చక్రధారి శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[శతకాలు]] తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ '''చక్రధారి శతకం'''. "చక్రధారీ!" అనే మకుటంతో ఈ పద్యాలను [[పింగళి వేంకట సుబ్రహ్మణ్య కవి]] రచించారు.
 
ఈ శతకం [[గుండవరపు మల్లికార్జునరావు]] గారి ద్రవ్యసహాయముతో 1933 సంవత్సరంలో బెజవాడలోని వాణీ ముద్రాక్షరశాల యందును మరియు 1935 సంవత్సరంలో గుంటూరు వాణీ ముద్రాక్షరశాల యందు ముద్రించబడినది.
 
==కొన్ని పద్యాలు==
<poem>
సీ. శ్రీజనార్ధనశౌరి సిరియు భూదేవియు
చేరియిర్వంకల సేవజేయ
వాణీశ్వరుడుగొల్వ వరశచీపతివేడ
శ్రీరతీపతిమ్రొక్క శీఘ్రముగను
సనకసాదులువచ్చి సంస్తుతింపవిశేష
ఖేచరాదులువచ్చి కీర్తినెన్న
మౌనివరులువచ్చి మధురభాషలుబల్క
సాధువాదములెల్ల సందడింప
 
లోకపాలురు మొదలు సు శ్లోకులెల్ల
ప్రాకటంబుగ గొనియాడ భక్తకోటి
కేవిపత్తులు రానీక నెపుడుబ్రోచు
చక్రధారీశ్రి తమనోబ్జ చయవిహారి.
</poem>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చక్రధారి_శతకము" నుండి వెలికితీశారు