భారత జాతీయోద్యమంలో కాంగ్రెస్ వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. భగత్సింగ్ వంటి ప్రముఖ స్వాతంత్ర విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి రష్యాను మిత్రదేశమైన బ్రిటన్ను సమర్థించడం, ఆపైన కాంగ్రెస్ చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడం వంటి పరిణామాలు దీనికి కారణం కావచ్చు. కానీ అనంతర కాలంలో బొంబాయి నేవీ తిరుగుబాటు వంటి పోరాటాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్రం కోసం చేసిన ప్రయత్నాలు, పోరాటాలను ఈ గ్రంథంలో వ్యక్తుల వారీగా రాశారు.
ఇందులో ఎక్కువ భాగం " నేనెలా స్వాతంత్ర్యోద్యమంలోకి, కమ్యూనిష్టు ఉద్యమంలోకి వచ్చాను " అన్న సంక్షిప్త స్వీయ కథనాలు. మరికొన్ని కామ్రేడ్లు మరణానంతరం ఇతరులు వ్రాసినవి. వీనిలో ఎక్కువభాగం 1995, 1996 [[కమ్యూనిజం]] ప్రత్యేక సంచికలలొ ప్రచురించబడినవి.