బ్రాహ్మణీకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: '''బ్రాహ్మణీకం''' నవలను గుడిపాటి వెంకట చలం వ్రాశాడు. 1937లో దీనిన... |
|||
పంక్తి 2:
==కథాసంగ్రహము==
సుందరమ్మ పల్లెటూరి బ్రాహ్మణపిల్ల. సంప్రదాయంగావస్తున్న నికార్సైన పూర్వాచారపరాయణకుటుంబం లో పుట్టిన కారణంచేత మడి, ఆచారం, దేవుళ్లు, దెయ్యాలు, జ్యోతిషాలు, సోదెలు మొదలైన మూఢనమ్మకాలుగల అమాయక ప్రవృత్తి కలిగింది. బహు చిన్ని వయస్సు అయినా పెద్ద ఆచారాలు, పెద్దమడులు, పెద్దవూహలు. ఎనిమిదోయేటనే మేనత్తకొడుక్కిచ్చి పెళ్లిచేశారు. పెళ్లికాగానే సంస్కృత విద్యాభ్యాసంకోసం పరదేశాలకు పోయి ఆరేళ్లు గడచివచ్చి కార్యంచేసుకుని భార్యతో కాపురం సాగించాడు. సుందరమ్మ యితని రసికతకు దీటైన సౌందర్యరాశు అవటంచేత రెండు సంవత్సరాలపాటు యధేచ్ఛగా ప్రవర్తించారు.
|