శోభనాచల పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:Gollabhama poster.jpg|thumb|శోభనాచల సంస్థకి పేరు తెచ్చిపెట్టిన చిత్రం [[గొల్లభామ (సినిమా)|గొల్లభామ (1947)]]]]
'''శోభనాచల పిక్చర్స్''' తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం [[దక్షయజ్ఞం (1941 సినిమా)|దక్షయజ్ఞం (1941)]]. [[గొల్లభామ (సినిమా)|గొల్లభామ (1947)]] చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన [[కీలుగుర్రం]] చిత్రానికి రాజా వారు దర్శకుడి మరియు నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన [[లక్ష్మమ్మ (సినిమా)|లక్ష్మమ్మ]] చిత్రాన్ని [[ప్రతిభా పిక్చర్స్|ప్రతిభా వారి]] [[శ్రీ లక్ష్మమ్మ కథ]]తో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో [[మద్రాసు]]లోని తేనాంపేట ప్రాంతంలోని [[శోభనాచల స్టూడియోస్|శోభనాచల స్టూడియోల]]లో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో [[వాహినీ స్టూడియోస్]] ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియో గా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పని చేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/శోభనాచల_పిక్చర్స్" నుండి వెలికితీశారు