సాలూరు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 10:
| birth_place = [[శివరామపురం]]
| native_place =
| death_date = [[అక్టోబర్ 25]],
| death_place =
| death_cause =
పంక్తి 41:
'''సాలూరు రాజేశ్వరరావు''' [[సాలూరు]] మండలములోని [[శివరామపురం]] గ్రామంలో 1922 సంవత్సరంలో జన్మించాడు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే “సరిగమలు” దిద్దాడు. సన్యాసిరాజుగారు ప్రముఖ వాయులీన విద్వాంసులైన [[ద్వారం వెంకటస్వామి నాయుడు]]కి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి. అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు, హార్మోనియం వాద్యకారునిగా, సంగీతాన్ని వినిపించేవాడు. అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా! "ఆ తోటలోనొకటి ఆరాధనాలయము", "తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని", "పొదరింటిలోనుండి పొంచి చూచెదవేల", "కలగంటి కలగంటి" లాంటి కొన్ని మంచి మంచి పాటల్ని ఇతని ద్వారానే మనకు లభించాయి.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్ గ్రామఫోను కంపెనీ బెంగుళూరుకు ఆహ్వానించడం జరిగింది. 1933-34 మధ్యకాలంలో “బాల భాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరావు ఆఫ్ విజయనగరం” కంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి
==సినీ జీవితం==
===మొదటి రోజులు===
సాలూరి ఖ్యాతి సినీ నిర్మాణ కేంద్రమైన మద్రాసు నగరానికి చేరడానికి మరెంతో కాలం పట్టలేదు. ఇతని గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం తమ ([[వేల్ పిక్చర్స్]]) రెండవ చిత్రానికి, ([[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]],1935), ఇతనిని “కృష్ణుడి” పాత్రధారునిగా ఎంపిక చేసుకొని మద్రాసుకు చేర్చారు.
“వేల్” వారి [[శశిరేఖాపరిణయం]] (మాయాబజార్ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో [[అభిమన్యుడు|అభిమన్యుడి]] పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా (''నను వీడగ గలవే బాలా, కానరావ తరుణీ'') పాడాడు.
1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (”విష్ణులీల”
===ఇల్లాలు సినిమా===
సాలూరిలోని సంగీతదర్శక ప్రతిభను కూడా గుర్తించిన [[రామబ్రహ్మం]] “ఇల్లాలు”లో కొన్ని పాటలు చేసే అవకాశం కల్పించాడు. రాజేశ్వరరావు కట్టిన వరసలు రామబ్రహ్మం చిత్రాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న బి.ఎన్.ఆర్ కు ( [[భీమవరపు నరసింహారావు]], [[మాలపిల్ల]] (1938), [[రైతుబిడ్డ]]
ఆ చిత్రంతో తెలుగు శ్రోతలకొక కొత్తరకమైన సంగీతం పరిచయం చేయబడింది. “లలిత సంగీత”మన్న దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించాడు. కలకత్తాలో బెంగాలీ సంగీతం ద్వారా ప్రభావితుడైన సాలూరి ఆధునికత్వం కోసం చేసిన ప్రయోగాలు తెలుగు సినీ పరిశ్రమలో అంతగా ఆదరణ పొందకపోయినా, తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా; ఆ తరువాత ఈయన పాడిన లలిత గీతాల ద్వారా, సమర్ధవంతంగా నిరూపించాడు. ఆర్కెస్ట్రా నిర్వహణలో “హార్మొనీ” యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆయనకు అర్థమయినంతగా మరెవ్వరికి కాలేదేమో!
===బాలసరస్వతితో స్వరమైత్రి===
“ఇల్లాలు”లో సాలూరి, [[రావు బాలసరస్వతి|బాలసరస్వతి]] పాడిన “కావ్యపానము చేసి కైపెక్కినానే” అన్న [[బసవరాజు అప్పారావు]]గారి పాట ఆనాటి
ఇంక తానే బాణీలు కట్టుకొని, మధురంగా, సున్నితంగా ఆలపించిన “చల్లగాలిలో యమునాతటిపై”, “పాట పాడుమా కృష్ణా”, “గాలివానలో ఎటకే వొంటిగ”, “ఓహో విభావరి”, “ఓహో యాత్రికుడా”, “ఎదలో నిను కోరితినోయి”, “షికారు పోయిచూదమా”, “హాయిగ పాడుదునా చెలీ” వంటి పాటలు ఈనాటికీ సంగీతప్రియుల గుండెల్ని పులకరింపజేస్తున్నాయి.
