హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
పంక్తి 26:
*రామకృష్ణ రామస్వామి[http://uohydtelugu.blogspot.in/p/vc.html]
==విభాగాలు==
* ;మానవీయ శాస్త్రాల విభాగములు
**==తెలుగు శాఖ[http://uohydtelugu.blogspot.in/]==
{{main| ===హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ}}===
హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఏర్పడిన (1974) తర్వాత మొదట సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ లో భాగంగా తెలుగు, 1978లో పిహ్.డి. ప్రవేశాలతో ప్రారంభమై, క్రమంగా 1979లో ఎం.ఎ., 1980లో ఎం.ఫిల్. కోర్సులతో, 1985 లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్యా కొత్తపల్లి వీరభద్రరావు గారు మొదటి ఆచార్యులు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2011-2012 నాటికి 13 మంది అధ్యాపకులలో శాఖ విస్తరించింది.
[[దస్త్రం:తెలుగుశాఖ భవనం.jpeg|thumb|right|హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ]]
 
[[హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] మానవీయ శాస్త్రాల విభాగంలో [[తెలుగు శాఖ]]<ref> http://uohydtelugu.blogspot.in/</ref> చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు [[తెలుగు భాష]] పై [[పరిశోధన]] [[ఎం.ఫిల్]] మరియు [[పీ.హెచ్.డి]] లను అందిస్తున్నది. దీనికి ప్రస్తుతం ఆచార్య శరత్ జ్యోత్స్నరాణి<ref> [http://www.uohyd.ac.in/index.php/academics/2011-10-27-18-38-04/school-of-humanities/dept-telugu/faculty?layout=edit&id=587]</ref> గారు అధ్యక్షత వహిస్తున్నారు.
**===ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం[http://cclt.uohyd.ac.in/]===
ఈ కేంద్రాన్ని 2010 లో స్థాపించారు. బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్త. 2015 వరకు 150 లక్షల నిధులు యుజిసి కేటాయించింది. 112 పద్యాలతో మంచెళ్ల వెంకటకృష్ణకవి 1730 లో రచించిన వెంకట నగాధిపతిశతకం ముద్రించారు. 1930 లో రచించిన వర్ణరత్నాకరం అనబడే 8200 పద్యాల పుస్తకం పాఠకమిత్ర వ్యాఖ్యానంతో ప్రచురించబోతున్నారు. మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థ లో తెలుగు ఉత్కృష్టత కేంద్రం బాధ్యతలను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.<ref>[http://web.archive.org/web/20121113172358/http://www.andhrajyothy.com/i/2012/jun/4-6-12vividha.pdf ఉత్తమాటలు ఉత్తుత్తి ఫలితాలు - జిఎల్ఎన్ మూర్తి వ్యాసం, ఆంధ్రజ్యోతి వివిధ 2012-06-04 పరిశీలించిన తేది:2012-06-16] </ref>
 
Line 48 ⟶ 49:
తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం [[గోల్డెన్ త్రెషోల్డ్]] లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలి.
 
=== '''<big>ఇందిరా గాంధి స్మారక గ్రంధాలయము (IGM Library)</big>'''===
ఇందిరా గాంధి స్మారక గ్రంధాలయము, హైదరాబాదు విశ్వవిద్యాలయమునకు విద్య, బోధన మరియు పరిశోధన విషయములలొ అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంధాలయము మొదల గోల్డెన్ త్రెషొల్డ్ మరియు కాంపస్ శాఖలలొ కొనసాగినను విశ్వవిద్యాలయమునకు కేంద్రీయ గ్రంధాలయము గా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాల్ శర్మ గారు 21 October 1988 నుంచి ప్రారంభించారు. అదే సందర్భములో మన దివంగత ప్రియతమ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ సంస్మరణార్ధము ఈవిశ్వవిద్యాలయ గ్రంధాలయమునకు ఇందిరాగాంధి స్మారక గ్రంధాలయము అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునికపద్దతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంధాలయము ముఖ్యొద్దేశము. <br />
అందుకు తగినట్లుగా ఈ గ్రంధాలయము ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంధాలయఆన్ లైన్ గ్రంధసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంధాలయము కొనుగోలు చేసిన మరియు విశ్వవిద్యాలయ ఆర్ధిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంధాలయములో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధవిద్యార్ధుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు. <br />