[[భారత దేశము]] యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను '''శాసనమండలి''' అంటారు. 2829 రాష్ట్రాలలో కేవలం 67 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[జమ్మూ కాశ్మీరు]],[[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]]. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ. అనగా [[శాసన సభ]] వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్]] శాసన మండలిలో మొత్తం సభ్యుల స్థానాల సంఖ్య 90 [http://ceoandhra.nic.in/council/Election%20Notifications.G.Os.pdf]