విష్ణు పురాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''విష్ణు పురాణం''' ([[ఆంగ్లం]]: Vishnu Purana) చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్ధించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహర్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.
===విష్ణు పురాణ విశేషాలు ===
* ముందుగా విష్ణు మూర్తిని సర్వాంతర్యామిగా కీర్తించి తరువాత అతడి నుండి ప్రపంచం ఉద్భవించిన తీరు చెప్పబడింది. విరాట్పురుషుడి నుండి అవ్యక్తము దాని నుండి ఆత్మ, దాని నుండి బుద్ధి, దాని నుండి మనసు దాని నుండి ఆకాశం దాని నుండి వాయువు, దాని నుండి తేజస్సు, దాని నుండి జలము దాని నుండి హిరణ్మయమైన అండము (భూమి) ఉద్భవించాయని చెప్పబడింది.
పంక్తి 9:
* తరువాత పాతాళ, రుద్ర, సుతల, గభస్తితలం, మహాతలం, భీమ తలం మొదలైన పాతాళాల వర్ణ అక్కడ నివసించే వారి వర్ణన జరిగింది.
* తరువాత పైలోకాల వర్ణ జరిగింది. మానవులు నివసించే భూలోకము, దేవతలు ఉండే భువర్లోకం, గోలోకమైన మహర్లోకం, బ్రహ్మ రార్తి సమయంలో అక్కడ జీవులు ఉంటారు. మహాత్ములుండే తపో లోకం, బ్రహ్మ నివసించే సత్య లోకం మొదలైన ఊర్ధ్వ లోకాల వర్ణనలు జరిగింది.
*తరువాత మేరు పర్వతం, లవణ సముద్రం చేత ఆవరించబడిన జంబూద్వీపం, పాల సముద్రం చేత ఆవరింప బడిన శాకాద్వీపం, నేతి సముద్రంతో ఆవరింప బడిన కుశ ద్వీపం, మీగడ సముద్రంతో ఆవరింప బడిన క్రౌంచ ద్వీపం, సురా సముద్రంతో ఆవరింపబడిన శాల్మల ద్వీపం, దానిని ఆవరించిన గోమేధం ఉన్నది.
* పుష్కర ద్వీపము నడుమన మానసోత్తర పర్వతం ఉన్నది. మేరువుకు అది తూర్పున ఉన్నది. ఆగ్నేయమున అగ్ని రాజధాని ప్రభావతీ నగరం, దక్షిణమున సంయమనీపురం, నైరుతి మూల విరూపాక్షుని విక్రాంత పురం ఉన్నది, పడమట వరుణ రాజధాని సుఖప్రభ, వాయవ్య మూల వాయవ్య రాజధాని శివ, ఉత్తరమున సోముని రాజధాని విభావరి, ఈశాన్యమున శివుని పురి శర్మదాపురి ఉన్నది.
* పుష్కర ద్వీపం, స్వర్ణద్వీపం, లోకాలోక వర్ణన, గర్భోదక సముద్రం దాని అందు నివసించు వారి వర్ణన జరిగింది.
పంక్తి 30:
* హిమాలయములలో గంధమాదన, కైలాస గిరి, నరనారాయణాశ్రమం, బదరి ఉన్నాయి. అక్కడ గంగ స్వచ్చమైన తెల్లని వేడి నీటిని ఇస్తుంది.
* అది కర్మ భూమి. అందు లెక్కించనలవి గాని అంతర్ద్వీపములున్నాయి. అక్కడ ఫలముల నిచ్చు వృక్షములు, రూపవతులగు స్త్రీలు, దండింనవసరం లేని సన్మార్గులైన మానవులు ఉన్నారు.
* మధ్య దేశమున పాంచాల, మత్స్య, యౌధేయ, కుంతి, కురు, శూరసేనులు ఉన్నారు. తూర్పున వృషధ్వజ, అంజన, పన్నులు, సుహ్మ, వెదేహ, కాశ, ఛేది, మాగధ, కోసలులు ఉన్నారు.వింధ్య పర్వతానికి ఆగ్నేయమున కళింగ, వంగ, పుండ్ర, అంగ, వైదర్భ, మూలకులు ఉన్నారు. దక్షిణమున పులింద, నరరాష్ట్ర, అశ్మక, జీమూత,కర్నాటక, భోజకటకులు ఉన్నారు. నైరుతిలో ద్రావిడ, నాగ, స్త్రీముఖ, కాంభోజ, శకులు, అనంత వాసులు ఉన్నారు. పడమట స్త్రీ రాజ్యం, సైంధవ, మ్లేచ్ఛులు, నాస్తికులు, యవనులు, పటుములు, నైషధములు ఉన్నారు. వాయవ్యమున తుషార, మూలిఖ, ఖశ, మఖ, మహాకోశులు, మహావాసులు ఉన్నారు. లంపగులు, తాళులు, నాగులు, మరుగాంధార, జాహుతులు హమవన్నివాసులు. ఈశాన్యమున త్రిగర్త, బ్రహ్మపుత్రులు, మీన, సతూగణ, కౌలూత, అభిసార, కాశ్మీరులు ఉన్నారు.
* మహేంద్రపర్వమున ఋషికుల్య, ఇక్షుగ, త్రిదివాలయ, లాంగూలి , వంశధార నదులు ఉన్నాయి.మలయ పర్వతమున కృతమాల, తామ్రపర్ణి, పుష్పజ, ఉత్పలావతి, శితోదక, గిరివహా నదులు ఉన్నాయి.సహ్య పర్వతమున తుంగభద్ర, ప్రకార, వాహ్య, కావేరి నదులు ఉన్నాయి. శుక్తిమతీ పర్వతమున ఋషిక, సుకుమారి, మందగ, మందవాసిని, నృపమాల, శిరి నదులు ఉన్నాయి. ఋక్షవత్పర్వమున మందాకిని, అశార్ణ, శోణ, దేవి, నర్మద, తమస, పిప్పిల అను నదులు ఉన్నాయి. వింధ్య పర్వతమున వేణి, వైతరిణి, నర్మద, కుమద్వతి, తోయ, సేతుశిల నదులు ఉన్నాయి. పారియాత్రా పర్వతమున పారా చర్మణ్వతి, పాద విదిశ, వేణువతి, సిప్రా, అవంతి, కుంతి నదులు ఉన్నాయి.
* హిమాలయాలలో జన్మించిన నదులు కౌశికీ, గండకీ, లౌహిత్యము, మేన, ప్రలయక్ష, బహుద, మహానది, గోమతి, దేవికా, వితస్తా, సరయూ, ఇరావతి, శతద్రు, యమున, సరస్వతి నది ఈ నది ఏడు పాయలు సుప్రభ, కాతరాక్షి, విశాల, మానసహ్రద, సరస్వతి, భీమనాద, సువేణువు. భాగీరధి.
"https://te.wikipedia.org/wiki/విష్ణు_పురాణం" నుండి వెలికితీశారు