ఆంధ్రుల సాంఘిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 29:
== రచన నేపథ్యం ==
దీన్ని 1949 లో మొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రకటించింది. ఆ తరువాత ఈ గ్రంథాన్ని అనేక ముద్రణల తరువాత విశాలాంధ్ర తిరిగి ముద్రించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ భాషలకు ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంథానికి ఇచ్చింది. ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ఆటపాటలు మొదలైన వాటికి చోటు ఇచ్చింది. అనేక భారతీయ భాషల లోకి ఇది అనువాదమైంది. దీనిని సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, హైదరాబాదు వారు 1982 సంవత్సరంలో మూడవసారి 2000 కాపీలు ముద్రించారు.<br />
ప్రతాపరెడ్డి గ్రంథానికి ముందుమాటలో తనకు పూర్వమే ఈ విషయాన్ని భావన చేసి అలాంటి ప్రయత్నాలు చేసినవారి పేర్లు ప్రస్తావించారు. [[చిలుకూరి వీరభద్రరావు]] తన [[ఆంధ్రుల చరిత్రము]] గ్రంథంలోని వెలమవీరుల చరిత్ర ప్రకరణంలో పుట అడుగున "ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రత్యేకంగా విరచింపబడుతున్నది. కావున ఈ విషయమై(వెలమాది జాతుల సంగతి) అందు సవిస్తరంగా చర్చింపబడుతున్నది" అన్నారు.<ref>ఆంధ్రుల చరిత్రము:చిలుకూరి వీరభద్రరావు:వెలమవీరుల చరిత్ర ప్రకరణం ప్రారంభంలో</ref> దాని ఆధారంగా చూస్తే వీరభద్రరావు కొంతవరకూ ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసే ప్రయత్నం ప్రారంభించి ఏవో కారణాంతరాల వల్ల నిలిపివేసి ఉండొచ్చని ప్రతాపరెడ్డి భావించారు. ఐతే ఆంధ్రుల సాంఘిక జీవన చరిత్ర రచనలో ఇదే మొదటి గ్రంథంగా పేర్కొంటున్నారు.
==బయటి లింకులు==
|