షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి ముహమ్మద్‌ బాకర్‌ అమరుడైన తరువాత ఒక సంపాదకునిగా జాతీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ, నిరంకుశ పాలకుల కిరాతకత్వానికి బలైన ఏకైక పాత్రికేయుడిగా షోయాబుల్లా ఖాన్‌ మరోచరిత్ర సృష్టించారు. భారతదేశ స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో 1857లో ముహమ్మద్‌ బాకర్‌, 1948లో షోయాబుల్లా ఖాన్‌ తప్ప, ఆంగ్లేయుల, ఆంగ్లేయుల వత్తాసుదారుల దాష్టీకాలను అక్షరాయుధాలతో ఎదుర్కొని, ఆ క్రమంలో ప్రాణాలను సైతం బలిపెట్టిన మరో సంపాదకుడు గాని, ఇంకో పత్రికాధిపతి గాని కన్పించరు. ఆ విధంగా భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్ర తొలిథలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ ముహమ్మద్‌ బాకర్‌, మలిథలో ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌ ప్రాణ త్యాగాలు చేసి భారతీయ పత్రికారంగానికి ఎనలేని గౌరవప్రతిష్టలు సమకూర్చిపెట్టారు.<ref>హైదరాబాద్ మిర్రర్ 22.8.2013,,భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు</ref>
==పాత్రికేయునిగా==
సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది.తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు. కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు.రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. [[1948]] [[ఆగస్టు 22న22]] న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేదించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట స్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు.<ref> http://www.scribd.com/doc/189173348/50-Samvatsarala-Hyd-on-Shoebullah-Khan</ref> ,<ref>http://www.10tv.in/specials/Telangana-Rebellion-Shoaibullah-Khan-Fight-against-Nizam-for-Freedom-Yodha</ref>
 
==డిమాండ్లు==
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు