మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[File:The fish avatara of Vishnu saves Manu during the great deluge.jpg|thumb|300px|Matsya pulls a boat carrying Saint Manu and Saptrishi during floods or Pralaya]]
'''మనుస్మృతి''' పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అందురు. క్రీస్తు పూర్వం 200 - క్రీస్తు శకం 200 మధ్య మను అను ఋషి వ్రాశాడు. మనుస్మృతి ని మొదటిసారిగా 1974లో సర్ విలియమ్ జోన్స్ అను అంగ్లేయుడు ఆంగ్లంలో తర్జుమా చేశాడు. ఈ శాస్త్రంలో ఆదిమానవుడైన మను వివిధ వర్ణాలకు చెందిన ఋషులతో సమస్త విషయాలు బోధించినట్లు చూస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనుస్మృతి బ్రహ్మ వాక్కుల సంపుటి అని నమ్మకం.
 
హిందూ పవిత్ర పుస్తకాల్లో మనుధర్మ శాస్త్రం ముఖ్యమైనది. దీనిని మానవ ధర్మ శాస్త్రం అని కూడా అందురు. మనుధర్మ శాస్త్రమును వేదాలకు ఖిలిబుక్కు (Supplementary)అని భారతీయులు నమ్ముదురు. ఇందులో 2,684 వాక్యములు 12 అధ్యాయాలుగా విభజింపబడ్డాయి. గృహ , సామాజిక మరియు మతపరమైన నియమాలు ఇందులో ఉంటాయి.
 
మొదటి అధ్యాయంలో సృష్టి ఆవిర్భావం, పుస్తక జననం, పుస్తకం ఎందుకు చదవాలి అన్న విషయాలుంటాయి. 2 నుండి 6 వ అధ్యాయాల్లో ఉన్నత కులాల వారి కట్టుబాట్లు, యజ్ఞోపవేతము ధరించడం ద్వారా లేదా పాప పరిహార యాగం ద్వారా బ్రాహ్మణ కులాన్ని ఆచరించడం గురించి, బ్రాహ్మణ గురువు వద్ద విద్య నేర్చుకొనే విద్యార్దుల ప్రవర్తన గురించి, గృహస్తుడి ప్రధాన బాధ్యతలైన - భార్య ఎంపిక, వివాహం, యజ్ఞ యాగాదుల సంరక్షణ, ఆతిధ్యము, దేవుళ్ళకు అర్పించే బలులు, విందులు, వృధాప్యంలో బాధ్యతలు మొదలైనవి చెప్పబడినవి. 7వ అధ్యాయంలో పాలించే రాజుల బాధ్యతలు,
8 వ అధ్యాయంలో చేసిన అపరాధానికి కులాన్ని బట్టి శిక్షలు, 9 మరియు 10 అధ్యాయాల్లో ఆస్తి వారసత్వము, విడాకులు మరియు న్యామైన కుల వృత్తులు గురించి ఇవ్వబడినవి. 11 వ అధ్యాయంలో చేసిన అపరాధాలకు తపస్సులు, 12 వ అధ్యాయంలో కర్మ, పునర్జన్మ మరియు మోక్షము వంటి విషయాలు చర్చించబడినవి.
 
== కొన్ని ముఖ్యమైన విషయాలు==
*మనువు నోటినుండి బ్రాహ్మణులు, భుజమునుండి క్షత్రియులు, తోడలనుండి వైష్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించారు.
*బ్రాహ్మణులను వేద పండితులు మరియు గురువులుగా, క్షత్రియులు పరిపాలకులుగా, వైశ్యులు వ్యాపారులు మరియు వ్యవసాయదారులుగా, శూద్రులు సేవకులుగా ఆశీర్వదించాడు మనువు.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే వేదాలు చదవడానికి, యజ్ఞోపవేతమును ధరించడానికి అర్హులు.
*స్త్రీల పేర్లు పలుకడానికి తేలికగా, చక్కటి అర్ధం వచ్చేలా ఉండాలి.
*8 సంవత్సరాల బ్రాహ్మణుడికి, 11 సంవత్సరాల క్షత్రియుడికి, 12 సంవత్సరాల వైశ్యుడుకి ఉపనయనం జరుపవలెను.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే ద్విజులు, అనగా యజ్ఞోపవీతము ధరించేవారు.
*గురువు బ్రాహ్మణుడి ప్రతిరూపము, తండ్రి ప్రజాపతి రూపము, తల్లి భూదేవి రూపము, పెద్ద సోదరుడు తన స్వరూపము.
*ద్విజులు శూద్ర స్త్రీలను భార్యగా స్వీకరిస్తే, వారు తమ కుటుంబాలను నాశనం చేసుకొందురు, తమ పిల్లలు శూద్రులగుదురు.
*స్త్రీలు తమ సోదరుల చేతను, తండ్రుల చేతను, భర్తల చేతను, మరుదుల చేతను గౌరవించబడవలెను, ఆరాధించబడవలెను.
*స్త్రీలు గౌరవింపబడిన చోట దేవుళ్ళు ఆనందించుదురు. గౌరవింపబడనిచోట ఎటువంటి కార్యాలు చేసినా ఫలితము ఉండదు.
*స్త్రీలు బాధపడిన కుటుంబము సర్వనాశనమవుతుంది. వారు సంతోషించిన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది.
*పురుషులు తమ క్షేమం కోసం వస్త్రములతోను, ఆభరణములతోను, స్త్రీలను గౌరవించాలి.
*భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఆనందించిన కుటుంబము కలకాలం వర్ధిల్లుతుంది.
*స్త్రీలు స్వతంత్రంగా , తన ఇంటిలో కూడా ఏపనీ చేయరాదు.
*స్త్రీ బాల్యంలో తల్లిదండ్రుల రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కుమారుల రక్షణలో ఉండాలి. ఆమె ఎంత మాత్రమును స్వతంత్రంగా ఉండరాదు.
*తండ్రి, భర్త, కుమారులను వీడిన స్త్రీ కుటుంబములను నవ్వులపాలు చేస్తుంది.
పంక్తి 31:
*భర్త తన భార్యను దేవుడి నుండి పొందుతాడు, తన ఇష్ట ప్రకారం పొందడు. ఆమె నమ్మకంగా ఉన్నంత వరకూ ఆమెకు సాయపడాలి.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే రెండు జన్మలు కలిగినవారు, శూద్రులు మాత్రం ఏక జన్మ కలిగినవారు, ఐదవ కులము లేదు.
*బ్రాహ్మణుడికి మరియు వైశ్య కన్య వల్ల కలిగిన కుమారుడిని అంబస్తుడు అని, శూద్ర కన్య వల్ల కలిగిన కుమారుడు ని నిషాడుడు అని అంటారు.
*క్షత్రియుడికి శూద్ర కన్య వల్ల కలిగిన కుమారుడిని ఉగ్ర అని అంటారు.
*క్షత్రియుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని సూతుడు అని, వైశ్యుడుకి క్షత్రియ కన్య వల్ల కలిగిన కుమారుడుని మగధ అని, వైశ్యుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని వైదేహుడు అని అంటారు.
పంక్తి 37:
 
==ఇతర విషయములు==
స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా వ్రాయబడినదని అభిప్రాయ పడుతున్నారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చినది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో సమాజ వ్యవస్త అద్భుతంగా ఉండేదంటే దానికి ఒక కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలు మనుధర్మ శాస్త్రం అనుసరించడం అని చెప్పవచ్చు.
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు