సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[1885]] లో వనారస సోదరులు [[వనారస గోవిందరావు]] మరియు [[వనారస చిన్నరామయ్య]] కలిసి వైఎస్ఆర్ జిల్లా [[చక్రాయపేట]] మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకములోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది.
 
[[బొమ్మ:Surabhi-maya-bazaar-scene1.jpg| thumb| right| మాయా బజార్ నాటకంలో శశిరేఖగా మారిన ఘటోత్కచుడు, చెలికత్తెలను మగవాని కదలికలతో భయపెట్టుట]]
స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. [[సినిమా]] మరియు [[టీవీ]]ల ఆగమనముతో [[1974]] కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించినది. [[1982]] నాటికి కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నవి. ప్రస్తుతము ఆంధ్ర దేశములో సురభి నాటక కళాసంఘము ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నవి.[[బొమ్మ:SreeVenkateswaraNatyaMandali.jpg| thumb|right| శ్రీ ఆర్ నాగేశ్వరరావు సారధ్యంలో శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి వారి మాయాబజార్ నటులు]]
 
వీటిలో అన్నింటికంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి [[1937]] లో గోవిందరావు ఐదవ కూతురు సుభద్రమ్మ మరియు ఆమె భర్త ఆర్.వెంకట్రావు చే స్థాపించబడినది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, బాబ్జి మరియు గణపతి రావులు మరియు వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు కలరు.
 
వీరి నాటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం [[మాయాబజార్]]. ఆభిమన్యుడు, శశిరేఖ వివాహానికి ఘటోత్కచుడు అనే రాక్షసుడు (భీమ, హిడింబ కుమారుడు) తన మాయాజాలంతో జరిగేటట్లు చేయడం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. కళాకారులు పెద్దగా చదువుకోకపోయిన, సినిమాలో లాగా, సెట్టింగులతో యుధ్ధం జరిగినపుడు, మంటలు సృష్టించటం ఆతరువాత వాన కురిపించడం, అలాగే ఒకే సమయంలో రంగస్థలంపై, అభిమన్యుడు, శశిరేఖ వేరు వేరు సెట్టింగులలో విరహ గీతం పాడటం చాలా ఆకర్షణగా వుంటుంది.
ఇలాంటి నాటక సమాజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. తొలితెలుగు సినీనటీమణి [[సురభి కమలాబాయి]] సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.
 
== సురభి నాటక సమాజాలు ==
=== # శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి ===
 
వీటిలోసురభి అన్నింటికంటేనాటక సమాజాలన్నింటికంటే పెద్దదైన '''శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి''' [[1937]] లో [[వనారస గోవిందరావు]] ఐదవ కూతురు సుభద్రమ్మ మరియు ఆమె భర్త ఆర్. వెంకట్రావు చే స్థాపించబడినది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, బాబ్జి మరియు గణపతి రావులు మరియు వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు కలరు.
తొలితెలుగు సినీనటీమణి [[సురభి కమలాబాయి]] సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సురభి_నాటక_సమాజం" నుండి వెలికితీశారు