సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
సురభి నాటక సమాజాలన్నింటికంటే పెద్దదైన '''శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి''' [[1937]] లో [[వనారస గోవిందరావు]] ఐదవ కూతురు సుభద్రమ్మ మరియు ఆమె భర్త ఆర్. వెంకట్రావు చే స్థాపించబడినది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, [[సురభి బాబ్జీ]] (నాగేశ్వరరావు) మరియు గణపతిరావులు మరియు వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు కలరు.
 
ఫ్రాన్స్‌లో 2013 మే 4 వ తేదీ నుంచి 18 వరకు జరగిన అంతర్జాతీయ ఉత్సవాలలో 44 మందితో కూడిన శ్రీవెంకటేశ్వర నాట్య మండలి [[మాయాబజార్ (నాటకం)|మాయాబజార్]], [[భక్తప్రహ్లాద]], శ్రీకృష్ణలీలలు, [[పాతాళ భైరవి]] నాటక ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగులో ప్రదర్శించనున్న ఈ నాటకాన్ని ముందుగా ఇంగ్లీస్‌లోకి, ఆ తర్వాత ఫ్రెంచ్‌లోకి తర్జుమా చేసి డిస్‌ప్లేల ద్వారా చదువుకునే వీలు కల్పించారు. ఫ్రాన్స్‌లో 35 రోజుల పాటు ఈ బృందం మొత్తం 18 నాటకాలను ప్రదర్శించారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సురభి_నాటక_సమాజం" నుండి వెలికితీశారు