నా జీవిత యాత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 3:
టంగుటూరి ప్రకాశం పంతులు తన ఆత్మకథను వ్రాసి 1949లో ప్రచురించారు. ఈ ఆత్మకథలోని మూడువంతుల భాగాన్ని ప్రకాశం రాయగా, ఆయన పనులవత్తిడి, ఆపైన అనారోగ్యంతో మరణం పొందడంతో మిగిలిన భాగాన్ని ప్రకాశం అనుంగు శిష్యుడు [[తెన్నేటి విశ్వనాథం]] వ్రాసి పూర్తిచేశారు.
== జీవిత విశేషాలు ==
పేద కుటుంబంలో జన్మించి అత్యంత కష్టభాజనమైన జీవితాన్ని బారిస్టరు చదువు వరకూ నడిపించిన ప్రకాశం 20వ దశకం తొలినాళ్లలో మద్రాసులో విపరీతంగా డబ్బు, పేరు సంపాదించిన న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నారు. తన వృత్తి శిఖరాయమానంగా ఉండగా ఆ రోజుల్లోనే లక్షాధికారియైనా గాంధీ పిలుపునందుకుని దేశం కోసం వృత్తిని, ఆపైన స్వరాజ్య పత్రికను నిర్వహించడంలో సమస్త సంపదనూ త్యాగం చేసిన వ్యక్తి ఆయన. ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ చరిత్ర ఆయన పేరు లేకుండా సాగదు.
|