లవకుశ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 2:
== ఇతివృత్తం ==
తండ్రి దశరథ మహారాజు ఆనతి మేరకు,సీతా లక్ష్మణ సమేతుడై, వనవాసాన్ని పూర్తి చేసుకున్న శ్రీ రామచంద్రుడు అయోధ్యాపురి చేరగానే అతని పాదులకలను కాళ్ళకు తొడిగి సింహాసనాన్ని అధిష్టించమని వేడుకుంటాడు భరతుడు. వశిష్ఠ మహర్షి కిరీటాన్ని అలంకరించగా కొలువుదీరిన రామచంద్రునికి విభీషణుడు, సుగ్రీవుడు,ఇంద్రుడు తమ తమ కానుకలను అందిస్తారు. ప్రక్కనే పాదాలచెంత కూర్చున్న హనుమంతునికి సీతమ్మ ముత్యాలహారాన్ని బాహుకరించగా అందులోని ఒక్కొక్క ముత్యాన్ని కొరికిచూసి వాటిలో తన ఆరాధ్యదైవం
శ్రీ రాముని పట్టాభిషేక వైభవాన్ని చూసిన శూర్పణఖ కరాళులు తమ రాక్షస వంశ నాశనానికి కారకుడైన రామచంద్రుడు సుఖంగా ఉండరాదని, సీతారాముల మధ్య ఎడబాటు కలిగించాలని మారువేషాలు ధరించి చాకలి దంపతులుగా మారిపోయి గొడవపడుతుంటారు. భార్యను ఏలుకొమ్మని చెప్పిన కులపెద్దలతో, నేను వెర్రి రాముణ్ణి కాదు, పరాయివాడి పంచన ఉండివచ్చిన భార్యను ఏలుకోవడానికి అనగా విన్న భద్రుడు అనే గూఢచారి ఈ మాటాలను రామునికి తెలియజేస్తాడు. అది విన్న రాముడు ఖిన్నుడై, భరత లక్ష్మణ శతృఘ్నులను పిలిచి జననిందకు కారణభూతురాలైన జానకిని భాగీరథీ నదీతీరాన విడిచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు. వద్దని
ఒకనాడు తోటి మునిబాలకులతో ఆడుకుంటున్న లవునికి శ్రీ రాముడు అశ్వమేధయాగం లో విడిచిన యజ్ఞాశ్వం కనిపిస్తే దానిని బంధిస్తాడు. విడిపించుకోవడానికి వచ్చిన శతృఘ్న, భరత, లక్ష్మణులను మూర్చ పోగొడతారు బాలలు. చివరకు యజ్ఞదీక్షలో ఉన్న రామచంద్రుడే స్వయంగా బాలలను చూసి అప్రతిభుడై వారిలో మునిబాలకుల లక్షణాలు లేవని భావించి ఎవరని ప్రశ్నించగా తాము వాల్మీకి మహర్షి శిష్యులమని తమ తల్లి జానకీదేవి కుమారులమని తెలుపగా ఆ పేరు విన్న రాముడు మూర్చ పోతాడు. ఇది చూసిన హనుమంతుడు బాలలపైకి గద ఎత్తగా రామనామ గానం తో మారుతిని కట్టి పడేస్తారు. అంతలోనే తేరుకున్న హనుమ ఈ వార్తను ఆశ్రమం లో ఉన్న సీతాదేవికి,వాల్మీకి మహర్షికి తెలుపగా వారు పరుగు పరుగున వచ్చే సరికి రాముడు మూర్ఛనుండి తేరుకొని, సీతనుజూసి మన్నింపమని, తన వేటా అయోధ్యాపురికి రమ్మని కోరుతాడు. అవమానాలపాలైన తనకు ఇంకా ఈ రాజ్యభోగాది విభవమ్ములపై కాంక్ష లేదని, కుమారులను తండ్రికి అప్పగించి తన తల్లియైన భూమాత ఒడిలోనికి చేరిపోతుంది జానకీ మాత. వాల్మీకి సహితుడై శ్రీ రాముడు అయోధ్యాపురి జేరి లవకుశులకు యువరాజ పట్టాభిషేకం జరుపుతాడు.
|