ధర్మవరం రామకృష్ణమాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 88:
==నాటకరంగం==
1886లో బళ్లారిలో సరసవినోదిని అనే నాటకసభను నెలకొల్పాడు. మొదట స్వప్నానిరుద్ధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించాడు. 1887లో చిత్రనళీయము అనే తెలుగునాటకాన్ని బళ్లారి పట్టణంలో మొదటిసారిగా ప్రదర్శించాడు. ఇతడు నాటకకర్తనే కాదు. నటుడు, దర్శకుడు కూడా. ఇతనికి సంగీతంలో ప్రవేశం ఉంది. పాటలు, పద్యాలకు రాగాలు తనే నిర్ణయించేవాడు. మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు రాగాలంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులకు ప్రీతి. రంగస్థలం మీద రాగయుక్తంగా పద్యాలను పాడే ఒరవడి రామకృష్ణమాచార్యులు తెచ్చిపెట్టిందే. ఇతడు దశరథ, బాహుళ,రాజరాజనరేంద్రుడు,చిరకారి,అజామిళ పాత్రలు అభినయించుటలో దిట్ట.
==సన్మానాలు==
* 1891లో మధ్రాసులో సంస్కృత పండితుడు ఓపర్ట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్నఖచిత బంగారు పతకం బహూకరించాడు.
* 1910లో గద్వాల మహారాజు ఇతడిని ఆంధ్రనాటకపితామహుడు అనే బిరుదుతో సత్కరించాడు.
* బళ్లారి పురప్రముఖులు ఇతడిని రత్నఖచిత కిరీటంతో సన్మానించారు.
==బయటి లింకులు==
* ధర్మవరం రామకృష్ణమాచార్యులు, పి.ఎస్.ఆర్.అప్పారావు, సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ, 1989. [http://books.google.co.in/books?id=aPoVGysfFhIC&dq=Dharmavaram+Ramakrishnamacharyulu&printsec=frontcover&source=bl&ots=-LsPC8R7RT&sig=EFofr1vd3o2NLFU24WB4IiQg-4c&hl=en&ei=imauSomnGIz6kAWhxt2VBg&sa=X&oi=book_result&ct=result&resnum=1#v=onepage&q=&f=false పూర్తి పుస్తకం]
|