షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

దస్త్రం
పంక్తి 14:
==[[రావెల సోమయ్య]] కదనం==
1947 కు ముందు ఎం.ఎన్.రాయ్ ప్రారంభించిన "Independent India " పత్రికను షొయబుల్లాఖాన్ అందరికి పంచేవాడు.స్వతంత్రం వచ్చిన తరువాత పేరు మార్చుకొని రాడికల్ హ్యూమనిస్ట్ పేరుతో ఆ పత్రిక ఇప్పడికీ వస్తుంది .నిర్దాక్షిణ్యమైన చరిత్రరథం తన గమనంలో పక్షపాతంగా ఎందరో మహానుభావులను ఎక్కించుకోకుండానే వెల్లిపోతుంటుంది.అటువంటి వారిలో షోయబుల్లా ఖాన్ ఒకరు . ఆ రథం మెడలు వంచి ఇటువంటి మహానుభావుల్ని ఎక్కించాలి. షోయబుల్లా ఖాన్ మీదా ఇంటెర్నెట్ అంతా వెదికినా ఒక్క ఫోటో కానీ, వీకీపీడియాలో అతని చరిత్ర కానీ దొరకదు మనకు . 1990 ల్లో నటరాజన్ అనే అతను అమేరికా నుండి వచ్చి ఒక డాక్యుమెంటరీ తీస్తే ఇంతకీ అది ఎక్కడుందో కూడా తెలియదు. దాన్ని అన్ని భాషల్లోకి అనువదించమని అప్పటి ప్రదాని పి.వి.నరసిమ్హారావు ని అడిగిన కాళోజి మాట ఏమయ్యిందో ఇప్పటికీ తెలియదు. ఇంతకీ అతని గురించి తెలియని చాలా విషయాలు కింద లింక్స్ లో వున్నాయి. మీరే నిర్ణయించండి అతని త్యాగం , గొప్పదనం .<ref>https://www.facebook.com/photo.php?fbid=191811704341396&set=a.173030969552803.1073741829.100005377021376&type=1</ref>
==[[సయ్యద్ నశీర్ అహమద్]] కదనంకథనం==
బానిస బంధనాల నుండి విముక్తి కోసం సాగిన ప్రపంచ ప్రజాపోరాటాల చరిత్రలో అన్నివర్గాల ప్రజానీకంతోపాటుగా కలం యోధులైన పాత్రికేయులు, సంపాదకులు పలు నిర్బంధాలకు గురయ్యారు, చిత్రహింసల పాలయ్యారు, ఆంక్షలకు-నిషేధాలకు బలయ్యారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ అరుదైన త్యాగంతో 1857లో చరిత్ర సృష్టించారు. చిరస్మరణీయుడైన మహమ్మద్‌ బాకర్‌ మార్గంలో స్వేచ్ఛ-స్వాతంత్య్రాల కోసం అక్షరాలను ఆయుధంగా చేసుకుని చివరి శ్వాసవరకు పోరాడిన హైదరాబాద్‌ యోధుడు షోయాబుల్లా ఖాన్‌.
===గాంధీ విజయవాడ యాత్ర - షోయబ్ బాల్యం===
అది 1920 సంవత్సరం. జాతీయోద్యమం పరవళ్ళు తొక్కుతుంది. భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ విజయవాడకు వెడుతున్నారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ప్రస్తుత వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ విూదుగా సాగుతోంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు హబీబుల్లా ఖాన్‌ అను పోలీసు అధికారిని నియమించారు. ఆయన డ్యూటీలో ఉండగా గాంధీజీ ప్రయాణిస్తున్న రైలు రానే వచ్చింది. గాంధీజీని సమీపం నుండి చూసే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ డ్యూటీని ముగించుకున్న హబీబుల్లా ఖాన్‌ ఇంటికి వెళ్ళారు. ఆయన ఇల్లు చేరుకోగానే కుమారుడు పుట్టాడన్న శుభవార్త అందింది. ఆ రోజు అక్టోబరు17. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బిడ్డను చూసిన ఆయన మరింతగా సంతోషిస్తూ, అరే వీడు అచ్చం గాంధీజీ లాగే ఉన్నాడే ...అవే కళ్ళు...అదే నుదురు. అచ్చం గాంధీలానే ఉన్నాడు, అంటూ మరింత సంబరపడిపోయాడు. ఆ బిడ్డకు షోయాబుల్లా ఖాన్‌ అని నామకరణం చేసినా హబీబుల్లా ఖాన్‌ మాత్రం తన పుత్రరత్నాన్ని ఎంతో ప్రేమతో షోయాబుల్లా గాంధీ అని పిలుచుకోసాగారు.
