యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''యలమంచిలి వెంకటప్పయ్య ''' [[హేతువాది]]. 1898లో జన్మించారు. [[స్వాతంత్ర సమర యోధుడు]]. కాకినాడ లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. [[చెరుకువాడ నరసింహం]] [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. [[మంత్రాలులేని వివాహాలు]], [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
==జననం: మరణం== 30 డిశెంబరు 1898. ... 1 మర్చి 1997 (98 సంవత్సరాలు)
==తలలి దండ్రులు== తల్లి పేరు: ఆదెమ్మ: తండ్రి: అంకప్ప, ఆయన తండ్రిపేరు వీరన్న, వీరన్న తండ్రి పేరు నీలయ్య, నీలయ్య తండ్రి పేరు పాపయ్య.
==కుటుంబం== పెద్ద కమ్మ రైతు కుటుంబం: ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు.
===రచయిత జీవితంలో కొన్ని సంఘటనలు.... వారి మాటల్లోనే....===
 
;నేను బడికి వెళ్ళే టప్పుడు రోజు ఎడమ చేతి చంకలో బడిలో కూర్చోవడానికి సొంతంగా ఇంటి వద్ద అల్లుకొనిన తాటాకుల చాపను, కుడి చేతిలో బడి వద్ద నేల మీద అక్షరాలు నేర్చుకోవడానికి పిడకల చచ్చికలు గల చిన్న తాటాకు బుట్ట తీసుకుని వెళ్ళే వాణ్ణి.
 
; నేను ఆంధ్ర నామ సంగ్రహము, గజేండ్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము.. చదివాను. అమర కోశము కంఠస్థ పరచాను. ఈ పుస్తకాలన్నీ నా 14 ఏండ్ల లోపలే చదివాను.
 
;మాబడికి ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సెలల్వులుండేవి. సెలవులకు ఆటూడుపు రోజులు అనే వారు. ప్రతి ఆటూడుపుకు ప్రతి పిల్లవాడు ఒక్కొక్క కాని, విలువగల గారి నాణెమును పంతులకు ఇవ్వాలి.
 
;ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచ్చి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.
 
;ఆ రోజుల్లో తెల్ల దొరలు, తెల్ల దొరసానులు మాదిగ గూడాలలోనే తరచుగా వచ్చి తమ క్రీస్తు మత ప్రచారం చేసే వారు. అందువల్ల వారు మాట్లాడే భాషను మాల భాషగా, మాదిగ భాషగా ఎంచి దానిని ఏవ గించుకుని దాని జోలికి పోయే వారు కాదు.
 
;ఆత్మాభిమానం గల ఒక ముసలు బ్రాహ్మణేతరుదు జబ్బు పడి ఆర్థిక సాయానికై ఎవరింటికెళ్ళినా... వారతనిని నానా చీవాట్లు పెట్టి తరిమేశేవారు. ఎందుకనగా ... బ్రాహ్మణేతర బిచ్చగానికి ఏవిధమైన దానం చేయ కూడదనియు, చేస్తే చేసిన వారికి పాపం తగులు తుందనియు కేవలం బ్రాహ్మణుడనే వానికొక్కనికే బిచ్చం పెట్టే వారిని తరింప చేయ గల శక్తి గలదనియు శాస్త్రములో వ్రాయ బడి ఉందని బ్రాహ్మణ పండితులు వక్కాణించే వారు. (పుట: 23)
 
;ఆ రోజులలో కల్లు, సారాయి, చుట్ట, బీడీలు త్రాగుట సంఘంలో చేయ కూడని పనులుగా ఎంచ బడేవి. కల్లు సారాయి త్రాగిన వారిని నేరస్తులుగా ఎంచి గ్రామ పెద్దలు వారిని శిక్షించే వారు. అందు వల్ల బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు మాల మాదెగ వారు ఎవరూ కూడ బహిరంగంగా స్వేచ్ఛగా కల్లు సారాయి త్రాగేవారు కారు. ఆ దుకాణాలు కూడ గ్రామానికి దూరంగా మారు మూల వుండేవి.
 
;1914 వ సంవత్సరంలో ఘట్టి సుబ్బారావు గారి వద్ద ఉచితంగా ఇంగ్లీషు నేరుచుకునే వాడిని. అక్కడ మామేనత్త గారింట్లో పని చేస్తూ అన్నం తిని చదువుకునే వాడిని. కాని వారు తిండి సరిగా పెట్టక పనెక్కువ వుండడంతో నా చదువు సాగలేదు. ఆవిషయం మా ఇంగ్లీషు మాస్టారైన ఘట్టి సుబ్బారావుగారితో చెప్పగా.. వారు ఆ వూరి పెత్తందారైన గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారికి అప్పచెప్పారు. [[గుళ్ళపల్లి రామ బ్రహ్మం]] గారు నన్నెంతో ఆదరించి మాఇంట్లో తిని నీ ఇష్టమొచ్చినంత కాలం చదువు కోరా అని అన్నారు.
 
 
<br />
==వ్రాసిన పుస్తకాలు==
# [[వేదాలంటే ఇవేనా?]] 1984
# [[పుష్కరాలు ఎవరి కోసం?]] 1980
పంక్తి 46:
#[[దేశం ఏమైపోయేటేటట్టు]]
#[[మన దేశం బాగు పడేదెలా?]]
#[[నేడు మన దేశం ఎటు పయనైస్తున్నది? ఉన్నత శిఖరం పైపుకా? అవినీతి అగాధం వైపుకా?]]
#[[నేడు జగమంతా స్వార్థమయం]]
#[[సామాన్య జనం తెలుసుకోవలసిన చేదు నిజాలు]]
పంక్తి 52:
#[[పెద్దలేమన్నారు? మూడు భాగాలు.]]
#[[వైధిక ఆర్యుల ప్రాచీన సంస్కృతి]]
మొదలగు మొత్తం 53 పుస్తకాలు రచించారు:
 
(మూలం: బీద బ్రతుకు పుస్థకంలో 70, 71 పుటలలో పొరచురించిన జాబితా నుండి సేకరించినది)
[[వర్గం:తెలుగు వ్యక్తులు]]