మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 38:
}}
 
'''మండలి బుద్ధ ప్రసాద్''' ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం కలగలిపిన మనిషి. తెలుగు భాషా మరియు సంస్కృతులపై ఆసక్తి గల వ్యక్తి గా సుపరిచితులు.
==వ్యక్తిగత జీవితం==
మండలి బుద్ధ ప్రసాద్ మే 26, 1956న [[నాగాయలంక]], [[కృష్ణా జిల్లా]]లో జన్మించారు. ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు మరియు సమాజ సేవకుడు. చిన్నప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా వుండడంతో అభద్రతా భావంతోనే మండలి పెరిగారు. సాహిత్య, చరిత్ర పుస్తకాలు అప్పడు ఎక్కువగా చదవటం అలవడింది. బుద్ధప్రసాద్ ఆర్ట్స్ లో పట్టాపుచ్చుకున్నారు. విజయలక్ష్మిని పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు. <ref name=ttejam>{{cite journal |last1=పి |first1=రమేష్ రెడ్డి |year=2012 |title= ప్రజల మనిషి మండలి |journal=తెలుగు తేజం |volume=4 |issue=12 |pages=24 |publisher=బొగ్గవరపు మాల్యాద్రి |doi= |url= |accessdate= }}</ref>
 
==రాజకీయ జీవితం==
[[అవనిగడ్డ]] నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పన్నెండేళ్ళ పాటూ పనిచేశారు. 2007 ఏప్రిల్ లో పశుసంవర్థక మరియు పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిత్వమును నిర్వహించారు. రైతు కుటుంబ నుండి వచ్చినవారు కాబట్టి రైతుల సంక్షేమం కోసం పాటుబడ్డారు. కృష్ణా డెల్టాకు రెండు పంటల నీరుపంపిణీకి కృషి చేసి సాధించారు. ఆయన తండ్రి జీవితాశయమైన [[పెనుమూడి_(రేపల్లె)#పెనుమూడి-పులిగడ్డ వారధి|పులిగడ్డ -పెనుమూడి ]] వారధిని సాకారం చేశారు. రాజకీయాలలో నీతి, నిజాయితీకి పేరుతెచ్చుకున్నారు. <ref name=ttejam /> తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశారు. <ref name=Mandali>{{Cite web| title=అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక) |url=https://groups.google.com/forum/#!topic/sahitibandhu/8-H5GZdwm3Y|accessdate=2014-03-21}}</ref>
 
2012 అక్టోబరులో [[ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం]] కు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. ఆయన ఆధ్వర్యంలో 2012 [[ప్రపంచ తెలుగు మహాసభలు]] జరిగాయి. రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి మరియు పరిపాలనా భాషగా అమలుకు కృషి చేశారు. అయితే తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశారు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త] </ref>
 
==సామాజికసేవ==
"గాంధేయ" సమాజసేవాసంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. తెలుగుకి ప్రాచీన భాషా హోదా కొరకు ఏర్పాటైన భాషోద్యమశాఖకు బలమైన ఆధారంగా నిలిచాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సేవలందించాడు.
==సాహిత్య సేవ==
* భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం '''వజ్రభారతి''' కి సంపాదకత్వం వహించాడు.<ref>{{Cite book|title=వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం|last=మండలి|first=బుద్ధప్రసాద్ (సం)|url=http://archive.is/Mrbxp|accessdate=2014-03-20
|publisher= కృష్ణా జిల్లా రచయితల సంఘం|year=2007}}</ref>
*పసిడి పేరుతో ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో 50 ఏళ్ళ తెలుగు భాషా, సంస్కృతి సాహిత్య వికాస పరిణామాల సమీక్షగా 112 వ్యాసాల సంకలనానికి సహసంపాదకునిగా వ్యవహరించాడు. <ref>{{Cite book|title= పసిడి : ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో 50 ఏళ్ళ తెలుగు భాషా, సంస్కృతి సాహిత్య వికాస పరిణామాల సమీక్షగా 112 వ్యాసాల సంకలనం |last=మండలి|first=బుద్ధప్రసాద్ మరియు ఇతరులు |url=http://www.dkagencies.com/doc/from/1123/to/1123/bkId/DK735233217183805464651782371/details.html
|publisher= కృష్ణా జిల్లా రచయితల సంఘం|year=2006}}</ref>