మసాలా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 35:
జరిగిందంతా మర్చిపోయి అందరూ హాయిగా ఉన్నప్పుడు ఒకసారి బలరాం సివిల్ ఇంజినీరు([[వేణుమాధవ్]])ని రప్పిస్తాడు తమ స్థలంలో ప్రజలకు మేలు చేసే ప్రయత్నాల గురించి చర్చించడానికి. దూరాలని చూసే బైనాకులర్ వాడి పరిసరాలని చూస్తున్న ఆ ఇంజినీరు రహ్మాన్, మీనాక్షిలు ఒకరినొకరు పట్తుకుని నిలబడటం చూస్తాడు. ఇదే బలరాంకి అక్కడున్న ఎద్దులోడు చూపిస్తాడు. ఈ దృశ్యం చూసిన నారాయణ పారిపోతాడు. మీనాక్షి ఓ నపున్సకుడిని పెళ్ళిచేసుకోవాలనుకోవడం పిచ్చి అనుకున్న బలరాం రహ్మానుని వదిలెయ్యమని బ్రతిమాలతాడు. తను వినదు. రాముని రహ్మాన్ తన చెల్లెలి దగ్గరికి రాకుండా చూసుకొమ్మని బెదిరిస్తాడు. తను సరేనంటాడు. ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నారని తన అమ్మమ్మ ఊరికి వెళ్తూ రాముని తన అన్నని ఒప్పించమని, కుదరకపోతే తనని లేపుకుపొమ్మని చెప్పి వెళ్ళిపోతుంది మీనాక్షి. తను వెళ్ళే బస్ చీపౌరుపల్లి గ్రామం బస్ డిపోలో ప్రయాణికుల భోజనం కోసం ఆగుతుంది. అప్పుడు నాగరాజు తన మనుషులతో వచ్చి తనని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే రాము, బలరాం వచ్చి నాగరాజుకి, తన మనుషులకి దేహశుద్ధి చేసి వాళ్ళని పోలీసులకు పట్టిస్తాడు. రహ్మాన్ ఊరొదిలి పారిపోయాడని అందరూ నమ్మాక బలరాం తన చెల్లెలిని కాపాడిని రాముని తన చెల్లెలిని పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలతాడు. కానీ తన అక్క సరిత పెళ్ళి అవ్వనిదే తనెలా పెళ్ళి చేసుకోవడమని వాదించడం విని కుండమార్పిడి పెళ్ళి కుదురుస్తాడు. దీని ద్వారా రాము - మీనాక్షి, బలరాం - సరితల పెళ్ళిళ్ళు ఒకే సారి జరుగుతాయి.
 
ఇది తెలుసుకున్న సానియా బలరాం ముందుకి వెళ్ళి మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోలేనంటుంది. అప్పుడు బలరాం తన గతం గురించి చెప్తాడు. తను ప్రేమించిన సావిత్రి అచ్చం మీలాగే ఉండేదని, 4 ఏళ్ళ క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, అందుకే మీలో నా సావిత్రిని చూసుకుని మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నానంటాడు బలరాం. కానీ తను సరిత అని, సావిత్రి కాదని గ్రహించడం కుదరలేదంటాడు. అయినా రాము లాంటి మంచి మనిషి తన చెల్లెలి మొగుడవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని అంటాడు. పశ్చాత్తాపంతో ఉన్న సానియా రహ్మాన్ దగ్గరికి వెళ్ళి బలరాంకి నిజం చెప్పమంటుంది. దానికి రహ్మాన్ సరేనంటాడు. ఇదంతా సెల్ ఫోనులో రికార్డ్ చేసిన ఎద్దులోడు బలరాంకి చూపిస్తాడు. కోపంతో నన్ను వంచించారన్న బాధతో వాళ్ళని చంపాలనుకుంటాడు బలరాం. మరుసటి ఉదయం బలరాంకి నిజం చెప్పేద్దామని బయలుదేరబోతున్న రహ్మాన్, సానియా, సూరి, నారాయణ, చింతామణి, సూరి స్నేహబృందాన్ని బలరాం మనుషులు దగ్గరుండి మహలుకు తీసుకెళ్తాడు. అక్కడ నాటక రూపంలో జరిగిన కథంతా బలరాం చూపించి వెంటనే వాళ్ళందరిని తుపాకితో కాల్చాలనుకుంటాడు. ఇంతలోపే వాళ్ళు మీనాక్షితో కలిసి పరిపోతారు, బలరాం తన మనుషులతో కలిసి వాళ్ళని తరుముతుంటాడు. ఓ కొండ చరియలో బలరాం కారు పడిపోయి ఓ రాయిపై నిలుస్తుంది. రహ్మాన్ ఎలాగైనా బలరామ్ని కాపాడాలని పరిగెత్తి పొరపాటున పైకెక్కిన బలరామ్ని తిరిగి కింద కారు మీద పడేలా చేస్తాడు. మళ్ళి పైకెక్కుదామంటే బలరాం రహ్మానుని నమ్మడు. అప్పుడు రహ్మాన్ తను అబద్ధాలాడింది నిజమే అయినా అవి తన అవసరాల కోసమే ఆడానని, అన్ని అబద్ధాలాడినా ఒక్క రూపాయి కూడా అటూ ఇటూ పోనీలేదని, నిజాయితీగా పనిచేసానని వాదిస్తాడు. రహ్మాన్ జారి పడబోతుంటే బలరాం రహ్మానుని కాపాడుతాడు. బలరాం రహ్మానుని క్షమించి తిరిగి అందరూ సుఖంగా ఉండటంతో సినిమా ముగుస్తుంది.
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/మసాలా" నుండి వెలికితీశారు