పంక్తి 69:
===మల్లీశ్వరి సినిమా===
ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి [[మల్లీశ్వరి]] (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. [[వి.ఎ.కె.రంగారావు]]గారి మాటల్లో చెప్పాలంటే “[[బి.ఎన్.రెడ్డి]] కార్యదక్షతతో, [[దేవులపల్లి]] మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, [[పసుమర్తి కృష్ణమూర్తి]] నృత్య సారధ్యంతో, [[ఘంటసాల]] [[భానుమతీ రామకృష్ణ|భానుమతి]]ల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది వున్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ '' "చంద్రలేఖ" కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్కి రాసింది కాదు! బి.ఎన్.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్ కంపోజింగ్ జరిగిందని చెప్తే ఈ రోజుల్లో ఎవరికైనా ఆశ్చర్యగా ఉంటుందేమో'' అని అన్నాడు. ఈ చిత్రంలో చేపట్టని సంగీతప్రక్రియ లేదేమో! ప్రతి సంగీత విద్యార్ధి మొదటిగా నేర్చుకొనే ''శ్రీగణనాధ సింధూరవర్ణ'' (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (''ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ''), హాస్య గీతం (''కోతీబావకు పెళ్ళంట''), ప్రకృతి పాట (''పరుగులు తీయాలి''), జావళి ( ''పిలచిన బిగువటరా''), జానపదం (''నోమీన మల్లాల''),
===విప్రనారాయణ సినిమా===
“మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం [[విప్రనారాయణ]] (1954). ''ఎవ్వాడే అతడెవ్వాడే'' అన్న అపూర్వమైన రాగమాలికనొక్కసారి (భైరవి, మోహన, కాపి, వసంత) జ్ఞప్తికి తెచ్చుకోండి! ఈ చిత్రంలోని ప్రతి పాటా గొప్పదే. ''పాలించర రంగా'' (హేమవతి), ''చూడుమదే చెలియా'' (హిందోళం),
==ప్రతిభ==
శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు.
లక్ష్మన్న తమ వ్యాసంలో సాలూరిపై [[పెండ్యాల నాగేశ్వరరావు]] అభిప్రాయాన్ని పేర్కొన్నాడు. అలాగే సహ దర్శకుల యెడల సాలూరికున్న గౌరవాభిమానాలు గుర్తించదగ్గవి. ఉదాహరణలుగా పెండ్యాల “భీంపలాస్”లో స్వరపరచిన ''నీలిమేఘాలలో గాలి కెరటాలలో'' (బావామరదళ్ళు, 1960), [[రమేష్ నాయుడు]] 'కల్యాణి' రాగంలో చేసిన ''జోరు మీదున్నావు తుమ్మెదా'' ([[శివరంజని]], 1978) పాటలను తనకు నచ్చిన ఉత్తమమైన గీతాలుగా యెన్నుకుంటూ వారిని కొనియాడడం చెప్పుకోవచ్చు.
ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు [[రాజు పేద]] (54), [[మిస్సమ్మ]] (1955), [[భలేరాముడు]] (1956), [[మాయాబజార్]] (1957, 4 పాటలు మాత్రమే), [[అప్పుచేసి పప్పుకూడు]], (1958), [[చెంచులక్ష్మి]] (1958),
అభేరి (భీంపలాస్), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసలను గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. ''జగమే మారినది'' (కల్యాణి, [[దేశ ద్రోహులు]]
సాధారణంగా, సృజనాత్మకత అన్నది పెరుగుతున్న వయసుతో తగ్గుతూ పోతుంది అనడం కద్దు. కాని, సినీరంగంలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు దాటిన తరువాత కూడా ఆయనలో అలాంటి తగ్గుదలేమి లేదని చెప్పడానికి ఈ మూడు రికార్డులు, 1977లో చేసిన ''ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు'' ([[ఈనాటి బంధం ఏనాటిదో]]), 1980లో చేసిన ''అభినందన మందారమాల'' ([[తాండ్ర పాపారాయుడు]]), ''కృష్ణం వందే జగద్గురుం'' (ప్రైవేటు ఎల్ పి.) చాలు.
పంక్తి 88:
ఏదో ఒక సంగీతానికే కట్టుబడి వుండాలని ఈయన మడికట్టుకు కూర్చోలేదు. ''మారుతున్న కాలాన్నిబట్టి పరిస్థితులు ఎన్నో మారుతున్నాయి. అదే విధంగా సినిమా సంగీతంలో కూడా మార్పులెన్నో వచ్చాయి. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని, జాజ్, పాప్, రాక్, డిస్కో వంటి అధునాతన పాశ్చాత్య సంగీతాన్ని మనం అడ్జస్ట్ చేసుకోక తప్పలేని పరిస్థితి. వాటిని మనం అనుసరించడంలో తప్పులేదు. కానీ, కేవలం అనుసరించడం, అనుకరించడం కోసమై మన సంగీతానికి ప్రాణసమానమైన 'మెలొడీ' ని ఈతరంవారు మర్చిపోతున్నారు'' అని అన్న ఆయన మాటలు ఎంతయినా నిజం. ముఖ్యంగా ఈనాడు! సాంఘికమైనా, పౌరాణికమైనా తను నమ్ముకున్న మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించాడు.
[[ఆహుతి]] (1950)తో తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ చిత్రానికి సంగీతం నిర్వహించిన ఖ్యాతి కూడా ఈయనదే ([[శ్రీశ్రీ]]కి కూడా సినీగేయ రచయితగా ఇది మొదటి చిత్రం.) సాధారణంగా డబ్బింగ్ సినిమాలలో పాటలన్నా, వాటి సంగీత దర్శకులన్నా లోకంలో కొంత చిన్నచూపుతో చూస్తాడు. అవే వరసలు మరల వాయించడమే కదా అన్నట్లుగా! కానీ [[ఆహుతి]]లో పాటలు ''ప్రేమయే జనన మరణ లీల'' ([[ఘంటసాల]]), ''హంసవలె ఓ పడవా వూగిసరావే''
==కుటుంబ సభ్యులు==
|