సత్యవతి (మహాభారతం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[Image:Ravi Varma-Shantanu and Satyavati.jpg|thumb|right|[[శంతనుడు]] సత్యవతి చూసి మోహించే సన్నివేశాన్ని [[రాజా రవి వర్మ]] చిత్రించాడు]]
'''సత్యవతి''', [[మహాభారతం]]లో [[శంతనుడు|శంతనుడి]] భార్య. [[కౌరవులు|కౌరవ]], [[పాండవులు|పాండవులకు]] మహాపితామహురాలు.
==వృత్తాంతము==
దాశరాజునకు పెంపుడుకూఁతురు. వ్యాసుని తల్లి. శంతనుని భార్య. శంతనుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు. ఈమె ఉపరిచర వసువు వీర్యమున శాపముచే మత్స్యమై యమునానదియందు ఉన్న అద్రిక అను అప్సరసకు జనించెను. మఱియు ఈమెకు యోజనగంధి, మత్స్యగంధి అను నామములు కలవు. ఈమె కన్యాత్వమున పరాశరమహర్షి వలన సద్యోగర్భము ధరించి కృష్ణద్వైపాయనుని (వ్యాసుని) కనెను.(పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879)
==వ్యాసుడి జననం==
ఒకమారు సత్యవతి పడవ నడుపుతుండగా [[పరాశరుడు]] అనే [[జ్యోతిశ్శాస్త్రం|జ్యోతిశ్శాస్త్ర]] ప్రవీణుడు అయిన మహాముని ఆమెను కామించాడు. తాపసులకిది తగదని ఆమె అభ్యంతరపెట్టినా అతను నిగ్రహించుకొనలేకపోయాడు.
==శంతనుడితో వివాహం==
దేవవ్రతుడు ([[భీష్ముడు]], గాంగేయుడు) అనే కుమారుని హస్తినాపురం రాజైన శంతనునికి అప్పగించి గంగ అతనిని విడచిపోయింది. తరువాత యమునాతీరంలో వేటకు వెళ్ళిన శంతనుడు సత్యవతిని చూసి మోహించాడు. తనకిచ్చి పెండ్లి చేయమని ఆమె తండ్రి దాశరాజును కోరాడు. అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెట్టేలాగయితేనే రాజుకు తన కుమార్తెనిస్తానని దాశరాజు చెప్పాడు.
|