మాధ్యమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
సమకాలీన విద్యావిధానంలో, మాధ్యమిక విద్య, చాలా ప్రధానమైనది. మనదేశంలో ఈ విద్యావిధానము అతి ప్రధానమైనది. ఈ విద్యకొరకు 14-18 సంవత్సరాల వయస్సు నిర్ధారింపబడినది. ఈ విద్య అందరికీ తప్పనిసరి చేయబడినది. ఈ విద్య ఆధారంగానే అక్షరాస్యత గణాంకాలు జరుగుతున్నవి. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే.
 
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ విద్యను [[పాఠశాల విద్యాశాఖ]] మరియు [[ఇంటర్మీడియట్ విద్యా మండలి]] వారు నిర్వహిస్తారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు [[జిల్లా పరిషత్]], [[మండల పరిషత్]], [[మునిసిపల్ కార్పొరేషన్]], మరియు [[పురపాలక సంఘం]], కలుగజేస్తాయి. జిల్లాలో [[విద్యాశాఖ]], [[జిల్లా విద్యాశాఖాధికారి]] ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ మాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది.
భారత ప్రభుత్వం మాధ్యమిక శిక్ష అభియాన్ <ref>[http://www.indg.in/primary-education/policiesandschemes/c30c3ec37c4dc1fc4dc30c40c2f-c2ec3ec27c4dc2fc2ec3fc15c4d-c36c3fc15c4dc37c3e-c05c2dc3fc2fc3ec28c4d-c06c30c4d-c0ec2ec4d-c0ec38c4d-c0e మాధ్యమిక శిక్ష అభియాన్] </ref> ద్వారా ఈ విద్యని మెరుగుపరచటానికి కృషి చేస్తున్నది
 
==కంప్యూటర్ విద్య ==
[[ఫైలు:Icatschoolscoverpage.jpg|right|thumb| ఐసిటి@స్కూల్స్ పుస్తకపు పై పేజి]]సమాచార, ప్రసార సాంకేతిక రంగం (Information and Communication Technology ICT) దేశ ప్రగతికి, సామాజిక మార్పుకి ఉత్ప్రేరకం కాబట్టి, అంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక విధానం (IT Policy) ముఖ్యోద్దేశము " సమాచార అందుబాటులో అసమానతలను తొలగించి, అన్ని ప్రభుత్వ స్థాయిలలో పౌరసేవలను మెరుగుపరచి,రాష్ట్రంలో సమాచార సాంకేతిక పెట్టుబడులను ప్రోత్సహంచి, సమాచార సాంకేతిక సాధనాలతో, మానవవనరుల అభివృద్ది చేయటం".
 
అందుకని కంప్యూటర్ విద్యని సెకండరీ పాఠశాల స్థాయిలో ముఖ్యమైనదిగా చేసి, దీనికోరకు పధకాలను ప్రవేశపెట్టారు.
* 2000: క్లాస్ పధకం ( జిల్లాకి ఒక పాఠశాలను కంప్యూటరీకరించడం)
* 2002: ఐసిటి@ 1000 పాఠశాలలు
* 2008: [[ఐసిటి]]@ 5000 పాఠశాలలు (ఐదు సంవత్సరాలు బూట్ (BOOT) పద్ధతి)
* ఇవేగాక, వివిధ స్వచ్ఛంధ సంస్థల సహాయంతో, కంప్యూటర్ సహాయంతో నేర్చుకోవడం పధకాలను అమలు చేస్తున్నది.
* 2009: [[మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు శిక్ష]] ద్వారా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విద్య నేర్పెడివారికి కంప్యూటరు శిక్షణ ఇవ్వడం.
వీటివలన, 2020 నాటికి, 21 శతాబ్దపు ఒత్తిళ్లు ఎదుర్కొనే అక్షరాశ్యతే కాక, జ్ఞాన సమాజాన్ని నిర్మించే దిశగా పని జరుగుతున్నది.<br />
దీనికొరకు [[రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ]] <ref> [http://www.apscert.org/computer.htm రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ కంప్యూటర్ విద్యా శాఖ]</ref> ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది.
===విమర్శలు===
బూట్ (BOOT) పద్ధతిలో ధనాన్ని సేవల అమ్మకందారులపై ఖర్చు పెడతారు. వీరు అరకొర జీతాలపై కంప్యూటరు ఉపాధ్యాయులను నియమిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు భాధ్యత లేనందున, కాలపరిమితి తరువాత దీనిని కొనసాగించటం కష్టమవుతుంది. ఇలా జరిగిన [[కర్ణాటక]]లో ఫలితం సరిగా లేదని, దీనికి బదులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు భాధ్యత ఇచ్చిన [[కేరళ]]లో ఫలితాలు బాగున్నాయని, [[ఐటిఫర్ ఛేంజ్ ]] స్వచ్ఛంధ సంస్థ అధ్యయనంలో<ref>[http://www.hindu.com/2009/09/30/stories/2009093053590400.htm ఐటిఫర్ ఛేంజ్ స్వచ్ఛంధ సంస్థ అధ్యయనం పై హిందూలో రిపోర్టు]</ref> తెలిసింది.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/మాధ్యమిక_విద్య" నుండి వెలికితీశారు