గోదావరి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
గుండెల్లో గోదావరితో ప్రారంభించి ఆవకాయ కథతో ముగిసిన ఈ సంకలనంలో మొత్తం 11కథలు ఉన్నాయి. '''గుండెల్లో గోదావరి''' కథ వరద బీభత్సం నేపథ్యంగా సాగుతుంది. మధ్యలో పెళ్లి, ఆపై పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులకు పరస్పరం అపనమ్మకం కలుగుతుంది. దాంతో వారిద్దరూ పెళ్ళినాడే పూర్వం తాము లైంగికంగా ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు చెప్పుకోవడం వైపుకు సాగుతుంది. '''త్రిలోక సుందరి''' గోదావరి వాసుల చైతన్యంతో ముడిపడ్డ కథ. కూనవరం సంతకు వెళ్ళిరావడానికి త్రిలోక సుందరి అనే లాంచి ఏకైక తరుణోపాయం. ఈ కథలో లాంచి యజమాని దృక్పథం మానవ విలువలకు చోటులేని దోపిడీ తత్త్వం. డాక్టర్ అవధాని ప్రజల మనిషి. గాంధేయవాది. హింస రేపే ప్రతిహింస సమర్థనీయమా కాదా అనే అంశం ఈ కథలో ప్రధానాంశం. '''అద్దరి-ఇద్దరి ''' మనిషి ఎంత ఎత్తుకు ఎదగగలడో ఎంత, లోతుకు జారగలడో చూపే కథ. ఒకపక్క ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి నీచప్రవర్తన, పేదవాడి ఉన్నత వ్యక్తిత్వ ప్రదర్శన ఈ కథలో ''కంపేర్ అండ్ కాంట్రాస్ట్'' ధోరణిలో చూపారు కథకుడు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఈ కథను ''ఈ సంపుటిలోకెల్లా తలమానికం అనదగ్గ కథ '' అని ప్రశంసించారు. ''బైరాగి '' కథలో గోదావరి ఒడ్డున నావ సంస్కృతిని అద్దం పట్టారు రచయిత.
[[వర్గం:తెలుగు కథలు]]
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/గోదావరి_కథలు" నుండి వెలికితీశారు