సూర్యదేవర సంజీవదేవ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
 
ఈయన జీవితమే మహత్తరమైనది. బాల్యంలోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసాడు. హిమాలయాలలో కొంత కాలమున్నారు. అక్కడ ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశం మొత్తం తిరిగాడు. చాలా భాషలు నేర్చుకున్నాడు. [[ఎస్పరాంటో]] అనే కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉన్నది. [[లక్నో]] లో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. ఇతని [[కలం స్నేహం]] అపరితమైనది. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవాడు. అమెరికాలోని [[ఆల్డస్ హక్స్‌లీ]] నుంచి అమెరికాలో స్థిర పడిన ప్రముఖ చిత్రకారుడు రామారావు వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. [[జిడ్డు కృష్ణమూర్తి]] నుంచి [[బుచ్చిబాబు]], [[గోపీచంద్]] ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. [[రాహుల్ సాంకృత్యయన్]] నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ [[రవీంద్రనాధ టాగోర్]] నుండి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో ఇతనికి మంచి మైత్రి కూడా ఉండేది. ఇతను నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. సంజీవదేవ్ వల్ల [[తెలుగు]] ప్రాంతం గౌరవం పెరిగింది అని ఆ ప్రాంత ప్రజలు అనేవారు.
 
మానవతావాది అయిన సంజీవదేవ్ ఏ ప్రాంతమూ పరాయిది కాదు. ఏ మనుషులూ పరాయివారు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలోపెట్టాడు. ఈయన 1999 ఆగస్టు 25న మరణించాడు.