'''కోగిర జయసీతారాం''' అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. ఉపాధ్యాయుడిగా [[కూనపురంకోనపురం]], [[నడిపల్లినడింపల్లె (సోమందేపల్లె)|నడింపల్లె]], [[బొంతలపల్లిబొంతలపల్లె]], [[కోగిర]], [[రామగిరి]] మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 - 85 మధ్యకాలంలో పనిచేశాడు. ఆ పల్లెలలో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలిసి తిరుగుతూ ఆ ప్రజాజీవితాన్ని,భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లి ప్రజాకవిగా నిలిచాడు.