వంశధార: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
 
==వంశధారానది ఒక కథనం==
[[శ్రీకాకుళం జిల్లా]] లో ప్రవహించే వంశధారానదియొక్క ఒక పాయకు కల కథనం ప్రకారం దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండబెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉదృతంగా రాజు వేపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను. అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను.
 
==ఆంధ్రకు అదనపు నీరు==
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంశధార నదినీరును అదనంగా ఉపయోగిం చుకోవడానికి ఉద్దేశిం చిన రెండోదశ ప్రాజెక్టు అవాంతరాలను ట్రిబ్యునల్ తొలగించింది. వంశధార నది ఆంధ్ర- ఒడిషా సరిహద్దుల్లో 29 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 82 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య 1962లో కుదిరిన ఒప్పందం ప్రకారం వంశధార నీటిని ఇద్దరు 50:50 శాతం వాడుకోవాలి. ఈ నదిపై నిర్మిం చాల్సిన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు దశలుగా విడ గొట్టింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాలు వలను నిర్మించింది. 17,841 టిఎంసిల నదీ జలాలను వినియో గిస్తోంది. తద్వారా 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. రెండో దశలో 16.048 టిఎంసిలతో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నేరడి ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని కోసం ఒడిషాలోని 106 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున ఇంతకాలం ఆలస్యం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పనిని కూడా రెండుగా విభజించి మొదటి దశగా గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ నిర్మించింది. 0.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు పూర్తిచేసింది. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పుతో కాట్రగడ్డ వద్ద సైడ్ వీయర్ నిర్మాణం చేపట్టి మరో 8 టిఎంసిలను వినియోగించుకోవడానికి వీలుచిక్కింది.
 
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు