ఇల్లిందల సరస్వతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
== రచన రంగం ==
ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. దరిజేరిన ప్రాణులు, ముత్యాల మనసు మొదలైన 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ''ఇయంగేహేలక్ష్మీ'', ఆంధ్రపత్రికలో ''వనితాలోకం'' శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. స్వర్ణకమలాలు, తులసీదళాలు, రాజహంసలు వంటి కథాసంకలనాలు వెలువరించారు.<ref>సామాజిక సాహిత్యవేత్త:తె.వె.బృందం:తెలుగు వెలుగు:మార్చి 2014:పే.22,23</ref>
===మనము మన ఆహారము===
[[కె.టి.అచ్చయ్య]] భారత ఆహార చరిత్రను గురించి సాధికారికమైన ఆంగ్ల గ్రంథాలు రచించిన ఆహార శాస్త్రవేత్త, ఆహార చరిత్రకారుడు. మనం నిత్యజీవితంలో తినే ఆహారంలో ఏ కాయగూరలు, పళ్ళు ఏయే ప్రదేశాల్లో జన్మించాయో, ఎప్పుడు భారతదేశం వచ్చాయో, ఏ కాలం నాటీ ప్రజలు ఎటువంటీ ఆహారాన్ని భారతదేశంలో స్వీకరించారో ఆహార చరిత్రలో చర్చకు వస్తుంది. ఈ గ్రంథం అంత లోతైనది కాదు. పలు ఆకరాల నుంచి భారతీయుల ఆహారంలోని న్యూట్రిషన్స్‌ గురించి స్వీకరించి వాటిని తేలికగా శాస్త్రంతో పరిచయం లేనివారికి కూడా అర్థమయ్యేలా చేయడం దీని లక్ష్యం. భారతదేశానికి సంబంధించిన పలు అంశాలను సవివరంగా భారత పాఠకులకు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన శీర్షిక - భారతదేశం-ప్రజలూ. ఆ శీర్షికన [[నేషనల్ బుక్ ట్రస్ట్]], ఇండియా ద్వారా ఈ అనువాద రచనను సరస్వతీదేవి రచించగా 1981లో ప్రచురితమైంది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%E0%A4%AE%E0%A4%A8%E0%A4%AE%E0%A5%81%20%E0%A4%AE%E0%A4%A8%20%E0%A4%86%E0%A4%B9%E0%A4%B0%E0%A4%AE%E0%A5%81&author1=%E0%A4%85%E0%A4%9A%E0%A4%BE%E0%A4%AF%E0%A5%8D%E0%A4%B0%E0%A4%BE%20%E0%A4%95%E0%A5%87%20%E0%A4%9F%E0%A5%80&subject1=GENERALITIES&year=1981%20&language1=telugu&pages=124&barcode=99999990175613&author2=NULL&identifier1=NULL&publisher1=Neshanal%20Buka%20Trasta,%20Indiyaa&contributor1=NULL&vendor1=NONE&scanningcentre1=cdac,noida&slocation1=NONE&sourcelib1=NBT&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20of%20India&digitalpublicationdate1=2004-12-27&numberedpages1=0&unnumberedpages1=0&rights1=Not%20Available&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=NULL%20&url=/data1/upload/0029/923 భారత డిజిటల్ లైబ్రరీలో మనము మన ఆహారము పుస్తకం.]</ref>
 
== సామాజికరంగం ==
తెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ''ఆంధ్ర యువతి మండలి''ని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు జైలు విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.