వేగుంట మోహన ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వేగుంట మోహన ప్రసాద్
| residence =
| other_names =వేగుంట మోహన ప్రసాద్
| image =Vegunta mohanaprasad.jpg
| imagesize = 200px
| caption = వేగుంట మోహన ప్రసాద్
| birth_name = వేగుంట మోహన ప్రసాద్
| birth_date = [[1942]] , [[జనవరి 5]]
| birth_place =
| native_place = [[విజయవాడ]]
| death_date = [[ఆగస్టు 3]] , [[2011]]
| death_place = [[విజయవాడ]]
| death_cause =
| known = ప్రముఖ సాహితీ వేత్త,బహుముఖ ప్రజ్ఞాశాలి,
| occupation =
| title =
పంక్తి 37:
 
 
'''వేగుంట మోహన ప్రసాద్''' (05 జనవరి 1942 - 03 ఆగస్ట్ 2011) ప్రముఖ సాహితీ వేత్త,బహుముఖ ప్రజ్ఞాశాలి, ''మో '' గా చిరపరిచితుడు.
==జీవిత విశేషాలు==
[[గుంటూరు]] సమీపంలో లాం గ్రామంలో [[1942]] , [[జనవరి 5]] న సుబ్బారావు, మస్తానమ్మ దంపతులకు జన్మించారు.ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. చెశారు. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు.సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఆంగ్ల శాఖాధిపతిగా 2000 జూలై 31న ఉద్యోగ విరమణచేసి ఆ తర్వాత ఐదేళ్లు ద్రవిడ విశ్వవిద్యాలయంలో అనువాద విభాగానికి నేతృత్వం వహించారు. కవిగా, అనువాదకునిగా ఆయన అపార ప్రతిభ కనబర్చారు.ఈయనకు భార్య సుజాత, కుమార్తె మమత ఉన్నారు.
పంక్తి 43:
ఆయన వ్రాసిన మొట్టమొదట కవిత "హిమానీహృది" 1960 మే నెల భారతి పత్రికలో ప్రచురించబడినది. [[మహారాష్ట్ర]] లో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ ‘చితి-చింత’ (1969) '''మో''' కి తెలుగు కవుల్లో ఒక ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. తెలుగు పాఠకులకు 1969లో ‘చితి-చింత’ కవితా సంపుటితో మో పరిచయమయ్యారు. 1970 దశకం దాకా ఉన్న కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయాలన్న తపనతో ‘ది టెన్స్ టైమ్’ను ప్రచురించారు.కరచాలనం గ్రంథం (1999), రహస్తంత్రి కవితా సంపుటికి మంచి పేరువచ్చింది. బతికిన క్షణాలు (1990), పునరపి (1993), సాంధ్యభాష (1999), వెనె్నల నీడలు (2004) కవితాసంపుటాలు అపురూప కవిగా స్థిరపరిచాయి. ఈ మధ్య ఖాదర్ మొహియుద్దీన్ -టిఎస్ ఇలియట్ ‘వేస్ట్‌లాండ్’ను చవిటిపర్ర (2011) పేరిట చేసిన అనువాదానికి ‘మో’ టీకా-టిప్పణి సమకూర్చారు. ఆత్మశ్రీయ ధోరణికి పెద్దపీట వేస్తూనే స్వాప్నికునిగా అనే్వషకునిగా తెలుగు సాహిత్యంపై ‘మో’ చెరగని ముద్ర వేశారు.
==అవయవ దానం==
ఆయన అస్వస్థతగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.ఆ తర్వాత రోజైన [[ఆగస్టు 3]] , [[2011]] ఉదయం ఆయన కోమాలోకి వెళ్ళిపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ మీద ఉంచారు. హైదరాబాద్‌లోని మోహన్ ఫౌండేషన్‌కు తన మూత్ర పిండాలు, కాలేయం, నేత్రాలను దానం చేస్తానని వారికి మోహన్ జీవించి ఉన్న కాలంలో అంగీకార పత్రం రాసి ఇచ్చారు. ఆయన తుది కోరిక నెరవేర్చడం కష్టమైన పని అయినప్పటికీ కుటుంబ సభ్యులు వైద్యులకు పూర్తిగా సహకరించారు. మోహన్ కోరిక ప్రకారం దానం చేస్తానన్న అవయవాలను తీసుకోవాలంటే శరీరం, కణాలు పూర్తిగా నిర్జీవం కాకూడదని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో మోహన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు సమ్మతితో తెల్లవారు జామున నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు ప్రత్యేక సర్జరీ ద్వారా మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు తొలగించి భద్రపరిచారు.నేత్రాలను మాత్రం నగరంలోని ఐ బ్యాంక్‌కు ఇచ్చారు. రెండు మూత్రపిండాలు, కాలేయం ఛార్టర్డ్ విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్ళారు.
 
==సూచికలు==