యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 35:
}}
నవంబర్ 24, 1953లో [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]] దగ్గర [[వానపాముల]] లో జన్మించిన '''యార్లగడ్డ లక్ష్మీప్రసాద్''' ఆంధ్ర విశ్వకళా పరిషత్, [[హిందీ]] విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, [[తెలుగు]], హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. [[నందిగామ]] కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా (1996-2002) కూడ సేవలందించాడు.
 
లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితి రాయబారిగా యు.ఎస్.ఎ. , మలేషియా, కెనడా, ధాయ్ లాండ్, సింగపూరు, ఇంగ్లాండ్, ప్రాన్స్, మారిషన్, రష్యా వంటి అనేక దేశాలు పర్యటించారు.
 
 
లక్ష్మీప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక సాహిత్యఅకాడమీ అవార్డు-2009కి ఎంపికయ్యారు. ఆయన రాసిన 'ద్రౌపది' తెలుగునవలకుగాను ఈ పురస్కారం వరించింది. లక్ష్మీప్రసాద్‌కు సాహిత్యఅకాడమీ అవార్డురావడం ఇది రెండోసారి. బిషన్‌సహానీ రాసిన 'తామస్‌' అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందారు. కాగా, ఈ సారి ద్రౌపది పాత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని విలక్షణంగా ఆవిష్కరించినందుకు సాహిత్య అకాడమీ సృజనాత్మక అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఒకే రచయిత రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.
 
==పురస్కారాలు, పదవులు==
* [[పద్మశ్రీ]] - 2003