రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q707203 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''రెండవ హరిహర రాయలు''', [[మొదటి బుక్క రాయలు]] మరణానంతరము [[1377]]లో సింహాసమునకు వచ్చాడు.
 
==సామంత రాజ్యాల పునరాధీనము చేసుకొనుట==
పంక్తి 12:
 
==యుద్దములు==
మొదటి తరం [[విజయనగర]] రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్దాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్దాలు తప్పలేదు. [[1378]] నందు బహుమనీ సుల్తాను [[ముజాహిద్ షా]] దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. [[1378]] నందే [[రెండవ మహమ్మద్ షా]] సింహాసనము అధిస్టించినాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. [[కొండవీడు]] రెడ్డిరాజ్యమున [[పెదకోమటి వేమారెడ్డి]], [[కుమార గిరి రెడ్డి]], [[కాటయవేమా రెడ్డి]] ల మధ్య తరచూ యుద్దములు జరుగుతుండేవి. ఇదే సమయములో [[రేచర్ల పద్మనాయకులు]] [[బహుమనీ సుల్తాను]]లతో స్నేహం చేసుకొని [[విజయనగర]], [[కొండవీడు]] రాజ్యములను ఆక్రమించాలని పథకం రూపొందించినారు. ఇటువంటి పరిస్థితులలో '''రెండవ హరిహర రాయలు''' [[కొండవీడు]] రాజ్యమందున్న [[శ్రీశైలం]] ప్రాంతమును ఆక్రమించినారు. కానీ [[కాటయవేమా రెడ్డి]] [[విజయనగర]] సేనలను ఎదుర్కొని ఓడించినాడు. '''హరిహర రాయలు''' కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు [[కాటయ]]కూ తన కూతురు [[లక్ష్మి]] కి వివాహం జరిపించినాడు.
===మోటుపల్లి యుద్దం===
'''హరి హర రాయలు''' కుమారుడైన [[దేవ రాయలు]] [[ఉదయగిరి]] అధిపతి . ఆతడు సైన్యముతో [[మోటుపల్లి]] రేవును ఆక్రమించినాడు. తరువాత [[కొండవీడు]] రాజ్యముపైకి '''హరిహర రాయలు''' [[చౌండసేనాని]] ని పంపించినాడు. ఇదే సమయంలో [[కొండవీడు]]ను [[కుమారగిరి రెడ్డి]] నుండి స్వాధీనము చేసుకున్న [[పెదకోటి వేమా రెడ్డి]] [[విజయనగర]] సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేశాడు.
===పద్మనాయకులతో యుద్దములు===
====మొదటి దండయాత్ర====
'''హరిహర రాయలు''' పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, [[యువరాజు]] అయిన [[రెండవ బుక్కరాయలు]]ను పంపించినాడు, ఈ యుద్దములో [[సాళువ రామదేవుడు]] అను యోధుడు చాలా ప్రముఖ పాత్ర వహించినాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడంలో [[పద్మనాయక ప్రభువులకు]] [[బహుమనీ సుల్తానులు]] సహాయం చేసినారు. [[కొత్తకొండ]] ప్రాంతమున జరిగిన పోరాటంలో [[సాళువ రామదేవుడు]] ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలు అర్పించినాడు. [[రెండవ బుక్క రాయలు]] ఓటమిభారంతో [[విజయనగరం]] తిరిగి వచ్చినాడు.
 
====రెండవ దండయాత్ర====
[[1397]]లో మరలా '''రెండవ హరిహర రాయలు''', [[గండదండాధీశుడు]] వంటి అనేక వీరులను, పెద్ద సైన్యమును, తోడుగా ఇచ్చి [[యువరాజు]] [[రెండవ బుక్క రాయలు]]ను మరల [[పద్మనాయకులు]] పైకి దండయాత్రకు పంపించినాడు. ఇదే సమయలో [[దేవరాయలు] మరికొంత సైన్యముతో [[అలంపురం]] పైకి దండెత్తినాడు. ఈ దండయాత్రలను పద్మనాయకులు, బహుమనీల సహయంతో ఎదుర్కోవాలని చూసినారు, కానీ [[విజయనగర]] రాజ సైనికులు [[కృష్ణా నది]] ఉత్తరభాగమున ఉన్న [[పానుగల్లు]] కోటను ముట్టడించి వశము చేసుకున్నారు, అలాగే [[చౌల్ దాలోల్]] ప్రాంతమును విజయనగర సైనికులు సాధించినారు.
 
===సింహళ దేశ విజయ యాత్ర===
[[విరూపాక్ష రాయలు]] గొప్ప నావికా సైన్యమును అభివృద్దిచేసి [[సింహళ]] ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చినాడు. ఈ విజయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని. కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించినారు.
 
===కొండవీడు యుద్దాలు===
పంక్తి 31:
ఈ రాజు పరిపాలనా కలమున దేశమునందు గొప్ప కరువు ఏర్పడినట్లు తెలుస్తున్నది
==గురువు==
వీరికి కూడా విద్యారణ స్వామివారే గురువుగా ఉన్నారు. అంతే కాకుండా వీరే మంత్రిగా ఉన్నారు కూడా!
==ఇతని వారసుడు==
నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన [[రెండవ బుక్క రాయలు ]] ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, [[సింహళ]]మును జయించినవాడు అయిన [[విరూపాక్ష రాయలు]] సింహాసనము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించినాడు, కానీ [[రెండవ బుక్క రాయలు]] తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించినాడు. తరువాత [[దేవరాయలు]] [[ఉదయగిరి]] దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసనం అధిష్టించి, 16 సంవత్సరములు మరణము వరకూ విజయవంతమైన పరిపాలన చేసినాడు
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు" నుండి వెలికితీశారు