ఆ బాలుడు చిన్నతనం నుండే, మహాత్మాగాంధీ గురించి వింటూ విద్యార్థిగా ఆయన రచనలను విస్తృతంగా చదువుతూ వచ్చాడు. ఆక్రమంలో గాంధేయ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన గాంధీజీ బాటను తన జీవితమార్గంగా నిర్ణయించుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం షోయాబుల్లా ఖాన్‌ నుండి గ్రాడ్యుయేషన్‌ చేశారు. నైజాం సంస్థానంలో మంచి హోదాగల ఉద్యోగం లభించగల అవకాశం ఉన్నా జాతీయోద్యమానికి సేవలందించేందుకు షోయాబుల్లా ఖాన్‌ జర్నలిజంను ప్రధాన వృత్తిగా చేపట్టారు.
Line 34 ⟶ 35:
ఆ మరుసటి రోజున షోయాబుల్లా ఖాన్‌ హత్యోదంతం మీద నైజాం ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సంఘటన విూద గూఢచారి విభాగం దర్యాప్తు జరిపిందని, అది రాజకీయ హత్య ఏమాత్రం కాదని, ఈ హత్యవెనుక ఎటువంటి రాజకీయ కారణాలు ఏమీ లేవని ప్రకటించింది. అది వ్యక్తిగతమైన శత్రుత్వం వలన మాత్రమే జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటూ, ఈ సంఘటన మీద ఇంకా విస్తృతంగా దర్యాప్తు జరుగుతుందని ప్రకటించి నైజాం ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి ముహమ్మద్‌ బాకర్‌ అమరుడైన తరువాత ఒక సంపాదకునిగా జాతీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ, నిరంకుశ పాలకుల కిరాతకత్వానికి బలైన ఏకైక పాత్రికేయుడిగా షోయాబుల్లా ఖాన్‌ మరోచరిత్ర సృష్టించారు. భారతదేశ స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో 1857లో ముహమ్మద్‌ బాకర్‌, 1948లో షోయాబుల్లా ఖాన్‌ తప్ప, ఆంగ్లేయుల, ఆంగ్లేయుల వత్తాసుదారుల దాష్టీకాలను అక్షరాయుధాలతో ఎదుర్కొని, ఆ క్రమంలో ప్రాణాలను సైతం బలిపెట్టిన మరో సంపాదకుడు గాని, ఇంకో పత్రికాధిపతి గాని కన్పించరు. ఆ విధంగా భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్ర తొలిథలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ ముహమ్మద్‌ బాకర్‌, మలిథలో ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌ ప్రాణ త్యాగాలు చేసి భారతీయ పత్రికారంగానికి ఎనలేని గౌరవప్రతిష్టలు సమకూర్చిపెట్టారు.<ref>హైదరాబాద్ మిర్రర్ 22.8.2013,,భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు</ref>
 
==పాత్రికేయునిగా==
సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది.తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు. కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు.రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. [[1948]] [[ఆగస్టు 22]] న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేదించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట స్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు.<ref> http://www.scribd.com/doc/189173348/50-Samvatsarala-Hyd-on-Shoebullah-Khan</ref> ,<ref>http://www.10tv.in/specials/Telangana-Rebellion-Shoaibullah-Khan-Fight-against-Nizam-for-Freedom-Yodha</ref>
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు