ప్రాచీన కాలంలో మాతృస్వామిక తెగల్లో [[కన్యాశుల్కం]] అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లి తండ్రులకేతల్లిలకే పెళ్ళి కొడుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. వేదకాలం వచ్చేసరికి మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. పూర్వం సృష్టిధర్మం ప్రకారం పురుషులు అహర్నిశలు కష్టబడి డబ్బు సమకూర్చేవారు, స్త్రీలు తమ ఇంటిపట్టున ఉండి సంసారాల్ని చక్కబెట్టుకునేవారు. పురుషుడు తన భార్యా పిల్లలను పోషించడానికి ఆర్ధిక పరిస్థితి సరిపోయేది కాదు. కనుకు ఆడపిల్లను ఇచ్చేవారు అల్లుడికి ఎంతోకంత ధనం ఇచ్చేవారు. ఇలా వరకట్న ఆచారం పుట్టింది. వర కట్నం పురుషుడు సంపాదించే డబ్బుకి కలిస్తే మరింత బలంగా ఉండేది. ఏ కారణం చేతనైనా భర్త చనిపోతే భార్యకు వరకట్నడబ్బైనా రక్షణగా ఉంటుందని కూడా భావన ఉండేది. వరకట్నం దుర్వియోగమయ్యేది కాదు.