శ్రీపాద పినాకపాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox musical artist
|name = శ్రీపాద పినాకపాణి
|image =
|caption =
|image_size = 200px
|background = వైద్యుడు, సంగీత విద్వాంసుడు
|birth_name =
|birth_date = {{Birth date and age|1913|8|3}}
|death_date = [[మార్చి 11]] , [[2013]]
|origin = {{Flagicon|India}} [[శ్రీకాకుళం]], [[India]]
|genre = [[కర్ణాటక సంగీతం]]
|occupation = [[వైద్యం]]
|years_active = 1930 - 2013
|label =
|website =
}}
రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ '''శ్రీపాద పినాక పాణి''' గారు 2012 ఆగస్ట్ 3న శత వసంతంలో అడుగిడినారు.. వైద్య, సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు వీరి శిష్యులే.. గురువులకే గురువు డా. శ్రీ పాద.. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న దినాలవి. నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆరోజులలో, తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు. ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేశారు.
== జననం, బాల్యం, విద్యాబ్యాసం ==
శ్రీపాద వారు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్ట్ 3వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు..రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు.. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు.. వారు 1939వ సంవత్సరలో లో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నారు.1945వ సంవత్సరంలో జనరల్ మెడిసన్లో ఎం.డి. పూర్తి చేసా
 
== రోగ నిర్మూలన ==
పంక్తి 23:
 
== రాగ సాధన ==
సంగీతం వింటూనే నొటోషన్స్ రాయగల నైపుణ్యం వీరి కుంది.. పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.
 
== శిష్యప్రముఖులు ==
డా.నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీ పాద వారి ప్రముశ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్యనారాయణ, నేదునూరికృష్ణమూర్తి, శ్రీరంగం గోపాల రత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతం లో వారిశిష్యులు..
== బిరుదులు, పురస్కారాలు ==
* వారి ఇతర బిరుదులు సంగీతకళా శిఖామణి, సప్తగిరి సంగీత విద్వాన్ మణి, గానకళాసాగర, [[కళాప్రపూర్ణ]] ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వారు అందుకొన్నారు.. వారి సంగీతాన్ని కేంద్రనాటక అకాడమీ రికార్డ్ చేసి ఆర్కైవ్స్ లో పొందు పరచింది.
* సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు.
* 1977 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు.
* 1978 లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] చే [[కళాప్రపూర్ణ]] బిరుదు అందుకున్నారు.
* 1984 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు తో సత్కరించింది.
* 2011 లో సంగీత నాటక అకాడమీ ఠాగూర్ ఫెలో గౌరవాన్ని పొందారు.
* [[2012]] ,[[ఆగష్టు 3]] న తన 99 వ జన్మదిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే "జ్ఞాన విద్యా వారథి" బిరుదుయివ్వబడినది.
 
== జయంతి ఉత్సవాలు ==
శత వసంతం లో అడుగిడిన శ్రీ పాద పినాక పాణి గారిని రాష్ట్ర ప్రభుత్వం ఘనం గా సత్కరించింది. శుక్రవారం [[కర్నూలు]] సునయన ఆడిటోరియంలో ఆయన శిష్యులతో సంగీత కార్యక్రమాన్ని రాష్ట్ర సాంస్కృతిక విభాగం, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి, జిల్లా కలెక్టర్ వారి కి సువరణ కంకణం బహుకరించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం రూ.10,01,116 లతోపాటు గాన విద్యావారధి బిరుదు ప్రదానం చేసారు.గణపతి దత్త పీఠం వారు సన్మాన పత్రాన్ని అంద చేసారు.. భీమిలి శివగంగ పరిషత్ చీఫ్ పాట్రన్ శివానంద మూర్తి గారు శ్రీ పాద వారిని శాలువతో సత్కరించారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/శ్రీపాద_పినాకపాణి" నుండి వెలికితీశారు