రలను కూడా ఉపసంహరించి, అశ్వత్థామను కట్టి ద్రౌపది ఎదుట నిలబెట్టగా.
 
==మూలాలు==