కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుణ్ని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ వార్త నారదునివల్ల తెలుసుకొన్న దాక్షాయణి శివునికా వార్తను తెలిపింది. శివుని ఆజ్ఞ గైకొని యజ్ఞాన్ని చూడడానికి బయలుదేరింది. దక్షుడు ఆమెను పిలవని పేరంటానికి వచ్చినందుకు తిరస్కరించడమే కాకుండా శివుణ్ణి నిందిస్తాడు. అది భరించలేని దాక్షాయణి శివయోగాగ్నిలో దేహత్యాగం చేస్తుంది.
==మూలాలు==
పంక్తి 9:
==బయటి లింకులు==
*[https://archive.org/details/VeeraBadhraVijayamu వీరభద్ర విజయము -కె. రాజేంద్ర ప్రసాద్ గారి విమర్శనాత్మక Ph.D సిద్ధాంత గ్రంథము, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయము, 1989]