మనిషికో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 19:
 
==సంక్షిప్త కథ==
నాలుగిళ్ళ నడవాలో నాలుగు కుటుంబాలు కాపురముంటాయి. అందులో ఒక జంట (మురళీ మోహన్, సుహాసిని) చాలీచాలని సంపాదనతో సతమతమవుతుంటారు. మురళీమోహన్‌కు సంపాదన తక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. భార్యతో ఉద్యోగం చేయించడం, ఆమె పుట్టింటి నుండి సహాయం అందుకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఒక చిన్నగదిలో ఉండే బడిపంతులు (హేమసుందర్?) కాపురమంతా భార్యకు ఉత్తరాలు వ్రాయడానికే పరిమితం. అతనొక చోట, అతని భార్య మరొక చోట ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరో ఒకరికి బదిలీ కావాలని అతను ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరొక జంట (చంద్ర మోహన్, ప్రభ) ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో అక్కడ వారే కాస్త స్థితిమంతులు. ఉద్యోగం మానేసి చక్కగా పిల్లలను పెంచుకొంటూ సంసారం చేయాలని ప్రభ కోరిక. భార్య తెచ్చే సంపాదన విలువ తెలిసిన చంద్రమోహన్ అందుకు ఒప్పుకోడు. ధారాళంగా వరండాలో కూర్చుని భార్య జాకెట్టుకు హుక్కులు కుట్టడం అతనికి చిన్నతనం అనిపించదు.
 
 
ఇక నాలుగో కుటుంబం ఈ కథలో కేంద్రస్థానం ఆక్రమిస్తుంది. గెద్దముక్కు పంతులు (లేదా మరో పేరు - సరి చూడాలి)గా గొల్లపూడి మారుతీరావు, అతని భార్యగా అన్నపూర్ణ నటించారు. ఇంట్లో ఒక్కో సామాను అమ్మేస్తూ అన్నపూర్ణ సంసారం నెట్టుకొస్తుంటుంది. గొల్లపూడి మారుతీరావు పనీపాటా లేకుండా పొద్దస్తమానం వార్తా పత్రికలు తిరగేస్తూ ప్రపంచంలోని సకల వ్యవహారాలనూ పరిశిలించి చర్చిస్తుంటాడు. తన మెలిక సంభాషణలతో అందరి తలలూ తింటుంటాడు. వారి కొడుకు కూడా పనీపాటా లేకుండా తన అభిమాన హీరో ఫంక్షనుల కోసం పొద్దస్తమానం ఖాళీలేకుండా తిరుగుతుంటాడు. ఇంట్లో బిందెలమ్మేసి హీరో ఫంక్షనులకు డబ్బు సమకూర్చుకొంటుంటాడు. వారి కూతురు దుర్గ (పూర్ణిమ) షుమారు పద్ధెనిమిదేళ్ళ పిల్ల. ఇంట్లో పరిస్థితులను అర్ధం చేసుకొంటుంది.
 
 
వారికి పాలుపోసే అమ్మాయి (జయమాలిని?) తెలివైనది, మంచిది. ఆమె గేదె సినిమా పోస్టరులు తింటూ పాలిస్తుంది. ముఖ్యంగా ఎన్.టి. రామారావు సినిమా పోస్టరులైతే దానికిష్టం. ఎన్టీబాబు సినిమాలు తగ్గిపోయాక దాని పాలు తగ్గిపోతున్నాయి గనుక క్రొత్త హీరోలను అభిమానించడం నేర్చుకోమని ఆ గేదెకు ఆమె హితవు చెబుతుంటుంది. ఆ పాలమ్మాయి సహాయంతో, తన తల్లిదండ్రులకు తెలియకుండా, దుర్గ ఒక ఇంట్లో పనికి కుదురుతుంది. అజ్ఞాతంగా తన జీతం నెలనెలా తల్లిదండ్రులకు మనియార్డరు చేస్తుంటుంది. చివరికి ఆ డబ్బు పంపపేది దుర్గేనని తెలిసికొని ఆమెతండ్రి ఆమెను నిలదీస్తాడు. అవినీతికి పాల్పడకుండా ఒక ఆడపిల్ల అంతడబ్బు ఎలా సంపాదిస్తుందో జవాబు కావాలని తండ్రిగా ఆమెను శాసిస్తాడు. అందుకు దుర్గ చెప్పిన జవాబు - "నా తండ్రి అని చెప్పుకొనే హక్కు నీకెక్కడుంది? పిల్లలకోసం ఏమైనా చేశావా? కేవలం పిల్లలను పుట్టించడమే నీ అర్హత అయితే నీ గొప్పతనాలు నీ భార్య దగ్గఱ చెప్పుకో కాని పిల్లలను నిలదీసే అధికారం లేదు. మా మీద నీకు హక్కు లేని అధికారం చెలాయించవద్దు." దానితో దిమ్మతిరిగి ఆ తండ్రి మనసు మారుతుంది. ఒక కలిగిన వారింట్లో రోగిష్టి ఆడమనిషికి సేవ చేయడమే దుర్గ చేసే ఉద్యోగం అని పాలమనిషి వారికి వివరిస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/మనిషికో_చరిత్ర" నుండి వెలికితీశారు