తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

చి Katta Srinivasa Rao, పేజీ సంగమేశ్వర స్వామి ఆలయం ను తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం కు తరలించారు: ఇది తీర్ద...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
అత్రి, బృగు, మౌత్గ ల్య మహా రుషులు శివునితో కలిసి వెంకటేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఈ ప్రాంతంలో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారని, ఈ ప్రాంతంలో మూడు నదులు ప్రవహిస్తుండటం చూసి గంగ, పార్వతీదేవితో శివుడు అక్కడే ఉండేటట్లు ప్రయత్నిస్తుండగా, పార్వతి వారించినా వినకుండా మనమందరం ఈ ప్రాంతంలోనే ఉండాల ని శివుడు రుషులతో చెప్పాడని, దీనికి పార్వతి సంతోషించిన పిదప శివుడు, పార్వతి, గంగలను ఇచ్చటనే ప్రతిష్ఠింప చేయాలని శివుడు రుషులను ఆజ్ఞాపించాడంటారు. ఆ మహారుషులు ఓ దివ్యముహూర్తాన గంగా సమేత స్వామి వారితో పాటు వినాయకున్ని, నందీశ్వరున్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. రుషులు ఈ శివాలయాన్ని గంగా సమేత సంగమేశ్వర స్వామి ఆలయంగా పేరుపెట్టారు. అక్కడ ప్రవహించే నదులైన మౌత్గల్య పేరున మున్నేరు, అత్రి మహర్షి పేరున ఆకేరుగా, బృగు మహర్షి పేరున బుగ్గేరుగా ఇక్కడ నదులు ప్రవహిస్తున్నాయి. కలియుగం మొదలైన తరువాత ఇక్కడ నిర్మించిన దేవాలయం అడవిలో పుట్టలతో నిండిపోవడంతో ఈ దేవాలయం కనబడకుండా పోయిందని ఒక పౌరాణిక కథనం
 
=== మళ్ళీ దేవాలయం వెలుగులోకి వచ్చిన విధం ===
ఎవరు కట్టించారో, ఎప్పుడు కట్టించారో తెలియక జనసంచారం లేని దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ దేవాలయం ఒంటరిగా ఎన్నాళ్ళుందో, ఎన్నేళ్ళుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఐదువందల ఏళ్ల క్రితం ఆయుర్వేద వైద్యులు బజ్జూరి నాగయ్య మూలికల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా, ఈ గుడి బయట పడినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయాన్ని నాగయ్య పాకయాజ్ఞులనే బ్రాహ్మణుని సహాయంతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి తీర్థాల అనే నామకరణం చేసినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకోగా, ఇక్కడ ఒక గ్రామం వెలసింది. అప్పటి నుంచి సంగమేశ్వరస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ గుడి విశిష్ట త బయటకు తెలియలేదు.
 
===ఆలయ అభివృద్ధి చర్యలు===
వంద సంవత్సరాల క్రితం ఈ దేవాలయానికి పూజారిగా వున్న రాఘవవర్మ తండ్రి రామయ్య గుడిని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేసారు. ఆయన వారసుడిగా వచ్చిన రాఘవవర్మ చుట్టుప్రక్కల గ్రామాల భక్తుల నుంచి విరాళాలను సేకరించి గుడికి ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, యాగశాలను నిర్మించారు. దేవాలయాభివృద్ధికి గతంలో పనిచేసిన రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా సహకారం అందించారట. 1968లో ఈ దేవాలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఈ దేవాలయానికి వచ్చే నిధులు, దాతల విరాళాలతో గుడిని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయాని కి 80 ఎకరాలు, పక్కనే ఉన్న వెంకటేశ్వరస్వామికి 40 ఎకరాల మాన్యం ఉంది. 1972లో దేవాలయానికి ట్రస్ట్‌బోర్డు ఏర్పాటయ్యింది.
 
తీర్థాల సంగమేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు అభివృద్ధి పరచేందుకు ఖమ్మం డివిజన్ రెవెన్యూ అధికారి వాసం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో భక్తుల నుంచి 20శాతం నిధులను సేకరించి వాటికి ప్రభుత్వం 80 శాతం నిధులను జతచేస్తు కొంతమేరకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ భక్తులు ఆలయానికి వెళ్ళేందుకు ప్రత్యేక రోడ్లు, బారికేడ్లు, మునే్నరులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్నానఘట్టాలు, తాగునీటి ఎద్దడి నివారించేందుకు వాటర్ ట్యాంక్‌లు మొదలైన మరికొన్ని పనులు పూర్తి చేయవలసి వున్నది.
 
===ఇబ్బందుల్లో అభివృద్ధి===
ఊరికి చాలా దూరంలో వుండటం వల్ల సరైన రక్షణ లేదు. దేవాలయంలో పలుసార్లు దొంగతనాలు జరిగి ఉత్సవ విగ్రహాలు మాయమయ్యాయి. గుడి ఆధీనంలో ఉన్న 120 ఎకరాల మాన్యం భూముల కౌలుదారుల వద్ద నుంచి కౌలు వసూలు చేయడంలో సరైన వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం దేవాలయానికి రావలసిన ఆదాయం రావడం లేదనేది మరో సమస్య.