పరీక్షిత్తు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== రచయిత ==
పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బహు గ్రంథకర్త. ఆయన పురాణేతిహాసాలకు హేతువుతో నిష్కర్ష చేసుకుంటు చరిత్ర కోణం నుంచి రాయడంలో సుప్రసిద్ధులు. 1928లో '''మహాభారత చరిత్రము''' అనే పేరుతో ఆయన వెలువరించిన గ్రంథం సంచలనాలకు కారణమైంది. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది.
 
== విషయ సంగ్రహం ==
మహాభారతంలో పాండవుల వారసుడైన పరీక్షిత్తు జీవితం గురించి ఈ కథలో అధ్యాయాలుగా వివరించారు. పరీక్షిత్తు జననానికి పూర్వరంగం, పరీక్షిత్తు జననం, ధర్మరాజు అశ్వమేధ యాగం, ఆపైన సంఘటనలు, పరీక్షిత్తు బాల్యం, మహాభారత యుద్ధం, పాండవుల పాలన, వారి మహాప్రస్థానం, పరీక్షిత్తు పాలన మొదలైన విషయాలు అధ్యాయాలుగా ఉన్నాయి. మహాభారతంలో పాండవుల వారసునిగా, భాగవతంలో భాగవత శ్రోతగా పరీక్షిత్తు ప్రవర్తిల్లుతాడు. ఇలాంటి పాత్ర జీవితక్రమాన్ని సామాజిక శాస్త్రం, శాస్త్రీయ దృక్కోణాలలో రచించడం విశేషం.